1.15.2025

Head Massage: మీ తలకు ఇలా మసాజ్‌ చేస్తే.. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది..!

 

Head Massage: మీ తలకు ఇలా మసాజ్‌ చేస్తే.. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది..!

Head Massage: హెడ్‌ మసాజ్‌ తరచు చేస్తే.. జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. హెడ్‌ మసాజ్‌ లాభాలు, తలకు మర్దన ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.

Head Massage: మీ తలకు ఇలా మసాజ్‌ చేస్తే.. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది..!​​Head Massage: ఒత్తైన, మృదువైన, ఆరోగ్యకరమైన జుట్టును కోరుకోని వారుండరు. అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు ఒత్తైన జుట్టు కావాలనే ఆశ ఉంటుంది. చాలామంది హెయిర్‌ గ్రోత్‌ను ప్రోత్సహించడానికి, హెయిర్‌ ఫాల్‌ కంట్రోల్‌లో ఉంచుకోవడానికి.. రకరకాల ట్రీట్మెంట్స్‌ తీసుకుంటూ ఉంటారు, ఖరీదైన హెయిర్‌ ప్రాడెక్ట్స్‌ వాడుతుంటారు. అయితే.. ఇంట్లో ఉంటూనే సింపుల్‌ హెడ్‌ మసాజ్‌తో అందమైన, ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. హెడ్‌ మసాజ్‌ కుదుళ్లను దృఢంగా ఉంచడమే కాదు, మాడులో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. హెడ్‌ మసాజ్‌ ప్రయోజనాలు, తలకు మర్దన ఎలా చేయాలో ఈ స్టోరీలో చూద్దాం.

రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది..

హెడ్‌ మసాజ్‌ వ్లల హెయిర్ ఫోలికల్స్‌కి రక్త ప్రసరణ పెరుగుతుంది. జుట్టు కుదుళ్లకు పోషకాలు, ఆక్సిజన్‌ మెరుగ్గా సరఫరా అవుతుంది. మాడుకు రక్తప్రసరణ మెరుగ్గా జరిగితే.. జట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇలా తరచూ మర్దన చేయడం వల్ల జుట్టు ఎదుగుదల బాగుంటుంది.
​Potato Pack: బంగాళాదుంప రసాన్ని ఇలా రాస్తే.. పిగ్మెంటేషన్‌ మాయం అవుతుంది..!

ఒత్తుగా పెరుగుతుంది..

నూనెతో తరచూ మర్దన చేసుకోవడం వల్ల కురులు మిలమిలా మెరుస్తాయి. అలాగే ఒత్తుగా కూడా కనిపిస్తాయి. చివర్లు చిట్లడం వంటి సమస్యలను సైతం దూరంగా ఉంచడంలోనూ మసాజ్ ఉపయోగపడుతుంది.

ఒత్తిడి తగ్గుతుంది..

ఒత్తిడి కారణంగా హెయిర్‌ ఫాల్‌ సమస్య ఎక్కువగా ఉంటుంది. హెడ్‌ మసాజ్‌ విశ్రాంతిని ప్రేరేపిస్తుంది, ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది. ఒత్తిడి కారణంగా.. జుట్టు సమస్యలు ఉంటే వాటికి చెక్‌ పెట్టడానికి తల మర్దన సహాయపడుతుంది.

Head Massage: మీ తలకు ఇలా మసాజ్‌ చేస్తే.. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది..!

Authored Byరాజీవ్ శరణ్య | Samayam Telugu | Updated: 5 Feb 2024, 5:17 pm
Subscribe

Head Massage: హెడ్‌ మసాజ్‌ తరచు చేస్తే.. జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. హెడ్‌ మసాజ్‌ లాభాలు, తలకు మర్దన ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.

