Showing posts with label articleshow. Show all posts
Showing posts with label articleshow. Show all posts

2.27.2025

ఈ నలుపు ఎందుకు వస్తుందో చాలామందికి తెలీదు. శరీరమంతా ఒకరకంగా ఉండి మెడ మాత్రమే నల్లగా ఉంటే చూడటానికి అస్సలు బాగోదు.

ఈ నలుపు ఎందుకు వస్తుందో చాలామందికి తెలీదు. శరీరమంతా ఒకరకంగా ఉండి మెడ మాత్రమే నల్లగా ఉంటే చూడటానికి అస్సలు బాగోదు.


అయితే కొన్ని ఇంటి చిట్కాలతో మెడపై నలుపును ఈజీగా పోగొట్టవచ్చు. అవెంటో చూసేయండి.

శరీరం మొత్తం ఒకే రంగులో ఉండి మెడ మాత్రం నల్లగా ఉంటే చూడటానికి బాగోదు. ఈ సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. రోజూ స్నానం చేసినా.. రకరకాల సబ్బులు వాడినా ఫలితం ఉండదు. కాలుష్యం, ఆరోగ్య సమస్యలు, జన్యు కారణాలు, చర్మ సమస్యలు మెడ నల్లగా మారడానికి కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల వ్యాధుల వల్ల కూడా ఈ సమస్య వస్తుందట. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటో ఇక్కడ చూద్దాం. 

కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల మెడ చుట్టూ నలుపు వస్తుంది. ముఖ్యంగా ఊబకాయం, మధుమేహం, థైరాయిడ్ ఉన్నవాళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధులు ఉన్నవాళ్లలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల మెడ చర్మం లోపలి కణాల్లో వర్ణద్రవ్యం ఏర్పడుతుంది. దీంతో చర్మం నల్లగా మారుతుంది. దీనికోసం ఎన్ని క్రీములు, సబ్బులు వాడినా ఫలితం ఉండదు. అందుకే మెడ నలుపు ఉన్నవాళ్లు చర్మ వైద్యుడిని కలిసి చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొన్ని సాధారణ కారణాల వల్ల వచ్చే నలుపును కొన్ని ఇంటి చిట్కాలతో పోగొట్టవచ్చు.

మెడపై నలుపును తొలగించడంలో పెరుగు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పెరుగులో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి మెడకు పట్టించి 10-15 నిమిషాల తర్వాత నీటితో కడగాలి. పెరుగు మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. దీన్ని తరచుగా ఉపయోగిస్తే మెడపై నలుపు తగ్గుతుంది. 

ఒక దూదిని ఉపయోగించి నిమ్మరసాన్ని మీ మెడకు రాయండి. 20 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత నీటితో తుడవాలి. నిమ్మరసం చర్మంపై ఉండే మృతకణాలు, నూనె, దుమ్మును తొలగిస్తుంది. దీన్ని తరచుగా ఉపయోగిస్తే మెడపై నలుపు తగ్గుతుంది. ముఖ్యంగా నిమ్మరసం ఉపయోగించిన తర్వాత మీ చర్మానికి సూర్యరశ్మి తగలకుండా చూసుకోవాలి.


- రోజ్ వాటర్, నిమ్మరసం సమానంగా కలిపి రాత్రి పడుకునే ముందు మెడకు రాసి ఉదయం స్నానం చేయాలి.

- బాదం నూనెను కొద్దిగా వేడి చేసి మెడకు రాసి పది నిమిషాలు మసాజ్ చేసి తర్వాత స్నానం చేయాలి.

- కొబ్బరి నూనెను మెడకు రాసి మసాజ్ చేసి వేడి నీటితో స్నానం చేయాలి. కావాలంటే బాదం లేదా ఆలివ్ నూనెను కూడా ఉపయోగించవచ్చు. ఇలా తరచూ చేయడం ద్వారా మంచి ఫలితాలు చూడవచ్చు.

2.17.2025

Kidney Health: కిడ్నీ వ్యాధిని ముందే గుర్తించండి..! 8 సైలెంట్ లక్షణాల గురించి ఇప్పుడే తెలుసుకోండి..!

 Kidney Health: కిడ్నీ వ్యాధిని ముందే గుర్తించండి..! 8 సైలెంట్ లక్షణాల గురించి ఇప్పుడే తెలుసుకోండి..!


కిడ్నీలు రెండు మన శరీరంలో చాలా ముఖ్యమైన పనులు చేస్తాయి. రక్తం నుంచి వ్యర్థాలు, విష పదార్థాలు, ఎక్కువ నీటిని ఫిల్టర్ చేసి, మూత్రం ద్వారా బయటకు పంపుతాయి.

రక్తపోటును నియంత్రించడంలో, ఎలక్ట్రోలైట్‌లను సమతుల్యం చేయడంలో, ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతాయి. ఇన్ని ముఖ్యమైన పనులు చేసినప్పటికీ కిడ్నీ వ్యాధులు చాలా ఆలస్యంగా తెలుస్తాయి.


దాదాపు 90 శాతం కిడ్నీ పనితీరు కోల్పోయే వరకు లక్షణాలు కనిపించవు. చాలా మందికి నష్టం జరిగిన తర్వాతే తెలుస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలు అనేక సంక్లిష్టమైన పనులు చేస్తాయి. కానీ వాటి వ్యాధులు నిశ్శబ్దంగా వ్యాప్తి అవుతాయని నిపుణులు అంటున్నారు.


కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే విష పదార్థాలు శరీరంలో పేరుకుపోతాయి. దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కిడ్నీలను తేలికగా తీసుకోకూడదు.. అవి శరీరం సహజ వడపోత వ్యవస్థలాంటివి. ఆరోగ్యకరమైన కిడ్నీ మీ శరీరం హానికరమైన వ్యర్థాల నుండి విముక్తి పొందేలా చేస్తుంది అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


కిడ్నీ వ్యాధికి అనేక కారణాలు ఉన్నాయి. జీవన విధానంలో మార్పులు, సకాలంలో వైద్య సహాయం తీసుకోవడం ద్వారా వీటిని నివారించవచ్చు. నియంత్రణ లేని డయాబెటిస్, అధిక రక్తపోటు.. ఇవి కిడ్నీ దెబ్బతినడానికి ప్రధాన కారణాలు. అధిక రక్త చక్కెర స్థాయిలు కాలక్రమేణా కిడ్నీ కణజాలాన్ని దెబ్బతీస్తాయి. నియంత్రణ లేని రక్తపోటు రక్త నాళాలపై ప్రభావం చూపుతుంది. కిడ్నీ పనితీరును తగ్గిస్తుంది. వైద్యులు చెప్పినట్లుగా, కిడ్నీ సంబంధిత సమస్యలు ఉండవచ్చని అనుమానించాలని వైద్యులు చెబుతున్నారు.


కిడ్నీ వ్యాధి తరచుగా గుర్తించదగిన లక్షణాలు లేకుండా వ్యాప్తి అవుతుంది. ప్రారంభ హెచ్చరిక సంకేతాలను గుర్తించడం చాలా ముఖ్యం. వైద్య నిపుణులు చెప్పిన ఎనిమిది లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


8 సైలెంట్ లక్షణాలు


కిడ్నీలు ఎక్కువ నీటిని బయటకు పంపలేనప్పుడు అది శరీరంలో పేరుకుపోతుంది. దీనివల్ల కాళ్ళలో వాపు, కళ్ళ చుట్టూ ఉబ్బడం కనిపిస్తుంది.

కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే అధిక రక్తపోటు వస్తుంది. ఇది సాధారణ చికిత్సలకు లొంగదు.

కొంచెం నురుగు సాధారణమే.. కానీ ఎక్కువ నురుగు ప్రోటీన్ లీకేజ్‌ను సూచిస్తుంది. ఇది కిడ్నీ దెబ్బతినడానికి ఒక సంకేతం.

ముదురు, టీ-రంగు మూత్రం ప్రమాదకరమైనది. ఇది తీవ్రమైన కిడ్నీ నష్టం లేదా మూత్రంలో రక్తం లీకేజ్‌ను సూచిస్తుంది.

అప్పుడప్పుడు రాత్రిపూట మూత్ర విసర్జన చేయడం సాధారణం.. కానీ ఇది తరచుగా ఉంటే అది ప్రారంభ కిడ్నీ పనిచేయకపోవడాన్ని సూచిస్తుంది.

కొన్ని రోజులు వాంతులు కిడ్నీ వైఫల్యం వల్ల రక్తంలో విష స్థాయిలు పెరగడం వల్ల సంభవించవచ్చు.

తీవ్రమైన, నిరంతర దురద చికిత్సకు లొంగదు. ఇది తరచుగా కిడ్నీ వైఫల్యంలో విషపదార్థాల పేరుకుపోవడంతో సంబంధం కలిగి ఉంటుంది.

మూత్రంలో రక్తం.. ఇది ఎప్పటికీ సాధారణం కాదు. ఇది అంటువ్యాధులు, కిడ్నీ రాళ్ళు లేదా కిడ్నీ వ్యాధిని సూచించవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Heart attack helth tips Articel show

 గుండె పోటు


మానవుని గుండె అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది?

*. ఇది పిడికిలంత పరిమాణంలో ఉండి బోలుగా, కండరనిర్మితమైన అవయవం.

*. ఇది ఛాతి మధ్య భాగంలో కొద్దిగా ఎడమ ప్రక్కకు ఉంటుంది.

*. ఇది రోజుకి సుమారు లక్ష సార్లు, నిమిషానికి అరవై నుండి కొట్టుకుంటుంది. తొంభై సార్లు (60-90)

*. గుండె స్పందించిన శరీరములోనికి పంపుతుంది. ప్రతీసారీ రక్తాన్ని

*. హృదయ ధమనుల ద్వారా సరఫరా చేయబడిన రక్తం ద్వారా పోషణ మరియు ఆమ్లజని (ఆక్సిజన్) రక్తముతోపాటు గుండెకు చేరుతుంది.

*. గుండె కుడి మరియు ఎడమ భాగాలుగా విభజింపబడి ఉంటుంది. గుండెలో రెండు గదులు ఉంటాయి (వీటిని కర్ణిక మరియు జఠరిక అంటారు). మరలా ఒక్కొక్క గదికి కుడి మరియు ఎడమ వైపున రెండేసి గదుల చొప్పున ఉంటాయి. గుండెలో మొత్తం నాలుగు గదులు ఉంటాయి.

*. శరీరము నుండి చెడు రక్తాన్ని కుడి వైపునున్న గుండె గ్రహించి ఊపిరితిత్తులకు పంపిస్తుంది.

*. ఊపిరితిత్తులలో శుభ్రపడిన రక్తము గుండె ఎడమ భాగానికి తిరిగి వచ్చి అక్కడి నుండి రక్తం తిరిగి శరీరములోనికి వెళుతుంది.

*. గుండెకు ఎడమ ప్రక్కన రెండు కవాటాలు ( మైట్రల్ మరియు బృహద్ధమని), కుడి ప్రక్కన రెండు కవాటాలు (పుప్పుస మరియు అగ్రత్రయ కవాటాలు) ఉంటాయి. ఇవి రక్తాన్ని ఒకేదిశలో ప్రవహించేలా చేస్తాయి.


గుండె పోటు

గుండె కండరానికి మంచి రక్తాన్ని తీసుకొని వెళ్ళే రక్త నాళాలలో కొవ్వు కాని, రక్తపు గడ్డ వలన కాని రక్త సరఫరాలో ఆటంకము కలిగిన యెడల గుండె పోటు వస్తుంది.


గుండెపోటు అంటే ఏమిటి ? గుండె శరీరంలోని

వివిధ అవయవాలకు రక్తాన్ని అందించే జీవాధారమైన అవయవం. గుండె ఆమ్లజని (ఆక్సిజన్) సహిత రక్తమును రక్తనాళాల ద్వారా గ్రహిస్తుంది. ఈ రక్తనాళాలను (కరోనరీ) హృదయ ధమనులు అంటారు. ఈ రక్తనాళాలు పూడుకుపోతే రక్తము గుండె కండరాలకు అందక గుండె పనిచేయదు. దీనినే గుండె పోటు అంటారు. గుండెపోటు తీవ్రత, గుండె కండరాలు ఎంతవరకు పాడైపోయినవో దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ చచ్చుబడిపోయిన కండరాలు రక్తాన్ని పంపించే సామర్ధ్యాన్ని తగ్గించి గుండె పని చేసే తీరుని మార్పు చేస్తుంది. ఇది కన్జెస్టివ్ హార్ట్ ఫెల్యూర్ కి దారితీస్తుంది. దీని వలన శ్వాస తీసుకొనలేకపోవడం మరియు పాదాలకు చెమట పట్టడం వంటివి జరుగుతాయి.


