కావలసినవి: మామిడికాయలు 25, కారం % కేజి, ఉప్పు 1 కేజీ, మెంతులు 3% కేజీ, ఆవాలు 350 గ్రా, నూనె కేజి, యింగువ అరతులం, పసుపు 4 స్పూన్సు.
తయారుచేయు విధానం:
1 మామిడికాయలు తుడిచి, ఆరిన తరువాత టెంకలతో అవకాయ ముక్కలుగా తరగాలి.
2. ముక్కలలో ఉప్పు, పసుపువేసి జాడీలో పోసి మూతపెట్టాలి.
3. మూడోరోజు ఊట వస్తుంది. ముక్కలు పిండి ఎండలో వుంచాలి.
4. మెంతులు బాండీలో వేయించి, పొడుం కొట్టాలి. ఆవాలు దంచి, జల్లించుకోవాలి.
5. కారం, మెంతిపిండి, ఆవపిండి కలిపి ఊటలోనే కలపాలి. ముక్కలు కూడా వేసి బాగా కలపాలి.
6. బాండీలో నూనె వేసి కాగిన తరువాత, ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు వేసి వేగిన తరువాత యింగువ పొడి కలపాలి.
7. చల్లారిన పోపు ముక్కలలో వేసి కలిపి, జాడీలోవేసి, వాసిని కట్టాలి. మెంతులు ఎక్కువగా వేయటంతో, వేడి చేయదు. కారం వుండదు. సంవత్సరంపాటు నిల్వ వుంటుంది.