Samayam TeluguHead Massage: మీ తలకు ఇలా మసాజ్‌ చేస్తే.. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది..!
​​Head Massage: ఒత్తైన, మృదువైన, ఆరోగ్యకరమైన జుట్టును కోరుకోని వారుండరు. అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు ఒత్తైన జుట్టు కావాలనే ఆశ ఉంటుంది. చాలామంది హెయిర్‌ గ్రోత్‌ను ప్రోత్సహించడానికి, హెయిర్‌ ఫాల్‌ కంట్రోల్‌లో ఉంచుకోవడానికి.. రకరకాల ట్రీట్మెంట్స్‌ తీసుకుంటూ ఉంటారు, ఖరీదైన హెయిర్‌ ప్రాడెక్ట్స్‌ వాడుతుంటారు. అయితే.. ఇంట్లో ఉంటూనే సింపుల్‌ హెడ్‌ మసాజ్‌తో అందమైన, ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. హెడ్‌ మసాజ్‌ కుదుళ్లను దృఢంగా ఉంచడమే కాదు, మాడులో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. హెడ్‌ మసాజ్‌ ప్రయోజనాలు, తలకు మర్దన ఎలా చేయాలో ఈ స్టోరీలో చూద్దాం.

రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది..

హెడ్‌ మసాజ్‌ వ్లల హెయిర్ ఫోలికల్స్‌కి రక్త ప్రసరణ పెరుగుతుంది. జుట్టు కుదుళ్లకు పోషకాలు, ఆక్సిజన్‌ మెరుగ్గా సరఫరా అవుతుంది. మాడుకు రక్తప్రసరణ మెరుగ్గా జరిగితే.. జట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇలా తరచూ మర్దన చేయడం వల్ల జుట్టు ఎదుగుదల బాగుంటుంది.
Potato Pack: బంగాళాదుంప రసాన్ని ఇలా రాస్తే.. పిగ్మెంటేషన్‌ మాయం అవుతుంది..!

ఒత్తుగా పెరుగుతుంది..

నూనెతో తరచూ మర్దన చేసుకోవడం వల్ల కురులు మిలమిలా మెరుస్తాయి. అలాగే ఒత్తుగా కూడా కనిపిస్తాయి. చివర్లు చిట్లడం వంటి సమస్యలను సైతం దూరంగా ఉంచడంలోనూ మసాజ్ ఉపయోగపడుతుంది.
ఈ ఫుడ్స్ అతిగా తింటే.. జుట్టు కుచ్చులు, కుచ్చులుగా రాలుతుంది..!

ఒత్తిడి తగ్గుతుంది..

ఒత్తిడి కారణంగా హెయిర్‌ ఫాల్‌ సమస్య ఎక్కువగా ఉంటుంది. హెడ్‌ మసాజ్‌ విశ్రాంతిని ప్రేరేపిస్తుంది, ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది. ఒత్తిడి కారణంగా.. జుట్టు సమస్యలు ఉంటే వాటికి చెక్‌ పెట్టడానికి తల మర్దన సహాయపడుతుంది.

హెయిర్ ఫోలికల్స్ యాక్టివేట్‌ అవుతాయి..

సున్నితంగా తలకు మర్దన చేస్తే.. హెయిర్‌ ఫోలికల్స్‌ యాక్టివేట్‌ అవుతాయి. జుట్టు త్వరగా, ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. తరచూ మర్దన చేసుకోవడం ద్వారా తలలో చుండ్రు చేరకుండా జాగ్రత్తపడచ్చు. జుట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ప్రకాశవంతంగా మెరుస్తుంటాయి.

ఇలా మసాజ్‌ చేయండి..