లక్షణాలు

*. ఛాతీ మధ్య భాగములో అకస్మాత్తుగా నొప్పి రావడం గుండె పోటు యొక్క ప్రధాన లక్షణము

. ఈ నొప్పి ఒక్కో సమయములో ఛాతీ మీద బరువు పెట్టినట్లు గాను లేదా నొక్కిపట్టినట్లుగాను ఉండవచ్చును

*. ఈ ఛాతీ నొప్పి భుజానికి కాని చేతులకు కాని వెనక వీపు భాగమునకు గాని దవడకు కాని ప్రాకినట్లుగా ఉండవచ్చును

*. ఛాతీ నొప్పి వచ్చినప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకున్నా కూడా తగ్గదు

*. శరీరమంతా చల్లబడి చమట పట్టినట్లు ఉండవచ్చును

*. ఊపిరి అందకపోవచ్చు

*. శరీరము చచ్చుబడినట్లు, బలహీనపడి వాంతి వచ్చినట్లు ఉండవచ్చు

*. తల తిరిగినట్లు స్పృహ కోల్పోతున్నట్లు ఉండవచ్చు

*. ఛాతీ నొప్పి లేకుండానే పైన తెలియబరిచిన లక్షణాలతో మాత్రమే కూడా గుండెపోటు రావచ్చు


ఇది ఎందుకు వస్తుంది ?

గమనకు వయస్సు పెరిగే కొద్దీ 1 హృదయధమనులతో పాటు శరీరం యొక్క వివిధ భాగాలలోని రక్త నాళాలలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది క్రమంగా రక్తప్రసారానికి అవరోధం కల్గిస్తుంది. ఈ విధంగా రక్త నాళాలు మూసుకుపోవడాన్ని ఎథిరోస్ల్కిరోసిస్ అంటారు.

పురుషులు, స్త్రీల కన్నా ఎక్కువ గుండెపోటుకి గురయ్యే అవకాశం ఉంది. స్త్రీలు స్త్రీ సెక్స్ హార్మోనులైన ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టిరాన్ ల ప్రభావము చేత రక్షింపబడతారు. ఈ రక్షణ కనీసం రజోనివృత్తి వరకు ఉంటుంది.

భారతీయులతో సహా ఆసియా దేశం వారు ఎక్కువ అతిప్రమాదభరితమైన గురౌతున్నారు. గుండెపోటుకి


ఈ అపాయానికి కారణాలు:

*. ధూమపానం

*. మధుమేహం

*. అధిక రక్తపోటు

*. అధిక బరువు

*. ఎక్కువ కొవ్వు మరియు తక్కువ హెచ్ డి ఎల్ (అధిక సాంద్రత లిపోప్రొటీన్) విలువలు వర్సెస్ మేలు చేసే కొవ్వు

*. భౌతికశ్రమ లేకపోవడం


*. గుండెపోటు చరిత్ర గల కుటుంబం

*. వత్తిడి, ఎక్కువకోపము మరియు ఆందోళన

*. వంశపారంపర్య కారకాలు

*. ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం వుంటుంది

*. ఎక్కువగా రక్తపోటు ఉన్నవారికి

*. రక్తములో ఎక్కువ శాతం కొవ్వు వున్న వాళ్ళకు

*. శారీరక శ్రమ లేనివాళ్ళకు

*. స్థూలకాయులకు

*. మధుమేహ వ్యాధి ఉన్నవారికి

*. మధ్యపానము ఎక్కువ మోతాదులో సేవించే వారికి

*. బీడీ, సిగరెట్ లాంటి పొగాకు సంబంధించినవి వాడే వాళ్ళకి

*. వయస్సు మీద పడుతున్న వాళ్ళకు

గుండెపోటుని ఏవిధంగా కనిపెట్టాలి ?

*. వైద్యుడు వైద్యచరిత్ర వివరాలను తీసుకుని గుండె స్పందనలను పరీక్ష చేసి రక్తపోటును నమోదు చేస్తారు.

* గుండె స్పందనలను నమోదు చేసే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (ఈసిజి) ను తీస్తారు.

*. గుండె స్పందన వేగము, అసామాన్యమైన స్పందన నమూనా మొదలైన సమాచారాన్ని ఈసిజి ఇస్తుంది. గుండెపోటు వల్ల పాడైపోయిన కండరాల ఉనికిని కూడా ఈసిజి తెలియ జేస్తుంది. మొదటి దశలో నమోదైన మామూలు ఈసిజి, గుండెపోటు రావడానికి అవకాశాలు లేవనే అవగాహనకు రాకూడదనే


విషయం గుర్తుంచుకోవడం ముఖ్యం.

*. గుండె కండరాలు పాడైనదీ లేనిదీ గుర్తించడానికి రక్తపరీక్షలు ఉపయోగపడతాయి.

*. గుండెని ఎక్స్ రే తీయడం మంచిది.

* గుండె పనిచర్యల సమాచారము తెలుసుకోడానికి ఈకోకార్డియోగ్రాఫ్ చేయించడం మంచిది.

*. రక్తనాళాలు మూసుకుపోయాయని నిర్థారించే సాక్ష్యాన్ని కరోనరీ ఎంజియోగ్రామ్ తెలియ జేస్తుంది.


గుండెపోటు వల్ల అనర్దాలు

*. గుండె కండరానికి ఎంతమోతాదులో రక్త ప్రసరణ తగ్గినది లేదా పూర్తిగా ఆగిపోయిన స్థాయిని బట్టి అనర్థాలు వుంటాయి.

*. ఇతర శరీర భాగాలకు రక్త ప్రసరణ చేసే సామర్ధ్యాన్ని కోల్పోయి హార్టు ఫెయిల్యూర్ రావచ్చు.

*. గుండె కొట్టుకొనే క్రమబద్ధతలో గుండె దడలాంటి మార్పులు రావచ్చును.

*. గుండె పోటు వచ్చిన కొన్నిరోజులు తరువాత గుండెలో కవాటాలకు అనర్థము రావచ్చు.


తీసుకోవలసిన జాగ్రత్తలు

*. పొగాకు సంబంధించినవి బీడీ, సిగరెట్లు త్రాగడం పూర్తిగా మానాలి

*. క్రమం తప్పక వ్యాయమం చేయాలి

*. రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి

*. కూరాగాయలు, పండ్లు ఎక్కువగా ఆహారములో తీసుకోవాలి

*. వీలైతే చేప కూరలు, చేప వేపుడు తినాలి

*. వీలైనంత వరకు ఒత్తిడి తగ్గించుకోవడం మంచిది

*. క్రమం తప్పక డాక్టరును సంప్రదించి సలహాలు తీసుకోవడం మంచిది

గుండె నొప్పి వచ్చునప్పుడు రోగికి ఎటువంటి ప్రధమచికిత్స ఇవ్వాలి?

* గుండె నొప్పికి సత్యరమైన వెద్య చికిత్సను

అందించడం ద్వారా జీవితాలను రక్షించగలము.

*. నైపుణ్యత గల వైద్యసహాయము అందే వరకు రోగిని పడుకోబెట్టి బిగుతుగానున్న దుస్తులను వదులు చేయాలి.

*. ఆక్సిజన్ సిలిండర్ దొరికినట్టైతే రోగికి ఆక్సిజన్ ఇవ్వాలి.

*.ఆ సమయమునకు నైట్రోగ్లిజరిన్ లేదా సోర్బిట్రేట్ మాత్రలు అందుబాటులో ఉంటే ఒకటి లేదా రెండు మాత్రలు రోగి నాలుక క్రింద ఉంచవచ్చు.

*.కరిగిన రూపంలో ఆస్ప్రిన్ మాత్రను కూడా ఇవ్వవలెను.

*. అంబులెన్సు, డాక్టరు కు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోవడం

*.వీలైతే అస్పిరిన్ మాత్ర తీసుకోవడం

*.కుటుంబ వ్యక్తిగత డాక్టరుకు వెంటనే సమాచారాన్ని తెలిపి సలహా తీసుకోవడం

*.ప్రమాదాన్ని గురించి ఆలోచించకుండా మనో నిబ్బరంగా ఉండేటట్లు వాతావరణం కల్పించడం త్వరగా ఆస్పత్రికి తరలించడం


దీనికి చికిత్స ఏమిటి ?

*. గుండె నొప్పులకు ఆసుపత్రిలో చేర్చడం మరియు సత్వర వైద్య సదుపాయము అవసరమవుతుంది.

*. మొదటి కొద్ది నిమిషములు మరియు గంటలు కీలకమైనవి. ప్రధమదశలో హృదయ ధమనులలోని అడ్డంకులు కరగడానికి మందులు ఇవ్వవచ్చు.

*. గుండె చప్పుడు (లయ) పర్యవేక్షించబడుతుంది మరియు ఇది అసహజంగా ఉన్నట్లైతే సత్వరచికిత్స చేయబడుతుంది. నొప్పి ఉపశమనానికి మందులు ఇవ్వాలి మరియు రోగిని విశ్రాంతి మరియు నిద్రకు ప్రోత్సహించాలి.

*. ఒకవేళ అధిక రక్తపోటు (పీడనం) ఉన్నట్లైతే రక్త పోటు తగ్గడానికి మందులు ఇవ్వాలి.

*. నిర్దిష్టమైన చికిత్స ప్రత్యేకించబడి ఉంటుంది. ఇది రక్తనాళాలలోని అడ్డంకులపరిధి, గుండె జబ్బు పరిధి, నొప్పి తీవ్రత మరియు రోగి వయస్సు మీద ఆధారపడి ఉంటుంది.

*. చాలాసార్లు అతి నిర్దిష్ట పద్ధతుల ద్వారా రక్తనాళాలలో అడ్డంకులు తొలగించుట అవసరమౌతుంది. ఇది కరోనరీ ఎంజియోప్లాస్టీ, బెలూన్ ఉపయోగించి రక్తనాళాలను విస్తరింప జేయుట లేదా కరోనరీ బైపాస్ సర్జరీ రూపాలలో ఉండవచ్చును.


గుండె పోటు రాకుండా ఎలా అడ్డుకొనవచ్చు?

*. అతి ప్రమాదభరితమైన గుండె జబ్బులున్నవారు

ఈ క్రింది నిరోధక చర్యలను తీసుకోవాలి.

*. జీవన శైలి మార్పులో ఎదురయ్యే సవాలు

*. వారి ఆహారము, తక్కువ కొవ్వు పదార్థములు మరియు ఉప్పు, అధిక పీచుపదార్థములు మరియు సంక్లిష్ట ఉండాలి. పిండిపదార్థాలతో ఆరోగ్యవంతంగా

*. ఎవరైతే అధిక బరువును కల్గి ఉన్నారో వారు బరువు తగ్గించుకొనుట అవసరము.

*. క్రమం తప్పకుండా రోజూ భౌతిక వ్యాయామం చెయ్యాలి.

*.పొగ త్రాగుట పూర్తిగా మానివేయాలి.

*. మధుమేహం, అధిక రక్తపోటు లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు తప్పకుండా మందులు వాడి వారి పరిస్థితిని నియంత్రించుకోవాలి.

గుండె -రక్తనాళాల వ్యాధులు

శరీరంలో గుండె అతిముఖ్యమైన భాగం. ఇది మనిషి శరీరంలో ఎడమవైపున ఛాతీ భాగంలో ఉంటుంది. దీనిలో నాలుగు గదులు ఉంటాయి. పైన ఉన్న రెండు గదులను ఆరికల్స్ లేదా ఆట్రియా (auricles or atria) అంటారు. క్రింది భాగంలో ఉన్న గదులను వెంట్రికల్స్ (ventircles) అంటారు. గుండె లోపల ఎడమ మరియు కుడి ఆరికల్స్ మరియు వెంట్రికల్స్ ను కండరాలు కలిగిన గోడ విభజిస్తుంది. ఆరికల్స్ యొక్క గోడలు వెంట్రికల్స్ యొక్క గోడల కంటే మందంగా ఉంటాయి. ఈ గోడలలో మూడు పొరలు ఉంటాయి. గుండె వెలుపల వైపున ఉండే పొరను పెరికార్డియం (peri cardium) అంటారు. గుండె లోపలి వైపున ఉండే (endo cardium) అంటారు. ఈ రెంటికి మధ్యలో ఉండే పొరను మయోదార్డియం అంటారు. ఈ పొర కండరాలతో తయారుచేయబడి ఉంటుంది. ఈ కండరాలు ఇతర శరీర కండరాలవలె కాకుండా ఏ విధమైన నాడీ సంబంధమైన ప్రేరేపణ లేకుండా సంకోచ వ్యాకోచాలు జరుపుతాయి. రక్తం ఎప్పుడూ గుండెలో ఆరికల్స్ నుండి వెంట్రికల్స్ కు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ విధంగా రక్తం ఒకే దిశలో

ప్రవహించడానికి వీలుగా ఆరికల్స్ మరియు వెంట్రికల్స్ మధ్య కవాటాలు ఉంటాయి. ఒక క్రమపద్ధతిలో సంకోచ వ్యాకోచాలు జరపడం వల్ల రక్తం అన్ని అవయవాలకు సరఫరా అవుతుంది. ఒకవేళ గుండె కాని రక్తనాళాలు గాని సరిగ్గా పనిచేయనప్పుడు గుండె జబ్బులు వస్తాయి.

ఈ వ్యాధులు ఏ వయస్సులో అయినా రావచ్చు. కాని ఇవి ఎక్కువగా మధ్య వయస్సులో వస్తాయి. గుండె జబ్బుల వల్ల గుండెలో పెరీకార్డియం, మయోకార్డియం దెబ్బతినవచ్చు. లేదా ఎండోకార్డియం అంతేకాక గుండెలోపలి రక్తనాళాలు లేదా గుండె కవాటాలు దెబ్బ తినడం వల్ల కూడా ఈ జబ్బులు రావచ్చు. కానీ హార్టెటాక్ అన్నిసార్లు ప్రాణాంతకం కాదు. కొన్నిసార్లు ఇవి పూర్తిగా తగ్గిపోవచ్చు. కొన్నిసార్లు అవే చాలా తీవ్రస్థాయిని పొందవచ్చు. చాలాసార్లు ఈ జబ్బులు ఆర్టరీల గోడలు గట్టిపడి వాటి ఎలాస్టిసిటీని కోల్పోవడం వల్ల వస్తాయి.


గుండె జబ్బులలో రకాలు

ఎథిరోస్ల్కిరోసిస్: ఇది ఆర్టరీస్ లో వచ్చే వ్యాధి. ఈ

వ్యాధిలో ఆర్టరీల యొక్క లోపలి పొరలో రక్తం, పైబ్రస్ టిష్యూ, పిండిపదార్థాలు, క్రొవ్వుపదార్ధాలు మరియు కాల్షియం వంటివి పేరుకుపోతాయి. అందువల్ల రక్తనాళాల గోడలు మందంగా తయారై రక్తప్రసరణను ఆటంక పరుస్తాయి.

కరోనరీ హార్ట్ డిసీజ్: మయోకార్డియంకు కావలసిన

రక్తాన్ని కరోనరీ ఆర్టరీస్ అందించలేకపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. దీనినే ఇస్కమిక్ హార్ట్ డిసీజ్ అనికూడా అంటారు. మయోకార్డియల్ ఇన్ ఫెక్షన్ మరియు ఏంజినాపెక్టోరిస్ ఈ కోవకు చెందిన గుండె రక్తనాళాల జబ్బులే.

మయోకార్డియల్ ఇన్ ఫెక్షన్ : గుండె కండరాలకు

కావలసిన రక్తం అందకపోవడం వల్ల రక్తం అందని భాగం నిర్జీవమైపోతుంది. దీనినే నెక్రోసిస్ అని అంటారు. ఈ విధంగా గుండెలో ఎక్కువ భాగం నిర్జీవం కావడం వల్ల గుండె సరిగా పనిచెయ్యలేదు. ఎధిరోస్ల్కిరోసిస్ ఉన్న కరోనరీ ఆర్టరీలో రక్తం గడ్డకట్టుకుపోయి రక్తప్రసరణకు అడ్డుపడటం వల్ల ఈ ఇన్ ఫెక్షన్ వస్తుంది. దీనివల్ల ఆకస్మిక మరణం సంభవించవచ్చు.

ఏంజినాపెక్టోరిస్: ఎక్కువగా పనిచేసినప్పుడు లేదా

ఆవేశపడినప్పుడు ఛాతీలో నొప్పి రావడాన్ని ఏంజినా పెక్టోరిస్ అంటారు. ఇది రోగి యొక్క పనిచేసేశక్తిని తగ్గిస్తుంది. రోగి తన పనిని అదుపులో ఉంచుకుంటే చాలా సంవత్సరాలు ఈ వ్యాధితో బ్రతికే అవకాశం ఉంది.


వ్యాధి ఎలా వృద్ధి చెందుతుంది ?

రక్తనాళాలలో ఏదైనా రాపిడివల్ల లీకైన రసాయన పదార్ధాలవల్ల లోపలి పొర అప్పుడప్పుడు చిట్లిపోతుంది. ఈ చిట్లిన ప్రదేశాన్ని మార్చేసమయంలో రక్తంలోని పదార్ధాలు చనిపొయిన కణజాలం ఆ ప్రదేశంలో పేరుకుపోతాయి. ఈ విధంగా పేరుకుపోయిన కణజాలంపై రక్తంలొ అధికంగా ఉన్న కొలెస్ట్రాల్, కొలస్ట్రాల్ కారియర్స్ మరియు లిపోప్రొటీన్ వంటి ఇతర క్రొవ్వు పదార్ధాలు కూడ పేరుకుపొతాయి. ఈ విధంగా పేరుకుపోయిన పదార్ధాలు రక్తనాళాల లోపలిపొరలను మందంగాను మరియు యెత్తుపల్లాలు వచ్చేటట్లు చేస్తాయి. పేరుకున్న కొలస్ట్రాల్ క్రిస్టల్స్ తయారవుతుంది. ఇది నెమ్మదిగా గట్టిపడి ఫైబ్రస్ ఫ్లేక్స్ మార్పుచెందుతుంది. అందువల్ల రక్తనాళాలలొని ఖాళీ తగ్గిపోతుంది. ఒకొక్కసారి రక్తనాళాలలో రక్తం గడ్డకట్టుకుపోవడంవల్ల రక్తనాళాలు మరింత సన్నబడతాయి. ఈ విధంగా ఒకొక్కసారి ఆయా రక్తనాళాలలో రక్తప్రసరణ పూర్తిగా ఆగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. దానివల్ల ఆ రక్తనాళాలు రక్తాన్ని సరఫరా చేసే కణాలు రక్తం అందకపొవడం వల్ల నిర్జీవం అయి నెక్రోసిస్ వస్తుంది. ఈ విధంగా గుండె పనిచేసే శక్తి తగ్గిపోతుంది.


లక్షణాలు

గుండె రక్తనాళాల జబ్బులు ఉన్నవారిలో పని ఎక్కువయినప్పుడు ఆయాసం రావడం,నీరసం మరియు ఛాతిలో నొప్పి కనిపిస్తాయి. ఒకవేళ గుండె-రక్తనాళాలు బాగాదెబ్బతింటే గుండె పరిమాణం పెరుగుతుంది. మూత్రపిండాలకు రక్తం సరఫరా కూడా బాగా తగ్గిపోవడంవల్ల

కణజాలంలోని ఖాళీ ప్రదేశాలలో నీరు మరియు సోడియం నిలువ ఉండిపొతుంది. ఈ విధంగా నీరు ముందుగా కాళ్ళు మరియు చేతులలో నిలువ ఉంటుంది. క్రమేణా ఇది కడుపు మరియు ఛాతిలోని కేవిటీల్లో నిల్వ ఉంటుంది. దీనినే కంజెస్టివ్ హార్ట్ (congestive heart failure) ఫెయిల్యూర్ అంటారు.


గుండె-రక్తనాళాల జబ్బులు రావడానికి కారణాలు

లింగత్వం: గుండె రక్తనాళాల జబ్బులు ఎక్కువగా

పురుషుల్లోను మరియు మెనోపాజ్ వయసులోని స్త్రీలలోను వస్తాయి. ప్రత్యుత్పత్తి వయసులొ ఉన్న స్త్రీలలో ఈ జబ్బులు తక్కువగా రావడానికి ముఖ్యకారణం వారిలో ఉండే అండాశయాలు ఉత్పత్తి చేసే హార్మోనులు రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని కొంతవరకూ తగ్గిస్తాయి. కానీ గర్భనిరోధక మాత్రలు వేసుకొనే స్త్రీలలో కూడా ఈ జబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.

వయస్సు: ఈ జబ్బులు వయస్సుతో పాటు పెరుగుతూ ఉంటాయి. ఇవి 50-55 సంవత్సరాల వయస్సులో ఉన్నవారిలో అతి ఎక్కువగా కనిపిస్తాయి.

జన్యుసంబంధమైన కారణాలు: ఈ రోగ చరిత్ర

ఉన్న కుటుంబాల వ్యక్తులలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధిని కలగచేయడంలో 30

జీన్సుల పాత్ర ఉంది. రక్తంలోని కొలస్ట్రాల్ ను తగ్గించే ఇఫోలిపో ప్రోటీన్ తయారుచేయడానికి కారణమైన జన్యువులలో మూడు రకాలున్నాయి. ఈ మూడు రకాలలో ఒక రకం జీను ఉన్న వ్యక్తులలో ఈ జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువ. తల్లిదండ్రులలో గుండె - రక్తనాళాలలో జబ్బులు ఉంటే పిల్లలలో ఈ జబ్బులు తల్లిదండ్రులకు ఈ జబ్బువచ్చిన వయస్సు కంటే చిన్న వయస్సులోనే వచ్చే అవకాశాలున్నాయి.

శరీరతత్వం: పొట్టిగా, లావుగా మరియు పొట్టిమెడ

కలిగి ఉన్న వ్యక్తులలో ఈ జబ్బు ఎక్కువగా వస్తుంది. పొట్టిగా ఉన్నవారిలో ఛాతీ భాగంలో ఎక్కువగా క్రొవ్వు ఉండే అవకాశాలు ఎక్కువ.

వ్యక్తిత్వ సంబంధిత కారణాలు: ఎక్కువ

బాధ్యతలు కలిగిన వ్యక్తులు, తమకు ఇష్టమైనవారిని కోల్పోయిన వ్యక్తులు, ఎక్కువగా సమస్యలతో సతమతమయ్యే వ్యక్తులలో ఈ జబ్బు ఎక్కువగా వస్తుంది.


పొగత్రాగడం: పొగత్రాగేవారిలో ఈ జబ్బు చాలా

ఎక్కువగా వస్తుంది. పొగత్రాగడం వల్ల శరీరంలోని మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్.డి .యల్ తయారీ తగ్గిపోతుంది. పొగలో ఉండే నికోటిన్ రక్తనాళాలను సంకోచించేటట్లు చేస్తుంది. ఇవి రక్తనాళాలలో రక్తం గడ్డకట్టేటట్లు కూడా చేస్తుంది. అంతేకాక ఈ పొగలో ఉండే ఫ్రీరేడికల్స్ రక్తనాళాల లోపలి పొరను దెబ్బతినేటటు చేసాయి. అందువల ఆ ప్రదేశంలోపైబ్రస్ ప్లేక్స్ ఏర్పడే అవకాశాలు ఎక్కువ.

జీవనవిధానం: ఎక్కువ శారీరక శ్రమలేని వ్యక్తుల రక్తంలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల వారిలో ఈ జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ.

ఊబకాయం: అధిక బరువు వున్నవారిలో కూడా ఈ జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువ.

త్రాగేనీరు: నీటిలో ఎక్కువ కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు ఉన్నప్పుడు అది కొలెస్ట్రాల్ తగ్గించి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గిస్తాయి.


అధిక కాఫీ

మరియు మత్తు

పానీయాలు:

ఎక్కువగా కాఫీ మరియు ఆల్కహాలు తీసుకొన్నప్పుడు గుండె పనిచేసే విధానం దెబ్బతినడం వల్ల గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయి.

మధుమేహం: మధుమేహవ్యాధి గుండె మరియు రక్తనాళాలను దెబ్బతినేటట్లు చేయడం వల్ల కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా అధికం.

ఆహారపు

అలవాట్లు:

అధిక చక్కెర,మాంసాహారం, వెన్న, నూనెలు వంటి క్రొవ్వు పదార్ధాలు గుండె జబ్బులు రావడంలో ముఖ్యపాత్ర వహిస్తాయి. క్రొవ్వు పదార్ధాలలో ముఖ్యంగా కొబ్బరినూనె,డాల్డా,నెయ్యి, మార్జరిన్ ఎక్కువగా ఈ

వ్యాధులను కలిగిస్తాయి. పొద్దుతిరుగుడు పువ్వు నూనెలో ఫాలీ అన్సాచ్యురేటెడ్ ఫ్యాటి యాసిడ్స్ ລ້ ລ້ (Poly unsaturated fatty acids) వీటిని వాడినప్పుడు మిగిలిన క్రొవ్వుపదార్ధాలలో పోల్చినప్పుడు రక్తంలో కొలస్ట్రాల్ శాతం తక్కువగా ఉంటుంది. కానీ వీటిని కూడా తగినంత మోతాదులో మాత్రమే తీసుకోవాలి.

క్రొవ్వు పదార్ధాలు ఎక్కువగా తీసుకొన్నప్పుడు ఏం జరుగుతుంది?

ఆహారంలో క్రొవ్వుపదార్దాలు జీర్ణం కావడానికి కాలేయాన్ని చేరతాయి. కాలేయం ఈ క్రొవ్వు పదార్ధాలను ప్రోటీన్లతో కలిసేటట్లు చేసి వి.ఎల్.డి.ఎల్. (క్రొవ్వును కలిగిన ప్యాకెట్లు) ను తయారుచేస్తుంది. ఇది రక్తంలో కలిసి ఎపోప్రోటీన్ లైపేజ్ అనే ఎంజైము వాటిపై పనిచేయడం వల్ల చిన్న చిన్న వి.ఎల్.డి.ఎల్ రెమినెంట్స్ తయారవుతుంది. ఇది ఎపోప్రోటీన్ సి మరియు బి లతో కలిసి ఎల్.డి.ఎల్ గా మార్పు చెందుతుంది. ఈ ఎల్.డి.ఎల్, కణాలలోకి ఎల్.డి.ఎల్ రిసెప్టార్స్ ద్వారా చేరుతుంది. ప్రతీకణంలో కొన్ని పరిమితమైన ఎల్.డి.ఎల్ రిసెప్టార్స్ ఉంటాయి.

ఈ ఎల్.డి.ఎల్ రిసెప్టార్స్ అన్నీ ఎల్.డి.ఎల్ తో నిండిపోయినప్పుడు మిగిలిన ఎల్.డి.ఎల్ రక్తనాళాల గోడలకు అతుక్కొనిపోయి వాటిని సన్నగా చేస్తాయి.