  • మీరు తలకు మర్దన చేసుకునే ముందు ప్రశాంతమైన, సౌకర్యవంతమైన చోటును సెలెక్ట్‌ చేసుకోండి. ఆ ప్రదేశంలో లైట్లను డిమ్‌ చేయండి, రిలాక్సింగ్‌ మ్యూజిక్‌ ప్లే చేసుకోండి. ఇది మీకు రిలాక్సింగ్‌ మూడ్‌ సెట్‌ చేస్తుంది.
  • కొబ్బరి నూనె, ఆలివ్, జోజోబా నూనెలు మసాజ్‌కు బెస్ట్‌ ఆప్షన్స్‌. ఈ నూనెలు హెయిర్‌ గ్రోత్‌ను ప్రోత్సహిస్తాయి.
  • మసాజ్‌ ఆయిల్‌ డబుల్‌ బాయిలింగ్‌ పద్ధతిలో గోరువెచ్చగా వేడి చేయండి.
  • మసాజ్‌ చేయడానికి ముందు మీ జుట్టును సెక్షన్స్‌గా విభజించండి. చేతి వేళ్లతో కొంచెం మొత్తంలో నూనె తీసుకుని. మీ మెడ ప్రాంతం నుంచి నూనెను మీ తలకు సమాంతరంగా అప్లై చేయండి.
  • చేతివేళ్లను ఉపయోగించి, సున్నితంగా.. వృత్తాకార కదలికలతో మీ తలపై మసాజ్‌ చేయండి. హెయిర్‌ ఫాల్‌ ఎక్కువగా ఉన్న ప్రాంతాల వద్ద ఎక్కువ శ్రద్ధ పెట్టండి. 10-15 నిముషాల పాటు మసాజ్ కొనసాగించండి. మీ చేతి వేళ్లతో ప్రెజర్‌ పాయింట్స్‌ వద్ద ఒత్తిడి ఉంచండి. ఇవి మిమ్మల్ని రిలాక్స్‌ చేస్తాయి.
  • ఆ తర్వాత.. గంట వరకు ఆరనిచ్చి, మైల్డ్‌ షాంపూతో తలస్నానం చేయండి.


గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

జుట్టుకి నూనె చాలా ముఖ్యం

 

ఆరోగ్యకరమైన జుట్టుకి నూనె చాలా ముఖ్యం. మరి ఈ నూనె ఎప్పుడు రాస్తే మంచిదో తెలుసుకోండి.

జుట్టుకి నూనె రాసి రాత్రంతా అలానే ఉంటే జుట్టు పెరుగుతుందా..జుట్టు ఆరోగ్యానికి ఆయిల్ మసాజ్ చాలా మంచిది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి పొడుగ్గా పెరిగేలా చేస్తుంది. జుట్టు సమస్యల్ని దూరం చేయడంలో ఆయిల్ మసాజ్ ముందుంటుంది. దీని వల్ల ఎలాంటి లాభాలున్నాయో, ఎంత టైమ్ నూనె రాసుకుంటే మంచిదో తెలుసుకోండి.

ఆయిల్ మసాజ్..

చాలా మంది నూనె జుట్టు ఆరోగ్యానికి మంచిదని చాలాసేపటి వరకూ జుట్టుకి నూనె పెట్టుకుని ఉంటారు. కానీ, ఇందులో నిజం లేదని చెబుతున్నారు నిపుణులు.

గంట సమయం..

నిజానికీ ఓ రాత్రంతా జుట్టుకి నూనె రాయడం వల్ల మరీ అదనపు లాభాలు ఏం ఉండవు. తలస్నానానికి ఓ గంట ముందు జుట్టుకి నూనె సరిపోతుందని ఆయుర్వేదం చెబుతుంది. పొడి జుట్టుకోసం గంట, నార్మల్ హెయిర్ కోసం 30 నుంచి 45 నిమిషాలు.. ఆయిలీ హెయిర్ కోసం 15 నుంచి 20 నిమిషాలు సరిపోతుందని చెబుతున్నారు నిపుణులు.

జలుబు ఉన్నప్పుడు..

జలుబు వంటి సమస్యలు ఉన్నప్పుడు కేవలం 15 నిమిషాలు సరిపోతుందని చెబుతున్నారు నిపుణులు. పిల్లలకి కూడా 10 నుంచి 15 నిమిషాలు చాలు. మరీ ఎక్కువసేపు నూనె రాయడం అంత మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు.