నెయ్యి,డాల్డావంటి సాచ్యురేటెడ్ నూనెలను తీసుకొనేటప్పుడు ఇవి కణాలలోని ఎల్.డి.ఎల్ రిసెప్టార్స్ ను తగ్గించి తద్వారా ఎధిరోస్క్లెరోసిస్ ను అధికం చేస్తుంది. అంతేకాక రక్తనాళాలలో లోపలి పొర తయారుచేసే రక్తనాళాలకు సంకోచింపచేసే (Endothelium derived relaxing factor) కూడా తక్కువగా ఉత్పత్తి అయ్యేటట్లు చేస్తుంది.

సాచ్యురేటెడ్ ల్యూకో ట్రైఈన్స్ (Leuco trienes) వంటి రక్తం చిక్కబడేటట్లు చేసే పదార్థాలను కూడా తయారుచేస్తాయి. ఈ విధంగా చిక్కబడిన రక్తం త్వరగా గడ్డకట్టే అవకాశాలు ఎక్కువ. ఇతర రక్తం గడ్డకట్టడాన్ని ప్రేరేపించే పదార్థాలు కూడా క్రొవ్వు పదార్ధాలు వాడినప్పుడు ఎక్కువవుతాయి.

*. రక్తంలోని వి.ఎల్.డి.ఎల్ రెమినెంట్స్ ఎపోప్రోటిన్ a తో కలిసి హెచ్.డి.ఎల్ కొలెస్ట్రాల్) తయారవుతుంది. (మంచి

*.హెచ్.డి.ఎల్ రక్తంలో అధికంగా ఉన్న ఎల్.డి.ఎల్ ను మరలా కాలేయానికి తీసుకువచ్చి అక్కడి నుండి విసర్జింపబడేటట్లు చేస్తుంది.

*. ఎక్కువగా వ్యాయమం చేయడం వల్ల మరియు పాలీ అన్ సాచ్యురేటెడ్ ఫాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్స్ తీసుకొన్నప్పుడు ఈ హెచ్.డి.ఎల్

శరీరంలో పెరుగుతుంది.

గుండెజబ్బులను అరికట్టే చేపనూనెలు

చేపనూనెలలో ఉండే ఎన్-3 ఫాటీ యాసిడ్లు శరీరంలో క్రొవ్వు శాతాన్ని తగ్గిస్తాయి. అంతేకాక ఇవి శరీరంలోని రక్తం గడ్డకట్టేటట్లు చేసే పదార్ధాలను కూడా తగ్గిస్తాయి.

యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా గల పదార్ధాలు:నిమ్మ,నారింజ,బత్తాయి విటమిన్ వంటి సి ఎక్కువగా కల పదార్ధాలు,టమోటా,క్యారెట్,బొప్పాయి, మామిడి వంటి పసుపు రంగు మరియు ఎరుపురంగు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు విటమిన్ ఎ ని కలిగి ఉండి గుండె జబ్బులను తగ్గిస్తాయి. ఫ్రీరేడికల్స్ రక్త నాళాల లోపలి పొర దెబ్బతినేటట్లు చేస్తాయి. వీటిని యాంటి ఆక్సిడెంట్లు తగ్గించడం వల్ల ఇవి గుండె జబ్బులను తగ్గిస్తాయి.

పైబర్ ఎక్కువగా ఉన్న పదార్ధాలు: పీచు పదార్ధం ఎక్కువగా గల కూరగాయలు,మామిడి,ఆపిల్స్,జామకాయ పచ్చి వంటి పండ్లు,ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు తక్కువగావస్తాయి.

ఇతర పదార్ధాలు: ఉల్లిపాయ,వెల్లుల్లి మరియు శనగపప్పులో కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణాలు ఉండటం వల్ల ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. అంతేకాక పాలు,ఆకుకూరలు, రాగులు వంటి కాల్షియం ఎక్కువగా ఉండే పదార్ధాలు కూడా శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి.

వీటిని దృష్టిలో ఉంచుకొని ఆహారపు అలవాట్లులో మార్పు తెచ్చుకోవడం అనగా యాంటి ఆక్సిడెంట్సు ఎక్కువగా గల పదార్ధాలు, పీచు పదార్థం ఎక్కువగా గల పదార్ధాలు తీసుకోవడం,నూనె పదార్ధాలను తగ్గించడం,సిగరెట్లు మానేయడం,తగినంత వ్యాయామం చేయడం మరియు మానసిక వత్తిడిని తగ్గించుకోవడం ద్వారా గుండె-రక్తనాళాల వ్యాధులు రాకుండా జాగ్రత్త పడొచ్చు.

ఒంటిరిగా ఉన్నప్పుడు హార్ట్ అటాక్ ను ఎదుర్కోవడం ఎలా గుండెపోటు అనేది ఒక గుర్తించని అతిథి వంటిది. మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నా సరే,మీ

జెనెటిక్స్ కారణంగా ఊహించని క్షణాల్లో గుండెపోటుకు దారి తీయవచ్చు. మీ వద్ద వేరొక వ్యక్తి ఉంటే కనుక, మీకు ప్రారంభ వైద్య చికిత్సను చేయవచ్చు. మీరు ఒంటరిగా ఉంటే మీకు సరైన కదలికలు మినహా, బతకటానికి చిన్న ఆస్కారం మాత్రమే ఉంటుంది.

అమెరికాలో ప్రతి సంవత్సరం కనీసం 1.5 మిలియన్ మంది గుండె పోటుతో బాధపడుతున్నారు. 1.5 మిలియన్ మందిలో 5,00000 మంది చనిపోతున్నారు. అమెరికన్లు చనిపోవటానికి కారణం ఎమర్జెన్సీ వైద్య సేవలు లేకపోవటమే కారణం అని చెప్పవచ్చు. స్పష్టంగా చెప్పాలంటే, మీరు ఒక అభివృద్ధి చెందిన దేశంలో నివసిస్తూ ఉంటే, అభివృద్ధి చెందని దేశాలలో నివసించే ప్రజలతో పోలిస్తే మీకు గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. మీరు అత్యంత సాధారణ చిహ్నాల ద్వారా గుండెపోటు బాధ తెలుసుకున్నప్పుడు,మీరు ఖచ్చితంగా త్వరగా చర్య తీసుకోవాలి. మనస్సు యొక్క మీ ఉనికి మీ మనుగడ అవకాశాలను పెంచదు.

ఉదాహరణకు, మీరు ప్రస్తుతం గుండెపోటును కలిగి ఉంటే,మీరు వెంటనే ఎమర్జెన్సీ

కోరుకుంటారు. దానికి బదులుగా మరిన్ని లక్షణాలు చూపే దాక వేచి ఉండరు. కాబట్టి, ఇక్కడ మరింత వైద్య చికిత్స చేయటానికి ముందు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటును తట్టుకోవటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.

లక్షణాలు తెలుసుకోండి:

*. మీ మొదటి అడుగు గుండెపోటు లక్షణాలను తెలుసుకోవటం.

*. మీరు ఊహాత్మక గుండెపోటుతో భాదపడుతూ ఉంటే, ఏమి జరుగుతుందో మీరు గుర్తించలేరు.

*. సాధారణ గుండెపోటు లక్షణాలు ఛాతీ బిగుతు లేదా సంపూర్ణత ఉంటాయి. అలాగే ఛాతీ నుండి ప్రసరణ, శ్వాస ఆడకపోవటం మరియు తీవ్రమైన నొప్పి ఉంటాయి.

*. ఛాతీ మధ్యలో అసౌకర్యమైన ఒత్తిడి, సంపూర్ణత, పిండినట్టు ఉండటం లేదా నొప్పి వంటి లక్షణాలు ఉంటే, మీరు గుండెపోటుతో బాధపడుతున్నట్లు అలారంగా భావించాలి. మరియు అది ఒక

*. మీరు చేస్తున్న ప్రతిదీ ఆపాలి మీరు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో గుండెపోటు లక్షణాలు ఎదుర్కొంటుంటే, అప్పుడు వాహనం ఆపండి.

మీరు చేస్తున్న ప్రతి పనిని ఆపండి.

*. మీరు మీ శరీరం నుండి ఒత్తిడి పోగొట్టేందుకు స్పేస్ మరియు స్వేచ్ఛ ఇవ్వాలి.

*. శరీరం యొక్క కండరములను సడలిస్తే బ్లాక్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది.

*. ఇది ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటును తట్టుకొనే మార్గం.

*. ఆస్పిరిన్ ఉంచుకోండి చాలా గుండెపోటు కేసుల్లో రక్తం గడ్డకట్టటం వలన గుండె పోటుకు కారణం అవుతుంది.

*. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే భాద్యతను రక్త కణాలు తీసుకుంటాయి. ఈ అడ్డంకులు ఆమ్లజని అధికంగా ఉన్న రక్తాన్ని గుండెకు అందకుండా చేయవచ్చు.

*. అలాగే గుండె కండరాలకు మరింత నష్టం కలిగించి,అది క్రమంగా మరణానికి దారి తీస్తుంది.

*. మీరు గుండెపోటు ఉన్న సమయంలో ఆస్పిరిన్ తీసుకుంటే, క్లాట్ ను నివారించే అవకాశం ఉంటుంది.

*. అలాగే క్లాట్ విచ్ఛిన్నంనకు సమయం కూడా ఉంటుంది.

*. మీరు డాక్టర్ కోసం వేచి ఉన్న సమయంలో ఆస్పిరిన్ తీసుకోవాలి.

*. గుండె పోటును తట్టుకోవటానికి ఇది ఒక

మంచి మార్గం.

*. గుండెపోటు చుట్టిముట్టినప్పుడు విజయవంతముగా బయటకు రావటానికి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. కానీ చాలా వాటిని అపోహలుగా నిర్ధారణ చేయవచ్చు.

*. మీరు బాగా సిద్దంగా ఉండాలంటే, వివిధ నివారణ ఎంపికల గురించి మీ డాక్టర్ ని అడిగి తెలుసుకోవాలి.

హృదయ సంబంధ సమస్యలు-పరిష్కారాలు

గుండె నొప్పి వస్తే ఏం చేయాలి?

బిపీ, షుగర్, పని ఒత్తిళ్ల వల్ల హృద్రోగాలు వస్తున్నాయి. గుండె కండరాలు దెబ్బతినడం, రక్తనాళాల్లో ఆటంకం ఏర్పడటం వల్ల గుండె నొప్పి వస్తుంటుంది. కారణాలేవైనా ఆకస్మాత్తుగా గుండె నొప్పితో సృహ కోల్పోతున్న వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ఇంట్లో ఉన్నప్పుడు, రోడ్డుపై ప్రయాణం చేస్తున్నప్పుడు, కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు కొందరు గుండెనొప్పితో బాధపడుతున్నారు. ఇలాంటప్పుడు గుండెనొప్పి వచ్చిన రోగులు, వారి పక్కన ఉన్న వారు ఏం చేయాలనే విషయాలను వైద్య నిపుణులు వివరిస్తున్నారు.

ఆకస్మాత్తుగా తీవ్రమైన గుండె నొప్పి వచ్చి ఎవరైనా సృహ కోల్పోయినప్పుడు పక్కన ఉన్న వారు వెంటనే ప్రాథమిక చికిత్స చేసి, వెంటనే అంబులెన్స్ను పిలిచి, జాప్యం లేకుండా సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తే చాలా కేసుల్లో రోగి ప్రాణాలు కాపాడవచ్చు. కార్యాలయంలోనో, ఇతర బహిరంగ ప్రదేశాల్లోనే ఉన్నప్పుడు గుండె నొప్పితో పడిపోతే సమీపంలో ఉన్న వారు చేయాల్సిన ప్రాథమిక చికిత్సలపై అందరికీ అవగాహన అవసరం. వివిధ రకాల హృద్రోగాల వల్ల ఓ వ్యక్తి గుండె ఆగి మెదడుతోపాటు ఇతర శరీర భాగాలకు రక్త సరఫరా నిలచినప్పుడు సృహ కోల్పోతాడు. అలాంటప్పుడు పక్కనున్న వారు కార్డియాక్ రెసిస్టేషన్ కోసం ప్రాథమిక చికిత్స చేయటం వారి కర్తవ్యంగా భావించా `లి. ఛాతీ వద్ద రెండు చేతులు ఒకదానిపై ఒకటి పెట్టి అదుముతుండాలి. అలా నిమిషానికి 60 నుంచి 70 సార్లు చేయాలి. నోటి నుంచి నోటి ద్వారా సృహ కోల్పోయిన రోగికి శ్వాస కల్పించాలి. రోగి మెడ వెనుక చేయి పెట్టి డీఫిబ్రిలేటర్ మిషన్ సాయంతో షాక్ ఇవ్వాలి. దీనివల్ల ఆగిపోయిన గుండె బ్రెయిన్డెడ్ కాకముందే స్టిములేట్ అయి పనిచేయటం ఆరంభిస్తుంది. దీంతోపాటు వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేసి, సత్వరంరోగిని ఆసుపత్రికి చేర్చాలి.

శ్వాస పీల్చి వదలాలి...

ఆకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చినపుడు మీరు ఇంట్లో ఒంటరిగా ఉంటే దీర్ఘంగా శ్వాస పీల్చి వదులుతుండాలి. తన రెండు చేతులతో గుండెను అదుముతూ కంప్రెషన్ చేసుకుంటే మంచిది. దీంతోపాటు వెంటనే ఫోన్ చేసి, అంబులెన్స్ను తెప్పించుకొని, వీలైనంత త్వరగా ఆసుపత్రికి చేరుకోవాలి. గుండెనొప్పి వచ్చినపుడు ఇంటి వద్ద, బహిరంగ ప్రదేశాల్లో తీసుకునే బేసిక్ లైఫ్ సపోర్టు రోగి ప్రాణాలు కాపాడేందుకు దోహదం చేస్తుంది. గుండెనొప్పి వచ్చినపుడు చేయాల్సిన ప్రాథమిక చికిత్సపై అందరిలో చైతన్యం రావాలి. అమెరికాలోని విమానాశ్రయాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, షాపింగ్ మాల్స్, పెద్ద కార్యాలయాల్లో డీఫిబ్రిలేటర్ మిషన్లు ఉంటాయి. దీని వల్ల ఆగిపోయిన గుండెను పనిచేయించేందుకు ఇవి ఉపయోగపడతాయి. పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు హృద్రోగులకు అందించాల్సిన ప్రాథమిక చికిత్సపై అవగాహన అవసరముంది. కల్పించాల్సినతక్షణ వైద్య చికిత్స

గుండెనొప్పి వచ్చిన ఆసుపత్రికి తీసుకొచ్చాక తక్షణ వైద్య చికిత్స చేయించాలి. నోరు లేదా ముక్కులో నుంచి ట్యూబ్ పంపించి వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ను అందిస్తారు. తొడ లేదా మెడలోని చిన్న రక్తనాళం ద్వారా గుండె లోపలకు పేస్మేకర్ ద్వారా విద్యుత్తు ఇచ్చి గుండెలో రక్తం పంపింగ్ను పెంచుతారు. బెలూన్ పంపు, ఇంప్లెల్లా డివైజ్ల ద్వారా గుండె ఎడమ వైపు నుంచి శరీరంలోని అన్ని భాగాలకు రక్త సరఫరాను పెంచుతారు. ఈ చికిత్స వల్ల ఆక్సిజన్తోపాటు రక్త సరఫరా మెరుగుపడి హృద్రోగి కోలుకుంటాడు.

గుండె నొప్పికి కారణాలెన్నో... ఆకస్మాత్తుగా గుండెనొప్పి రావటానికి పలు కారణాలున్నాయి. 20 నుంచి 30 ఏళ్ల వయసు వారిలో గుండె కండరం మందంగా మారి హార్ట్ బీటింగ్ ఎక్కువ అవుతుంది. లాంగ్ క్యూటీసిండ్రోమ్ వల్ల కూడా రోగికి గుండెనొప్పి వస్తుంది. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డ కట్టడం వల్ల గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తం సరఫరా ఆగిపోవటం వల్ల ఆక్సిజన్ లెవెల్ తగ్గి గుండె నొప్పి వస్తుంది. దీన్ని పల్మమనరీ అంబాల్కిమ్

అంటారు. కొందరికి పుట్టుకతోనూ హృద్రోగాలు వస్తుంటాయి.

ముందస్తు పరీక్షలు సాధారణంగా గుండెకు సంబంధించి సమస్యలు వచ్చాయని అనుమానమున్నప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లి కార్డియాలజిస్ట్ల పర్యవేక్షణలో ఈసీజీ, 2డి ఇకో, టీఎంటీ, హోల్టర్ మానిటరింగ్, ఎలక్ట్రోకార్డియోగ్రామ్, కొరోనరీ యాంజియోగ్రామ్ తదితర పరీక్షలు చేయించుకోవాలి. హృద్రోగులు అనుక్షణం అప్రమత్తంగా ఉండటంతోపాటు గుండెనొప్పి వచ్చినప్పుడు ప్రాథమిక చికిత్సతోపాటు వెంటనే ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరాన్ని గుర్తించాలి. ప్రాథమిక చికిత్స, సత్వర వైద్యంతో రోగి ప్రాణాలు కాపాడవచ్చని అందరూ గ్రహించాలి.


లక్షణాలు :

కొద్దిదూరం నడవగానే ఆయాసం, ఛాతీ ఒక్కోసారి పట్టేసినట్లుగా ఉండటం, చెమట ఎక్కువగా పడుతుండటం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటం ఉంటేగుండె జబ్బుగా అనుమానించాల్సి ఉంటుంది. అయితే ఈ లక్షణాలు ఉన్నంత

మాత్రాన గుండె జబ్బు ఉందని హైరానా పడిపోవడం కూడా సరికాదు. లక్షణాలు ఉన్నా నిర్ధారించుకోవడానికి పరీక్షలు తప్పనిసరి.

రెగ్యులర్ చెకప్

నలభై ఏళ్లు దాటిన వారు రెగ్యులర్ గుండెకు సంబంధించిన పరీక్షలు చేసుకోవడం ద్వారా ముందే జాగ్రత్తపడవచ్చు. ఇ.సి.జి, 2డి ఎకో, కొలెస్టరాల్, టీఎమ్జీటీ పరీక్షల ద్వారా గుండె పనితీరు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఈ పరీక్షల ద్వారా జబ్బులను ప్రాథమిక దశలో గుర్తించి, చికిత్స తీసుకోవడం ద్వారా సమస్య తీవ్రం కాకుండా చూసుకోవచ్చు.


గుండె జబ్బు ఉంటే..

పైన పరీక్షల్లో గుండె బబ్బు ఉందని తేలినట్లయితే అప్పుడు మరికొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. సమస్య ఎక్కడ ఉంది? ఎన్ని చోట్ల రక్తనాళాల్లో అడ్డంకులు ఉన్నాయి? తదితర విషయాలు తెలుసుకోవడానికి యాంజియోగ్రామ్ పరీక్ష అవసరమవుతుంది. ఒకటి లేక రెండు బ్లాక్లు ఉన్నట్లయితే యాంజియోప్లాస్టి చికిత్స ద్వారా సమస్యను తొలగించుకోవచ్చు. మూడు లేకఅంతకంటే ఎక్కువ బ్లాక్లు ఉన్నా, గుండెకు వెళ్లే ప్రధాన రక్తనాళం (ఎల్ఎమ్సీఏ)లో సమస్య ఉన్నట్లయితే బైపాస్ సర్జరీ అవసరమవుతుంది. ప్రస్తుతం ఔషధ పూరిత అందుబాటులో ఉన్నాయి. స్టెంట్లు

వీటిని ఉపయోగించినట్లయితే స్టెంట్లో మళ్లీ బ్లాక్లు ఏర్పడకుండా ఉంటాయి. స్టెంట్లు వేసినా, బైపాస్ సర్జరీ జరిగినా మళ్లీ గుండె సమస్యలు తలెత్తకుండా ఉండటానికి తగిన మందులు వాడటం చాలా అవసరం. కొందరు ఆపరేషన్ జరిగింది కదా, ఇక ఏం ఫర్వాలేదు అని మందులు ఆపేస్తుంటారు. కానీ అది పనికిరాదు. రెగ్యులర్గా మందులు వాడుతూ, డైట్ కంట్రోల్ చేయాలి. వ్యాయామం చేయడం మరవద్దు.


జాగ్రత్తలు :

నడక ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు అరగంట పాటు నడక తప్పనిసరి చేసుకోవడం వల్ల గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చు. అలాగే కొలెస్టరాల్ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, ఉప్పు వాడకాన్ని తగ్గించడం, వేపుళ్లకు దూరంగా ఉండటం అవసరం. పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు

తీసుకున్నట్లయితే మీ గుండె పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది.

గమనిక : ఇది సోషల్ మీడియాలో మాత్రమే పూర్తి వివరాలు నిపుణులు ని సంప్రదించగలరు.

Fat Burning: helth tipsకొవ్వు కరిగించడానికి ఏది బెటర్? భోజనానికి ముందు నడవడమా.. భోజనం తర్వాత నడవడమా?

 Fat Burning: కొవ్వు కరిగించడానికి ఏది బెటర్? భోజనానికి ముందు నడవడమా.. భోజనం తర్వాత నడవడమా?


వ్యాయామం అనే ప్రక్రియలో వాకింగ్ చేయడం చాలా ఉత్తమమైన పని. ఇది మీ కేలరీలను సునాయాసంగా ఖర్చు అయ్యేలా చేస్తుంది. ఒత్తిడిని తగ్గించడంతో పాటు, మెటబాలిజం పెంచి, కండరాలను మంచి షేప్ లోకి మారుస్తుంది.

మీ వెయిట్ లాస్ జర్నీలో వాకింగ్ అనేది మరిన్ని ప్రయోజనాలను చేకూరుస్తుంది.


వాకింగ్ చేయడంలో భిన్న అభిప్రాయాలు కనిపిస్తుంటాయి. కొందరు ఖాళీ కడుపుతో నడిస్తే, మరికొందరు తిన్న తర్వాత నడుస్తారు. మీరెప్పుడైనా ఆలోచించారా.. వాస్తవానికి ఏ సమయంలో వాకింగ్ చేస్తే వెయిట్ లాస్ ఎక్కువగా ఉంటుందనేది? ఈ రెండు సందర్భాల్లో ఎప్పుడు వాకింగ్ చేసినా కూడా కేలరీలు ఖర్చవుతాయి. కానీ, నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. ఏది ఉత్తమమనేది ఓసారి చూసేద్దామా?


ఎవరైనా బరువు తగ్గాలని చూస్తున్నప్పుడు, ఉపవాసంతో ఉండి నడవటం మంచిది. దీన్ని 'ఉపవాస కార్డియో' అని కూడా పిలుస్తారు. ఒకరు సాధారణంగా ఆరోగ్యంగా ఉంటే, తక్కువగా తిన్న తర్వాత నడవడం వారి రోజువారీ అలవాట్లలో భాగంగా ఉండవచ్చు.


ఉపవాసంతో నడక ఎలా సహాయపడుతుంది..

నడవడం మొదలుపెడితే శరీరం నిల్వ అయిన కొవ్వును శక్తిగా ఉపయోగించడానికి ప్రేరేపిస్తుంది. మామూలుగా ఆహారంలో ఉండే గ్లూకోజ్ అందుబాటులో లేకపోవడం వల్ల, కొవ్వును కరిగించుకొని గ్లూకోజ్ గా మార్చుకుంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గితే, కాలేయం గ్లైకోజన్ ను గ్లూకోజ్ గా విడదీస్తుంది. ఇది మజిల్స్‌కు శక్తిని అందిస్తుంది. నిద్రలో కూడా కాలేయం గ్లూకోజ్ ను రక్తప్రసరణలో విడుదల చేస్తుంది. అందువల్ల, శరీరంలో గ్లైకోజన్ నిల్వలు ఉదయానికి తక్కువగా ఉంటాయి. అందువల్ల, ఉపవాస స్థితిలో వ్యాయామం చేసినప్పుడు శరీరం మరింత కొవ్వును శక్తిగా ఉపయోగిస్తుంది. ఇలా కొవ్వు కరగడం వల్ల బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది.


భోజనం తరువాత నడక

భోజనం తరువాత నడక కూడా ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. భోజనం తరువాత నడిస్తే, ఆహారంతో తీసుకున్న గ్లూకోజ్ ను శరీరం శక్తిగా ఉపయోగిస్తుంది. అందువల్ల, ఇది రక్తంలో చక్కెర పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది డయాబెటిస్ లేదా ఇన్సులిన్ తో బాధపడుతున్న వారికి సహాయపడుతుంది.


ఎంత సేపు నడవాలి?

బరువు తగ్గడంతో ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు, ప్రతిరోజూ 30 నుండి 60 నిమిషాలు నడవండి. మొత్తంగా, బరువు తగ్గేందుకు కేవలం వ్యాయామం మాత్రమే కాదు. మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని కూడా కొనసాగించాలి. మంచి నిద్ర పొందడం, క్యాలరీలను ఖర్చు చేయడం కూడా అవసరం. ఉపవాసంతో ఉన్నప్పటి నడక కొవ్వును ఎక్కువగా కరిగించవచ్చు.


నడిచే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:


వాకింగ్ చేయాలనుకుంటే, సరైన బూట్లు లేదా పాదరక్షలు ధరించాలి.

నడవడానికి వెళ్లే ముందు పాలు లేదా నీరు వంటి పానీయాలను తీసుకోవడం మంచిది. తద్వారా హైడ్రేట్ గా ఉండగల్గుతారు.

నడవడానికి వెళ్లే ముందు వార్మప్ చేయడం మంచిది. ఈ విధంగా చేయడం వల్ల మజిల్స్ లూజ్ అవుతాయి.

నడక వేగాన్ని మితంగా ఉంచుకుని, శ్వాసను నియంత్రణలో ఉంచుకోండి. ఫలితంగా శరీరంపై ఎలాంటి ఒత్తిడి రాకుండా ఉంటుంది.

GB Syndrome : భయపెడుతున్న జీబీ సిండ్రోమ్‌.. వేగంగా విస్తరిస్తున్న వ్యాధి.. లక్షణాలు ఇవీ..

 


GB Syndrome : భయపెడుతున్న జీబీ సిండ్రోమ్‌.. వేగంగా విస్తరిస్తున్న వ్యాధి.. లక్షణాలు ఇవీ..


GB Syndrome : తెలంగాణలో జీబీఎస్‌(GBS) వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు వ్యాధులు, వైరస్‌ల వ్యాప్తికి కారణమవుతున్నాయి.