రాత్రంతా నూనె తలపై ఉంచితే..

రాత్రంతా తలకి నూనె రాసి ఉంచడం అంత మంచిది కాదు. దీని వల్ల కఫ దోషం పెరుగుతుంది. దగ్గు, తలనొప్పి, జలుబు వంటి సమస్యలు పెరుగుతాయి. రాత్రంతా జుట్టుకి నూనె ఉంటే చుండ్రు పెరుగుతుంది.
గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

రాత్రంతా నూనె తలపై ఉంచితే.

 

రాత్రంతా నూనె తలపై ఉంచితే..

రాత్రంతా తలకి నూనె రాసి ఉంచడం అంత మంచిది కాదు. దీని వల్ల కఫ దోషం పెరుగుతుంది. దగ్గు, తలనొప్పి, జలుబు వంటి సమస్యలు పెరుగుతాయి. రాత్రంతా జుట్టుకి నూనె ఉంటే చుండ్రు పెరుగుతుంది.
గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

జలుబు ఉన్నప్పుడు..

 

జలుబు ఉన్నప్పుడు..

జలుబు వంటి సమస్యలు ఉన్నప్పుడు కేవలం 15 నిమిషాలు సరిపోతుందని చెబుతున్నారు నిపుణులు. పిల్లలకి కూడా 10 నుంచి 15 నిమిషాలు చాలు. మరీ ఎక్కువసేపు నూనె రాయడం అంత మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు.

మాటిమాటికీ ఆరోగ్య సమస్యలు

 

మాటిమాటికీ ఆరోగ్య సమస్యలు

విటమిన్ సి లోపం ఉంటుంటే ఊరికే జబ్బులు వస్తుంటాయి. విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్. ఇది ఆక్సీడేటివ్ స్ట్రెస్, ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని కాపాడతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ త్వరగా గాయాల్ని తగ్గిస్తాయి. కొల్లాజెన్ పెరిగేలా చేస్తుంది. విటమిన్ సి కారణంగా ఇన్ఫెక్షన్స్ పెరగకుండా ఉంటాయి. మీరు పండ్లు, కూరగాయలు తినడం వల్ల అందులో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. దీంతో మీ బాడీకి కావాల్సిన విటమిన్ సి అందుతుంది.

కీళ్లు, కండరాల నొప్పులు

 

కీళ్లు, కండరాల నొప్పులు

కీళ్లు, కండరాల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు రక్తహీనత సమస్య వస్తుంది. ఐరన్ అబ్జార్బ్ తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గుతుంది. దీంతో ఎప్పుడు చిరాగ్గా విచారంగా ఉంటారు. కొంతమంది బరువు కూడా తగ్గుతారు. ఏ పనులు చేయకుండానే ఎక్కువగా నొప్పులు వస్తుంటే దీనిని అనుమానించాల్సిందే.

నీరసం

 

నీరసం

ఊరికే అలసిపోవడం, నీరసంగా ఉన్నారంటే మీకు విటమిన్ సి కావాల్సిందే. మనం తీసుకునే డైట్‌లో సరైన విధంగా విటమిన్ సి లేకపోతే మనం ఏ పనిచేసినా ఊరికే అలసిపోతాం, త్వరగా నీరసంగా మారతాం. అందుకే, ఇలాంటి సమస్య ఉంటే వెంటనే డాక్టర్‌ని కలవండి. మిమ్మల్ని పరీక్షించి ఏం సమస్య ఉందో చెబుతారు.