మానవ తప్పిదంతోనే కోవిడ్‌ విజృంభించింది. తర్వాత బర్డ్‌ ఫ్లూ కారణంగా కోల్లు మృత్యువాతపడ్డాయి. ఆ తర్వాత కూడా వ్యాధులు, వైలరస్‌ తీవ్రత తగ్గడం లేదు. తాజాగా గులియన్‌ బ్యారీ సిండ్రోమ్‌(Gulian Byari Syndrome)(జీబీఎస్‌) వేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి లక్షణాలు ఏంటి? దీనిబారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలను ప్రజలు శోధిస్తున్నారు. కలుషిత నీరు, ఆహారం కారణంగానే జీబీఎస్‌ అధికంగా వచ్చే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు.


జీబీ సిండ్రోమ్‌ లక్షణాలు

ఏదైనా వైరల్‌ లేదా బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకిన తర్వాత పోస్టు వైరల్‌ లేదా పోస్టు బ్యాక్టీరియల్‌ వ్యాధిగా కనిపించేది జీబీఎస్‌. ఇది మెదడు నుంచి దేహంలోని ప్రతీ భాగానికి ఆదేశాలందించడానికి నరాలపై మైలీన్‌ అనే పొర ఉంటుంది. యాంటీ బాడీస్‌ ఈ పొరను దెబ్బతీసినప్పుడు మెదడు నుంచి సిగ్నల్స్‌ అందక అవయవాలు అచేతనంగా మారుతాయి.


- మొదట కాళ్లు చచ్చుబడిపోతాయి. క్రమంగా దేహమంతా అచేతనమవుతుంది. గొంతు క ండరాలు అచేతనమైతే రోగి మాట్లాడలేడు. మింగడమూ కష్టంగా ఉంటుంది. ముఖంలోని కండరాలు అచేతనమైతే కళ్లు కూడా మూయలేడు.


- ఈ ప్రక్రియ ఛాతీ కండరాలు, ఊపిరితిత్తులను పని చేయించే డయాఫ్రం కండరాలకు వెళ్లినప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఆ స్థితికి వచ్చిన బాధితులు మృతిచెందే అవకాశం ఉంది.


- గుండె స్పందనలు వేగంగా లేదా నెమ్మదిగా మారడం, బీజీ హెచ్చతగ్గులు, ముఖం నుంచి ఆవిర్లు వస్తున్నట్లు అనిపించడం, బాగా చెమటలు పట్టడం జరుగుతాయి. వ్యాధి మొదలయ్యాక 7 నుంచి 14 రోజులు తీవ్రంగా జ్వరం వస్తుంది మైలీన్‌ పొర మళ్లీ యథాస్థితికి వస్తే బాధితులు క్రమంగా కోలుకుంటారు. ఆ ప్రక్రియ రోజుల వ్యవధి నుంచి ఆరు నెలలు పడుతుంది.


- శరీరంలో పొటాషియం, కాల్షియం తగ్గినా జీబీఎస్‌ లక్షణాలే కనిపిస్తాయి. అయితే అవి భర్తీ కాగానే అచేతనత్వం తొలగిపోతుంది. జీబీ సిండ్రోమ నిర్ధారణ చాలా స్పష్టంగా జరగాలి. కలుషిత నీరు, ఆహారమే జీబీఎస్‌కు ప్రధాన కరణం.


తక్కువ ఖర్చుతో చికిత్స

జీబీఎస్‌ వ్యాధికి తక్కువ ఖర్చుతోనే చికిత్స చేయవచ్చు. రోగి తన రోజువారీ పనులను సొంతంగా చేసుకోలేని స్థితికి చేరుకుంటే వారికి తగిన మోతాదులో ఐదు రోజులు ఇమ్యూనో గ్లోబ్యులిన్‌ ఇంజెక్షన్‌ ఇస్తారు. ఇది దేహంలో మైలీన్‌ పొరను ధ్వంసం చేసే యాంటీబాడీస్‌ను బ్లాక్‌ చేయం ద్వారా పరిస్థితిని చక్కదిద్దొచ్చు.

Mango Leaves Benefits : ఈ ఆకులో ఉన్న ఈ రహస్యం తెలిస్తే అసలు వదిలిపెట్టారు.

 Mango Leaves Benefits : ఈ ఆకులో ఉన్న ఈ రహస్యం తెలిస్తే అసలు వదిలిపెట్టకుండా ఈ రోజే తినటం ప్రారంభిస్తారు



వాటి గురించి మనకు తెలియక వాటి గురించి పెద్దగా పట్టించుకోము. వాటిలో ఉన్న ప్రయోజనాల గురించి తెలిస్తే చాల ఆశ్చర్యం కలుగుతుంది.


మామిడి ఆకుల రహస్యం తెలిస్తే డాక్టర్లతో పనుండదు.. మామిడి ఆకులలో బోలెడన్ని పోషకాలు ఉంటాయని, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని

 ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మామిడి చెట్ల ఆకులు పుష్కలమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయని అంటున్నారు. మామిడి ఆకులతో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చునని సూచిస్తున్నారు.


మామిడి ఆకులలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, కాపర్, పొటాషియం, మెగ్నీషియం, ఫెవోనాయిడ్స్, సాపోనిన్స్, యాంటీఆక్సిడెంట్స్, ఎంజైమ్స్ , యాంటీ మైక్రోబయల్ కాంపోనెంట్స్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి.

 

అలాగే బొప్పాయి పండులో ఉండే ‘పాపిన్’ అనే ఎంజైమ్ ను కూడా మామిడి ఆకులలో ఉంటుంది. మామిడి ఆకులలో ఇన్ని పోషకాలు ఉన్నాయి కాబట్టే పండుగలకు, శుభకార్యాలు జరిగినప్పుడు తప్పనిసరిగా గుమ్మాలకు మామిడి ఆకులతో తోరణాలు కట్టటంసంప్రదాయంగా మన పెద్దలు పెట్టారు. మనలో చాలా మందికి మామిడి పండు,మామిడికాయల గురించి తెలుసు.




కానీ మామిడి ఆకులలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలియదు . మామిడి ఆకులను ఎక్కువగా ఆయుర్వేదంలో ఎన్నో రుగ్మతల నివారణకు వాడుతూ ఉంటారు. మామిడి ఆకును నీటిలో మరిగించి లేదా పొడిరూపంలో తీసుకోవచ్చని నిపుణులు చెప్పుతున్నారు. మామిడి ఆకులో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు.

 

ఇప్పుడు ఆ ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. మామిడి ఆకులు నోటి దుర్వాసనను సమర్ధవంతంగా తొలగిస్తుంది. మామిడి ఆకులను కాల్చాలి. కాల్చినప్పుడు వచ్చిన పొగను పీల్చితేగొంతు సంబంధ సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. రెండు మామిడి ఆకులను మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని ఒక గ్లాస్ నీటిలో కలిపి త్రాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.

 

కిడ్నీలో రాళ్లను తొలగించుకోవడానికి మంచి ఇంటి చిట్కా అని చెప్పవచ్చు. కొంత మంది విశ్రాంతి లేకుండా విపరీతంగా పనిచేసి తరచూ అలసిపోయి ఒత్తిడికి గురిఅవుతూ ఉంటారు. అలాంటి వారు మామిడి ఆకులతో తయారుచేసిన టీ త్రాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. మామిడి ఆకులో ఉండే పోషకాలు నాడీవ్యవస్థను రిలాక్స్ చేసి రీ ఫ్రెష్ గా ఉండేలా చేస్తాయి.

 

కాలిన గాయాలు త్వరగా నయం కావటానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. మామిడి ఆకులను కాల్చాలి. కాల్చినప్పుడు వచ్చినబూడిదను కాలిన గాయాలపై జల్లితే త్వరగా ఉపశమనం కలుగుతుంది. మామిడి ఆకులతో తయారుచేసిన టీ త్రాగితే శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. మధుమేహాన్ని నివారించడంలో మామిడి ఆకు అద్భుతంగా పనిచేస్తుంది.

 

మామిడి ఆకుల్లో ఉండే టానిన్స్, యాంతో సైనిన్స్ మధుమేహం ను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుందని , అలాగే వ్యాస్కులర్ రిలేటెడ్ సమస్యలను కూడా నివారిస్తుందని ఈ మధ్య జరిగిన పరిశోధనల్లో తేలింది. కాబట్టి మధుమేహం ఉన్నవారు ప్రతి రోజు ఒక కప్పు మామిడి ఆకుల టీ త్రాగితే మంచి ప్రయోజనం ఉంటుంది.

 

రక్త సరఫరా సాఫీగా జరిగేలా చేసి రక్తపోటు సమస్యలు లేకుండా చేస్తుంది. రక్తపోటు సమస్యతో బాధపడుతున్నవారు మామిడి ఆకుల టీ త్రాగితే ప్రయోజనం ఉంటుంది. మామిడి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట శరీరంలో విషాలను బయటకు పంపటంలో సహాయపడుతుంది.

chemata yekuvaga vastunda. Helth Tips. Articlesshow

చెమట అధికంగా వస్తుందంటే..


ఎండకాలం అనగానే చెమట సమస్య ఏర్పడుతుంది. కొంతమంది ఈ సమస్య నుండి బయట పడాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరికీ చెమటతో పాటు శరీరం మొత్తం దుర్వాసన కూడా వస్తుంటుంది. మరి ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి ? కొన్ని చిట్కాలు..

*. ద్రాక్ష పండ్లు తినాలి. నిత్యం తగినంత మోతాదులో కొన్ని ద్రాక్ష పండ్లను తిన్నా అధిక చెమట సమస్య తగ్గిపోతుంది.

*. రెండు టీ స్పూన్ల వెనిగర్, ఒక టీ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ లను బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు మూడు సార్లు భోజనానికి ఒక గంట ముందు తాగాలి.

*. టీ ట్రీ ఆయిల్ ను కొద్దిగా తీసుకుని చెమట వచ్చే ప్రదేశాల్లో రాయాలి.

*. ఒక టేబుల్ స్పూన్ ఉప్పు.. నిమ్మ రసాలను బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీర భాగాలపై రాసుకుంటే చెమట సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది.

2.16.2025

Cough Remedies Helth Tips Articles

దగ్గు తగ్గడానికి చిట్కాలు..

దగ్గు తగ్గడానికి ఈ చిట్కాలు పాటించండి: 
రోజంతా నీరు త్రాగి, హైడ్రేటెడ్‌గా ఉండండి.
గోరువెచ్చని నీరు తాగడం వల్ల శ్లేష్మం విడుదల అవుతుంది.
ఆవిరి పీల్చండి.
ధూమపానం వంటి చికాకులను నివారించండి.
క్యాబేజీ, కరక్కాయ, ధనియాలు, మిరియాలు వంటివి తినండి.
అల్లం, ధనియాలు, మిరియాలు వంటి వాటితో కషాయం చేసి తాగండి.
లవంగం బుగ్గన పెట్టుకోండి.
సొంటి కషాయంలో లేదా అల్లం రసంలో తేనె తీసుకోండి.
టీ లేదా నిమ్మకాయతో నీరు తాగండి.
దగ్గు అనేది శ్వాసకోశం నుండి చికాకులను తొలగించడానికి శరీరం చేసే ప్రయత్నం. రాత్రి నిద్రిస్తున్నప్పుడు శ్లేష్మం క్రిందికి జారుతుంది. మేల్కొన్నప్పుడు శ్లేష్మం విచ్ఛిన్నం కావడం వల్ల దగ్గు వస్తుంది. 

దగ్గు తగ్గడానికి ఈ చిట్కాలు పాటించండి: 
రోజంతా నీరు త్రాగి, హైడ్రేటెడ్‌గా ఉండండి.
గోరువెచ్చని నీరు తాగడం వల్ల శ్లేష్మం విడుదల అవుతుంది.
ఆవిరి పీల్చండి.
ధూమపానం వంటి చికాకులను నివారించండి.
క్యాబేజీ, కరక్కాయ, ధనియాలు, మిరియాలు వంటివి తినండి.
అల్లం, ధనియాలు, మిరియాలు వంటి వాటితో కషాయం చేసి తాగండి.
లవంగం బుగ్గన పెట్టుకోండి.
సొంటి కషాయంలో లేదా అల్లం రసంలో తేనె తీసుకోండి.
టీ లేదా నిమ్మకాయతో నీరు తాగండి.
దగ్గు అనేది శ్వాసకోశం నుండి చికాకులను తొలగించడానికి శరీరం చేసే ప్రయత్నం. రాత్రి నిద్రిస్తున్నప్పుడు శ్లేష్మం క్రిందికి జారుతుంది. మేల్కొన్నప్పుడు శ్లేష్మం విచ్ఛిన్నం కావడం వల్ల దగ్గు వస్తుంది. 



గొంతులో గర..గర.. హాయిగా నిద్రపోతున్న వేళ దగ్గు వస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది. చిరాకు తెప్పించడమే కాకుండా రాత్రంతా నిద్ర లేకుండా చేస్తుంది. దీనితో తరచూ వైద్యులు దగ్గరకు పరుగెడుతూ వారు ఇచ్చిన మందులను వేసుకుంటుంటారు. తాగే నీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఇంట్లోనో దొరికే వస్తువులతో దగ్గుకు చెక్ పెట్టవచ్చు. పావు కప్పు గ్లిజరిన్ లో పావు కప్పు తేనె కలపండి. అందులోనే పావు కప్పు నిమ్మసరం కూడా కలిపేయండి. అన్నింటినీ బాగా కలిపిన అనంతరం ఈ మిశ్రమాన్ని ఒక జార్ లో నిల్వ ఉంచుకోవాలి. ఒక టీ స్పూన్ మోతాదులో రోజంతా తరచూ తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల దగ్గు సమస్య త్వరగా తగ్గే అవకాశాలున్నాయి.