గాయాలు తగ్గకపోవడం

 

గాయాలు తగ్గకపోవడం

మీకు ఏదైనా సర్జరీ, గాయాలు, పుండ్ల లాంటివి అయినప్పుడు ఆ తాలుకూ గాయాలు త్వరగా తగ్గవు. ఈ సమస్య రాకుండా ఉండాలంటే విటమిన్ సి ఎక్కువగా తీసుకోవాలి. అధ్యయనాల ప్రకారం, సర్జరీ అయిన వారు ఎవరైతే విటమిన్ సి సప్లిమెంట్స్ తీసుకున్నారో, ఆ ట్యాబ్లెట్స్ తీసుకోని వారి కంటే త్వరగా గాయాలు తగ్గినట్లు తేలింది. విటమిన్ సి హెల్దీ కొల్లాజెన్‌ని సపోర్ట్ చేస్తుంది. ఈ హెల్దీ ప్రోటీన్ స్కిన్‌‌ని స్మూత్ అండ్ సాఫ్ట్‌గా ఉండేలా చేస్తుంది. సరిపడా విటమిన్ సి మన బాడీలో లేకపోతే మనం వయసు కంటే పెద్దవారిలా కనిపిస్తాం. మీకు యవ్వనమైన మెరిసే చర్మం కావాలంటే కచ్చితంగా విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫుడ్స్, పండ్లు తీసుకోవాలి. అందులో కివీస్, ఆరెంజెస్ వంటివి ఉంటాయి.

స్కిన్ ప్రాబ్లమ్స్

 

స్కిన్ ప్రాబ్లమ్స్

మీకు సరిపడా విటమిన్ సి అందకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. విటమిన్ సి లెవల్స్ తగ్గితే చర్మం ఎర్రబడడం, రాషెస్ రావడం వంటివి జరుగుతాయి. అంతేకాకుండా నోటి చుట్టూ, పెదవల చివర్ల స్కిన్ డ్రైగా మారి పగులుతుండడం జరుగుతుంది. మీకు నార్మల్ కంటే త్వరగా గాయలవుతుంటే విటమిన్ సి లోపం కావొచ్చు. ఈ విటమిన్ బాడీలో రక్త సరఫరాని సరిగా జరిగేలా చూస్తుంది. ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తుంది. కానీ, ఈ విటమిన్ సరిపడా లేకపోతే త్వరగా సమస్యలొస్తాయి. కాబట్టి, ఈ విషయంలో కూడా జాగ్రత్త అవసరం. చర్మంపై గాయలవ్వడం, ముఖ్యంగా కాళ్ళు, చేతులపై గాయలవుతుంటాయి.

జుట్టు రాలడం

 

జుట్టు రాలడం

జుట్టు త్వరగా రాలుతుంటుంది. పొడిబారి, పెళుసుగా మారుతుంది. నిర్జీవంగా మారుతుంది. దీంతో జుట్టు బలహీనమవుతుంది. త్వరగా రాలుతుంది. రెగ్యులర్‌గా ఎక్కువగా జుట్టు రాలుతుంటే విటమిన్ సి లోపం ఉందో ఓ సారి చెక్ చేయండి. చిగుళ్ల సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వాపు, రక్తస్రావం వంటి సమస్యలొస్తాయి. ఊరికే దంత సమస్యలొస్తాయి. దంతాలు వదులుగా మారడం, ఊడిపోవడం వంటివి జరుగుతాయి. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి.

గమనిక:ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

రూ. 60కే ఇంటికి క్యాన్సర్‌ని తెచ్చుకోకండి

 రూ. 60కే ఇంటికి క్యాన్సర్‌ని తెచ్చుకోకండి.. మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే..






















అరటి పండులో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని పోషకాల పవర్ హౌస్ అంటారు. ఈ పండులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. కాబట్టి రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత దీనిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీ శరీరానికి అందుతాయి. ఇందులో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. ఇది అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అలాగే అరటిలో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. రోజు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అరటి పండు ఎనర్జీ బూస్టర్‌లా పనిచేస్తుంది. అంతేకాకుండా వ్యాయామాలు, జిమ్ చేసేవారు అరటిపండును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతాయి. అరటిపండు అనేది పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B6, ఫాస్పరస్ వంటి విటమిన్లు, ఖనిజాల గని.

జీర్ణశక్తిని బలోపేతం చేయడం, బరువు తగ్గడం, బరువు పెరగడం, బలమైన ఎముకలు, శక్తి స్థాయిలను పెంచడం, గుండెను ఆరోగ్యంగా ఉంచడం, రక్తంలో చక్కెరను నియంత్రించడం వంటి అనేక ప్రయోజనాలను అరటిపండు అందిస్తుంది. కానీ, ఇవన్నీ పొందాలంటే.. మీరు సహజంగా పండిన అరటిపండును తినాలి.

అయితే మీరు తినే అరటిపండ్లను ప్రమాదకరమైన రసాయనాలతో నిండి ఉన్నాయని మీకు తెలుసా..? మనం కేవలం రూ. 60కే డజన్ అరటి పండ్లు కొని.. మన ఇంటికి క్యాన్సర్ తెచ్చుకుంటున్నాం. పక్వానికి రాక ముందు అరటి పండ్లను తెంపేసి.. కార్బైడ్ రసాయనాన్ని ఉపయోగించి పండిస్తున్నారు. దీంతో.. మీ శరీరంలో విషం కలుస్తుంది. అసలు కార్బైడ్ అంటే ఏంటి..? దీనికి ఎలా చెక్ పెట్టాలో ఇక్కడ తెలుసుకుందాం.

కార్బైడ్ అంటే ఏంటి..?

అరటిపండ్లతో పాటు.. ఇతర పండ్లను పండించడానికి కార్బైడ్, ముఖ్యంగా కాల్షియం కార్బైడ్‌ను వినియోగిస్తున్నారు. ఈ రసాయనం పండ్లలోని తేమను ఎండబెట్టి.. వాటిలో ఇథైల్ అనే వాయువును ఉత్పత్తి చేస్తుంది. ఇథైల్ పండ్ల లోపల వేడిని ఉత్పత్తి చేస్తుంది. దీంతో.. పండ్లు పక్వానికే ముందు పండిపోతున్నాయి. కాల్షియం కార్బైడ్ వాడకాన్ని చాలా ప్రాంతాల్లో నిషేధించారు. కానీ, ఎక్కువ లాభాలు ఆర్జించాలనే ఆశతో కాల్షియం కార్బైడ్‌ని వినియోగిస్తున్నరు. ఈ రసాయనం వాడటం వల్ల పండ్లు నిర్ణీత సమయానికి ముందే పక్వానికి వచ్చి త్వరగా మార్కెట్‌కు చేరుకుంటున్నాయి. ఇది భారతదేశంతో సహా అనేక దేశాలలో నిషేధించబడిన రసాయనం. దీనిని ఆరోగ్యానికి ప్రమాదంగా గుర్తించారు. ఇలా పండిన పండ్లను తినడం వల్ల క్యాన్సర్‌తో సహా అనేక తీవ్రమైన వ్యాధుల ముప్పు పొంచి ఉంది.

ఈ రసాయనాన్ని భారతదేశంలో నిషేధించారు..

కాల్షియం కార్బైడ్‌లో సాధారణంగా ఆర్సెనిక్, ఫాస్పరస్ ఉంటాయి. ఈ రసాయనాల వాడకం వల్ల ఆరోగ్యానికి పెను ముప్పు కలుగుతుంది. ఈ ప్రమాదాల కారణంగా, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్ 2.3.5 ప్రకారం పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్ వాడకాన్ని నిషేధించారు. పండ్లను పండించడానికి ఇథిలీన్ సురక్షితంగా పరిగణించబడుతుంది. సరిగ్గా ఉపయోగిస్తే ఇథిలీన్ హానికరం కాదు. భారతదేశంలో పండ్లను పండించడానికి ఇథిలీన్ వాయువును ఉపయోగించడంపై FSSAI ఆమోదించింది. ఇథిలీన్ సహజంగా పండ్ల పక్వానికి వచ్చే ప్రక్రియను నియంత్రిస్తుంది . ఈ వాయువును పంట, రకం, పక్వత నుంచి పండ్లలో 100పీపీఎం (100 μl/L) సాంద్రతల బట్టి ఉపయోగించవచ్చు

విష పదార్థాలు..