Eight symptoms that appear before a heart attack:Prevention-of-diseases

గుండె పోటు వచ్చే ముందు కనిపించే ఎనిమిది లక్షణాలు



ప్రస్తుత ఆధునిక కాలంలో చాలా మంది లైఫ్ స్టైల్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో ఓ పక్కా ప్రణాళిక లేకుండా బతికేస్తున్నారు.

సరైన టైంలో తినకపోవడం, జంక్ ఫుడ్ తినడం, స్మోకింగ్, డ్రింకింగ్ ఇలా ఓ పద్ధతి లేకుండా జీవిస్తున్నారు. దీంతో.. చాలా ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అందులో ముఖ్యంగా ప్రపంచం మొత్తాన్ని భయపెడుతున్న ఓ అంశం ఒకటి ఉంది. అదే గుండెపోటు. ఈ రోజుల్లో చాలా మంది గుండె పోటుతో ఆకస్మాత్తుగా చనిపోతున్నారు. యువత కూడా గుండె పోటు బారిన పడుతున్నారు.

గుండెపోటు అనేది తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఇది అకస్మాత్తుగా సంభవించవచ్చు. చాలా సందర్భాలలో ప్రాణాంతకం కావచ్చు. గుండెకు రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడి, గుండె కండరానికి నష్టం వాటిల్లినప్పుడు ఇది సంభవిస్తుంది. గుండెపోటు యొక్క కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. మరికొన్నింటిని గుర్తించకపోవచ్చు. గుండెపోటు సంకేతాలు లేదా లక్షణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీంతో సకాలంలో చికిత్స అందించవచ్చు. గుండెపోటు ఎనిమిది ప్రధాన లక్షణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం

​గుండెపోటు అత్యంత సాధారణ లక్షణం ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం. ఇది తరచుగా ఒత్తిడి, బిగుతు, భారంగా లేదా మండుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ నొప్పి సాధారణంగా ఛాతీ మధ్యలో సంభవిస్తుంది. కొన్ని నిమిషాల కంటే ఎక్కువ కాలం ఉంటుంది. కొన్నిసార్లు ఈ నొప్పి మెడ, ఎడమ దవడ, భుజం, వీపు లేదా చేతులకు వ్యాపిస్తుంది. అయితే, ఛాతీ నొప్పి కొన్నిసార్లు గ్యాస్ వల్ల కూడా రావచ్చు.

శ్వాస ఆడకపోవడం

​ఛాతీ నొప్పితో లేదా ఛాతీ నొప్పి లేకపోయినా శ్వాస ఆడకపోవడం గుండెపోటుకు కీలకమైన సంకేతం కావచ్చు. గుండె సరిగ్గా పనిచేయలేనప్పుడు, ఊపిరితిత్తులు సరైన మొత్తంలో ఆక్సిజన్‌ను అందుకోలేనప్పుడు ఈ సమస్య వస్తుంది. ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే, అది గుండెపోటుకు సంకేతం కావచ్చు.

చెమటలు పడటం

అకస్మాత్తుగా చలితో చెమటలు పట్టడం గుండెపోటుకు మరొక హెచ్చరిక లక్షణం. ఈ చెమట సాధారణంగా ఒత్తిడి లేదా వేడి వల్ల కలగదు. కానీ శరీరం లోపల జరుగుతున్న కొంత అవాంతరానికి సంకేతం కావచ్చు. ఎటువంటి కారణం లేకుండా మీకు చెమటలు పడుతుంటే, దానిని లైట్ తీసుకోవద్దు.

తలతిరగడం లేదా మూర్ఛపోవడం

గుండెపోటు సమయంలో, గుండె పనిచేసే సామర్థ్యం తగ్గుతుంది. దీని కారణంగా తగినంత రక్తం మెదడుకు చేరదు. దీంతో రక్తపోటు తగ్గడం ప్రారంభమవుతుంది. దీనివల్ల తలతిరగడం, కళ్లు బైర్లు కమ్మడం, మూర్ఛపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. మీకు అకస్మాత్తుగా తల తిరుగుతున్నట్లు అనిపిస్తే, అది గుండె సంబంధిత సమస్యకు సంకేతం కావచ్చు.

వికారం లేదా వాంతులు

కొంతమందికి గుండెపోటు సమయంలో వికారం, వాంతులు లేదా కడుపు నొప్పి వంటి సమస్యలు కనిపిస్తాయి. ఈ లక్షణం తరచుగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మీకు ఎటువంటి అనారోగ్యం లేకుండానే వికారం లేదా వాంతులు అనిపిస్తే, దానిని తీవ్రంగా పరిగణించండి. అంతేకాకుండా చాలా మందికి గుండెపోటుకు ముందు అజీర్ణం లేదా ఛాతీలో మంటగా అనిపించవచ్చు.

అలసట

ఎటువంటి కష్టం, పని చేయకపోయినా చాలా అలసిపోయినట్లు అనిపిస్తే, అది గుండెపోటుకు సంకేతం కావచ్చు. ఈ అలసట సాధారణంగా కొన్ని రోజులు లేదా వారాల ముందుగానే ప్రారంభమవుతుంది. రోజు రోజుకి అలసట క్రమంగా పెరుగుతుంది. ఈ లక్షణం మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

చేయి, మెడ లేదా దవడలో నొప్పి

గుండెపోటు సమయంలో, నొప్పి ఛాతీ నుంచి ప్రారంభమై చేతులు, మెడ, దవడ లేదా వీపు వరకు వ్యాపిస్తుంది. ఈ నొప్పి సాధారణంగా ఎడమ చేతిలో ఎక్కువగా ఉంటుంది. కానీ కుడి చేతిలో కూడా సంభవించవచ్చు. ఈ ప్రాంతాల్లో అకస్మాత్తుగా నొప్పి వస్తే, అది గుండెపోటుకు సంకేతం కూడా కావచ్చు.

క్రమరహిత హృదయ స్పందన

హృదయ స్పందనలో హెచ్చుతగ్గులు అనిపిస్తే, అది గుండెపోటుకు సంకేతం కావచ్చు. దీనిని తరచుగా "దడ" అని పిలుస్తారు. దీనిలో గుండె వేగంగా కొట్టుకుంటుంది లేదా కొట్టుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఈ లక్షణం తీవ్రంగా ఉంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.

Waking daily benefits helth tips articleshow

వాకింగ్.. ఏ సమయంలో..ఎలా చేస్తే మంచిదో తెలుసా..!


మీకాళ్లకు పని చెబితే..అవి మీ హృదయ భారం తగ్గిస్తాయి. చాలా మంది వైద్యులు చెప్పే సలహా ఇది. వాకింగ్ తో చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. వాకింగ్ శరీరానికే కాదు..
మానసిక ప్రశాంతత కూడా ఇస్తుంది. మీ గురించి మీరు సమీక్షించుకునే అవకాశం కల్పిస్తుంది. అయితే ఈ వాకింగ్ ఎప్పుడు చేయాలి.. ఎలా చేయాలి.. ఓసారి చూద్దాం.

వాకింగ్ అంటే చాలామందికి చాలా సందేహాలు వస్తుంటాయి. ఎప్పుడు నడవాలి.. ఎలా నడవాలి.. తిని నడవాలా.. పరగడపున నడవాలా.. ఇలాంటివి.. సాధారణంగా మార్నింగ్ వాకింగ్ మంచిది. ఎందుకంటే.. ఉదయం కాలుష్యం తక్కువగా ఉంటుంది. చల్లటి, తాజా గాలి మనసుకు ఉత్తేజం కలిగిస్తుంది. అలాగని పరగడుపున నడవాల్సిన అవసరం లేదు సుమా..

కాస్త లైట్ గా టిఫిన్ చేసి కూడా మార్నింగ్ వాకింగ్ చేయొచ్చు. మీకు షుగర్ ఉంటే తప్పకుండా ఏదైనా కాస్త తిన్నాకే వాకింగ్ చేయడం మంచిది. ఇలా చేయటం వల్ల రక్తంలో గ్లూకోజు మోతాదులు పడిపోతాయనే ఆందోళన ఉండదు. మిగిలిన వారు మామూలుగా పరగడుపున కూడా నడవచ్చు. కడుపు నిండా తిని స్పీడుగా నడిస్తే గుండె మీద ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. ఇది మంచిది కాదు.

నడకలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది.. రోజుకు 10 వేల అడుగులు నడవడం. కాబట్టి.. ఇది ఎక్కడ నడిచామన్నది ప్రధానం కాదు. ఆరుబయటే నడవాలని లేదు. ఇంట్లోనూ నడవొచ్చు. డాబాపైనో.. సెల్లార్ లోనో.. ఎక్కడైనా సరే. సాయంత్రం పూట కూడా వాకింగ్ చేయవచ్చు. కాకపోతే ఉదయం నుంచి పనిచేసి ఉండటం వల్ల శరీరం అలసిపోయి ఉంటుంది. నడక అంత ఉత్సాహంగా అనిపించదు. ఇక రాత్రి పూట నడక వృద్ధులకు అంత మంచిది కాదు. కంటి చూపు మూలంగా ప్రమాదాలకు గురవచ్చు. ఏదైనా తగిలి కింద పడిపోవచ్చు. అసలే వృద్దాప్యం కారణంగా ఎముకల సమస్యలు కూడా ఉంటాయి.

Munagaaku:మునగాకులను పొడి రూపంలో తీసుకోవడం వల్ల మన శరీరంలో జరిగే మార్పులు, ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా...helth tips Articleshow

Moringa Powder:ఈ చిట్టి చిట్టి ఆకుల పొడి చిటికెడు తిన్నా చాలు..!



మునగాకులను పొడి రూపంలో తీసుకోవడం వల్ల మన శరీరంలో జరిగే మార్పులు, ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా...

ప్రస్తుత కాలంలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంటుంది.

ఆ ఆరోగ్యం సరిగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. అలా మన డైట్ లో కచ్చితంగా చేర్చుకోవాల్సిన ఆహారం ఒకటి ఉంది. అదే మునగాకు. చూడటానికి చిట్టి చిట్టిగా ఉండే ఈ ఆకులు మన ఆరోగ్యంపై మ్యాజిక్ చేస్తాయి. ఈ మునగాకులను పొడి రూపంలో తీసుకోవడం వల్ల మన శరీరంలో జరిగే మార్పులు, ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా...

 
మునగాకులను సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. రెగ్యులర్ గా కొద్దిగా మునగాకు పొడిని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో రక్తం శుద్ధి చేస్తుంది. చర్మం, జుట్టూ రెండూ ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. మెదడు పనితీరును మెరుగుపరుతస్తుంది. క్యాన్సర్ వంటి జబ్బులు దరి చేరకుండా కూడా సహాయపడుతుంది.

 
మునగాకులో పోషకాలు..
మునగాకులో అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

2 గ్రాముల ప్రోటీన్
విటమిన్ B6 : 19%
విటమిన్ C 12 శాతం
ఐరన్ 11%
రిబోఫ్లావిన్ (B2) : 11%
బీటా-కెరోటిన్ విటమిన్ A:9%
మెగ్నీషియం: 8 శాతం

 
రెగ్యులర్ గా మునగాకులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్త పోటు సమస్య ఉండదు. అంతేకాదు.. రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల... ఈ మునగాకులో విటమిన్ సి మన శరీరానికి అందుతుంది. ఫలితంగా.. జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. చర్మం మృదువుగా, అందంగా కనపడేలా చేస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

మునగాకులోని బలమైన యాంటీఆక్సిడెంట్ కంటెంట్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అనారోగ్యాలు , ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో శరీరానికి సహాయపడుతుంది. క్వెర్సెటిన్ , క్లోరోజెనిక్ ఆమ్లం వంటి ముఖ్యమైన పదార్థాలు ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడం ద్వారా ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.

 
మెదడును పదునుపెడుతుంది

మీరు మతిమరుపుకు గురైతే మునగాకు తినండి. మునగాకులో కనిపించే సమ్మేళనాలు అభిజ్ఞా , జ్ఞాపకశక్తి పనితీరును మెరుగుపరుస్తాయి. దీని అధిక ప్రోటీన్, ఐరన్ కంటెంట్ మెదడు ఆక్సిజన్‌ను స్వీకరించడానికి సహాయపడుతుంది, ఇది ఏకాగ్రత, మానసిక స్పష్టతను ప్రోత్సహిస్తుంది. మునగాకులో కనిపించే కొన్ని లక్షణాలు క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.



High Blood Pressure: బీపీని తగ్గించే పసుపు.. ఎలాగో తెలుసా..?helth tips Articleshow

High Blood Pressure: బీపీని తగ్గించే పసుపు.. ఎలాగో తెలుసా..?