కాల్షియం కార్బైడ్ ఆర్సెనిక్, ఫాస్పరస్ వంటి ప్రమాదకర రసాయనాలను కలిగి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. తరచుగా దాహం, మైకము, బలహీనత, ఆహారాన్ని మింగడంలో వంటి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతేకాదు కాలేయం, కిడ్నీ వ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా ఉంది. కాల్షియం కార్బైడ్ రసాయనం కాబట్టి.. ఏ రూపంలోనైనా సరే బాడీలో చేరితే డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు.

జీర్ణ సమస్యలు..

కార్బైడ్ వాడకం కడుపు నొప్పి, విరేచనాలు, గుండెల్లో మంట వంటి జీర్ణశయాంతర సమస్యలను కలిగిస్తుంది. ఇది మాత్రమే కాదు, కాల్షియం కార్బైడ్‌కు నాడీ వ్యవస్థపై ఎక్కువ ప్రభావం చూపుతుంది, తలనొప్పి, తల తిరగడం, గందరగోళం వంటి లక్షణాలను కలిగిస్తుంది.

క్యాన్సర్ ప్రమాదం కూడా..

NCBIలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం కాల్షియం కార్బైడ్‌ వల్ల మైకము, తలనొప్పి, మానసిక స్థితి తగ్గడం, తీవ్రమైన సందర్భాల్లో మూర్ఛలు వంటి నరాల సంబంధిత లక్షణాలు ఏర్పడవచ్చు. ఏ రూపంలోనైనా ఎక్కువ మోతాదులో శరీరంలోకి చేరితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.


పోషకాలు పోతాయి..
కృత్రిమంగా పండిన పండ్లలో.. సహజంగా పండిన పండ్ల కంటే తక్కువ పోషక విలువలు ఉంటాయి. ఈ పండ్లు శరీరానికి కావాల్సిన చక్కెరలు, ఇతర ముఖ్యమైన పోషకాలను పూర్తిగా అందించవు. దీంతో.. వీటిని తినడం వల్ల లాభాల కంటే ముప్పే ఎక్కువగా ఉంది.

కాల్షియం కార్బైడ్‌తో పండిన పండ్లను ఎలా గుర్తించాలి..

* కార్బైడ్‌తో పండిన అరటిపండ్లు అసమానంగా పండుతాయి. అరటిపండులోని కొంత భాగం పసుపు రంగులోకి మారుతుంది. మరి కొంత భాగం పచ్చగా ఉండవచ్చు. ఈ తేడాలు గమనించి మీరు అరటి పండ్లను తీసుకోండి.

* కాల్షియం కార్బైడ్‌తో పండిన అరటిపండ్లు సహజంగా పండిన అరటిపండ్ల కంటే వేగంగా పాడైపోతాయి.

* కార్బైడ్ వల్ల అరటిపండ్ల తొక్క పసుపు రంగులో కనిపిస్తుంది. నిగనిగలాడుతుంది. కానీ, లోపలి పండు మాత్రం గట్టిగా ఉంటుంది. పచ్చి పచ్చిగా ఉండే అవకాశం ఉంది.

* సహజంగా పండిన అరటిపండ్లు చాలా మృదువుగా ఉంటుంది. దాని ఆకారంలో ఎటువంటి మార్పు ఉండదు. అరటిపండు పూర్తిగా పసుపు రంగులో ఉన్నప్పటికీ ఇంకా చాలా గట్టిగా ఉంటే, అది రసాయనాలతో పండించారని అర్థం చేసుకోండి.

* సహజంగా పండిన అరటిపండ్లు ఆహ్లాదకరమైన తీపి వాసన కలిగి ఉంటాయి. రసాయనాలతో పండిన అరటిపండ్లలో ఈ సహజ సువాసన ఉండదు.


గమనిక..
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.