Blood Pressure: ప్రతి భారతీయుల ఇంటిలో కచ్చితంగా ఉండే పదార్థాల్లో ఉండే వాటిలో పసుపు ప్రధానమైంది. దాదాపు ప్రతీ ఒక్క వంటకంలో కచ్చితంగా పసుపును ఉపయోగిస్తుంటాం.
కేవలం వంటకు రుచిని మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే రక్తపోటును తగ్గించడంలో కూడా పసుపు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పసుపులో ఉండే కర్కుమిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, బిపి స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.

అధిక రక్తపోటుకు ముఖ్యమైన కారణాల్లో శరీరంలో వాపు పెరగడం ఒకటి. పసుపులోని కర్కుమిన్ రక్తనాళాల్లో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా రక్తప్రసరణ మెరుగుపడి, బిపి స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. పసుపులోని కర్కుమిన్‌ రక్తనాళాల విస్తరణకు సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇది అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక పసుపులోని యాంటీఆక్సిడెంట్లు, రక్తనాళాలకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో కీలకంగా పనిచేస్తుంది. కర్కుమిన్ రక్తనాళాలను విశ్రాంతి తీసుకునేలా చేయడం ద్వారా, నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది ధమనుల గోడలపై ఒత్తిడిని తగ్గించడంతో రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

పసుపును టీ లేదా పాలలో కలుపుకుని తీసుకోవడం ద్వారా బీపీ అదుపులో ఉంటుంది. వేడి నీటిలో 1 టీ స్పూన్ పసుపును కలపాలి. అలాగే ఇందులో చిటికెడు నల్ల మిరియాల పొడి, తేనె లేదా నిమ్మరసం కలుపుకోవాలి. ఇలా రోజు ఒకసారి మరీ ముఖ్యంగా ఉదయం తీసుకుంటే క్రమంగా అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. పాలు పసుపు కలుపుకొని తాగినా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే దీనిని గోల్డెన్‌ మిల్క్‌గా చెబుతుంటారు. గోరు వెచ్చని పాలలో 1/2 టీ స్పూన్ పసుపు కలుపుకొని తాగాలి. రోజూ ఉదయం ఇలా తాగితే శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. ఇది అధిక రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.

Paralysis Treatment: helthy tips. Article show

పక్షవాతానికి చెక్!


పక్షవాతం వస్తే ఎంత నరకమో తెలిసిందే! మంచానికే పరిమితమై ఇతరులపై ఆధారపడి జీవనం సాగించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ముందు జాగ్రత్తలతో పక్షవాతం రాకుండా చూసుకోవాలని అంటున్నారు వైద్యులు. ఇందుకోసం వారు కొన్ని సూచనలు చేస్తున్నారు. ప్రతిరోజూ శరీరానికి సరిపడా మెగ్నీషియం తీసుకుంటే పక్షవాతం దరిచేరదట. අධි ఆషామాషీగా చెప్పింది కాదు. పరిశోధనల్లో వెల్లడయిన విషయం ఇది. మెగ్నీషియం సమృద్ధిగా లభించే ఆహారాన్ని ఎక్కువగా తీసుకునే వారిలో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూడటం ద్వారా పక్షవాతం ముప్పు తగ్గిపోతుందని పరిశోధకులు గుర్తించారు. ఆహారం ద్వారా తీసుకునే మెగ్నీషియం 100 మి.గ్రా మోతాదు పెరుగుతున్న కొద్దీ పక్షవాతం ముప్పు తొమ్మిది శాతం తగ్గుతున్నట్లు కనుగొన్నారు. పొట్టు తీయని ధాన్యాలు, పాలకూర, తోటకూర, బీన్స్, బాదం, జీడిపప్పులో మెగ్నీషియం అధికంగా లభిస్తుంది.

Diabetes helthy tips articleshow

మధుమేహులు తీసుకోదగ్గ ఆహారం... పండ్లు...

మధుమేహం (డయాబెటిస్ మెల్లిటస్) నియంత్రణలో ఉండడం అన్నది ఆహారంపైనే ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. తీసుకునే ఆహారంలో ఉండే కాంపోనెంట్లు రక్తంలో చక్కెరలు పెరగడం, తరగడాన్ని నిర్దేశిస్తాయి. అందుకే మధుమేహం బారిన పడిన వారు మందుల కంటే ముందు ఏ తరహా ఆహారం తీసుకోవాలి, దేన్ని తీసుకోరాదన్న అవగాహన పెంచుకోవాలి. కనుక వారు తీసుకోవాల్సిన ఆహారం, పండ్ల గురించి పోషకాహార, వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

కాకరకాయ

షుగర్ ఉన్న వారు కాకరకాయలు తింటే మంచిదని మన చుట్టూ ఉన్న వారిలో చాలా మంది చెబుతుంటారు.
 రక్తంలో చక్కెర నిల్వలు పెరగకుండా నియంత్రిస్తుందని అలా చెబుతారు. ఎందుకంటే కాకరకాయలో ప్లాంట్ ఇన్సులిన్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ స్థాయులను సమర్థవంతంగా నియంత్రిస్తుంది.
ఉదయం రెండు నుంచి మూడు కాకరకాయల నుంచి రసం తీసుకుని తాగొచ్చు. అలాగే, కాకరకాయల్లోని గింజలను ఎండబెట్టి పొడి చేసుకుని ఓ చెంచాడు నీటిలో కలుపుకుని రోజూ తాగినా మంచి ఫలితం ఉంటుంది.

మెంతి

మధుమేహ నియంత్రణకు మనలో ఎక్కువ మంది మెంతులను తీసుకోవడం చూస్తుంటాం. ఓ చెంచాడు మెంతులను రోజూ రాత్రి గ్లాసు నీటిలో వేసుసుకుని మరుసటి రోజు ఉదయం నీటిని మాత్రం తాగాలి. మిగిలిన మెంతులను చట్నీ చేసుకుని తినడం లేదా చపాతీలో కలుపుకుని తినడం చేయొచ్చు.

వెల్లుల్లి

వెల్లుల్లి సహజంగా రక్తపోటు నియంత్రణకు మంచిగా ఉపకరించే ప్రకృతి సిద్ధ ఔషధం. అంతేకాదు డయాబెటిస్ నియంత్రణకు కూడా ఉపయోగపడుతుంది. ఇందులో జింక్, సల్ఫర్ ఇన్సులిన్ కాంపోనెంట్స్ వుంటాయి. ఇక వెల్లుల్లిలో ఉండే పొటాషియం మూత్రం ద్వారా వెళ్లిపోయే

దాన్ని భర్తీ చేస్తుంది. అందుకే ప్రతీ రోజూ ఆహారంలో వెల్లుల్లిని భాగం చేసుకోవాలి.

అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్)

అవిసె గింజల్లో ఓమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతాయి. ప్రొటీన్, ఫైబర్ ఈ గింజల నుంచి లభిస్తాయి. ఇందులో ఉండే మెగ్నీషియం కణాలు ఇన్సులిన్ ను గ్రహించేందుకు తోడ్పడతాయి. ప్రతీ రోజూ ఉదయం నిద్ర లేచిన తర్వాత ఓ చెంచాడు గింజలను తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

దాల్చిన చెక్క

గ్లూకోజ్ ఉత్పత్తిని మెరుగుపరిచి కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో దాల్చిన చెక్క చక్కగా పనిచేస్తుందని పలు అధ్యయనాలు తేల్చాయి. దాల్చిన చెక్కను నీటిలో వేసి మరిగించి es నీటిని తాగితే మధుమేహంతో బాధపడేవారు గుర్తిస్తారు. మార్పును

పీచు పదార్థాలు
ఆహారంలో భాగంగా పీచు అధికంగా ఉండే వాటిని తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్, చక్కెర నిల్వలు నియంత్రణలో ఉంటాయి. ఎందుకంటే పీచు ఉండే పదార్థాలు వెంటనే గ్లూకోజ్ గా మారవు. వీటి జీర్ణ ప్రక్రియ నిదానంగా ఉంటుంది. కనుక చక్కెరలు కొంచెం కొంచెంగా విడుదల అవుతాయి. ఓట్స్, పాలిష్ పట్టని ముడి బియ్యం, గోధుమల్లో పీచు ఎక్కువగా లభిస్తుంది.

బీన్స్

బీన్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయల్లో ఒకటి. ఇందులో పీచు దండిగా ఉంటుంది. మన జీర్ణ వ్యవస్థలో ఎక్కువ సమయం పాటు ఇది ఉంటుంది. దీంతో కడుపు నిండినట్టు భావన కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి, మధుమేహంతో బాధపడేవారికి ఎక్కువ ప్రయోజనకారి.

బార్లీ

బార్లీలో నీటిలో కరిగిపోయే ఫైబర్, కరిగిపోని ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. సూప్ గానూ లేదా సలాడ్స్ లోనూ కలిపి తీసుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్లఆహార సేవన అనంతరం రక్తంలో బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరగడాన్ని 70 శాతం వరకు నియంత్రిస్తుంది. దీంతో రక్తంలో చక్కెర నిల్వలు అదుపులో ఉంటాయి.

క్యారెట్స్

క్యారట్లలో కొద్ది మోతాదులో షుగర్ ఉంటుంది. కనుక మధుమేహం ఉన్న వారు వీటిని తీసుకోవద్దని చెబుతుంటారు. కానీ, ఈ మోతాదు తక్కువే గనుక తీసుకోవచ్చు. ఎందుకంటే క్యారట్లలో సహజమైన బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది డయాబెటిస్ నియంత్రణకు విషయాన్ని గుర్తించాలి. ఉపకరించేదన్న

తోటకూర

రోజూ తోటకూరను ఆహారంలో భాగం చేసుకున్నా ఫలితం కనిపిస్తుంది. తోటకూర ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుందని... దాంతో రక్తంలోని చక్కెర నిల్వలను కణాలు చక్కగా అందిపుచ్చుకుంటాయని శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా గుర్తించడం జరిగింది.
పాలు

ఫ్యాట్ తక్కువగా ఉండే పాలను రోజూ రెండు కప్పుల వరకు తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఇందులో ఉండే ప్రొటీన్లు రక్తంలో షుగర్ నిల్వల నియంత్రణకు తోడ్పడతాయి. పెరుగు, మజ్జిగ తీసుకోవడం కూడా మంచిదే.

ఓట్ మీల్

ఓట్స్ లో నీటిలో కరిగిపోయే ఫైబర్ ఉంటుంది. నీటితో కలిపితే పేస్ట్ గా మారడం జరుగుతుంది. ఈ ఫైబర్ జీర్ణ ఎంజైమ్ లు, ఆహారంలోని పిండి పదార్థాల మధ్య ఓ లేయర్ గా పనిచేస్తుంది. దీంతో ఆహారంలోని కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెరగా మారడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరిగిపోదు. బ్రేక్ ఫాస్ట్, సూప్ లలో భాగంగా దీన్ని తీసుకోవడం ఫలితాన్నిస్తుంది.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ లో ఉండే మంచి ఫ్యాట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగకుండా అడ్డుకుంటుంది. ఆలివ్ ఆయిల్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయంతీసుకుంటుంది.

క్యాబేజీ

క్యాబేజీలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో క్రోమియం అధికంగా ఉంటుంది. దీర్ఘకాలంలో రక్తంలో షుగర్ నియంత్రించడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. మధుమేహంతో బాధపడుతున్న వారు ఆహారంలో భాగంగా దీన్ని తీసుకోవడం నిపుణులు. మంచిదంటున్నారు పోషకాహార

కొద్ది కొద్దిగా ఆహారం

షుగర్ వ్యాధితో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ భోజనాల జోలికి వెళ్లొద్దు. ఒకేసారి పెద్ద మొత్తంలో ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ స్థాయులు అమాంతం పెరిగిపోతాయి. దీనికి బదులు స్వల్ప పరిమాణంలో ప్రతీ మూడు గంటలకోసారి తీసుకోవడం మంచిది. అలాగే, ఎట్టి కారణాల వల్లనూ ఆహారాన్ని మానేయకూడదు.

నట్స్

నట్స్ లో మంచి ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను తగ్గిస్తాయి. దీంతో బ్లడ్ షుగర్ నియంత్రణ తేలిక అవుతుంది. నట్స్ లోని విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు కణాలను కాపాడతాయి. దీంతో నాడులు, నయనాలు దెబ్బతినకుండా రక్షణ ఉంటుంది. వీటిలో ఉండే ఫైబర్, మెగ్నీషియం రక్తంలో చక్కెరల నియంత్రణకు తోడ్పడతాయి.

దానిమ్మ (పొమెగ్రనేట్స్)

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి. దీర్ఘకాలంగా వ్యాధులతో బాధ పడేవారికి దానిమ్మ చాలా మంచిది. ఇందులో చక్కెరలు స్వల్ప స్థాయిలో ఉంటాయి గనుక మధుమేహం గల వారు తీసుకోవచ్చు.

పుచ్చకాయ (వాటర్ మెలాన్)

ఇందులో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. వాస్తవానికి మధుమేహులు గ్లైసిమిక్ ఇండెక్స్ (జీఐ) తక్కువగా ఉన్న వాటినే తీసుకోవాలి. ఎందుకంటే జీఐ ఎక్కువగా ఉంటే బ్లడ్ షుగర్ పెరుగుతుంది. అయితే, పుచ్చకాయలో జీఐ ఎక్కువగానే ఉన్నా గ్లైసిమిక్ లోడ్ అన్నది తక్కువ. కనుక పరిమితంగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతారు. పుచ్చకాయలో అధికంగా ఉండే పొటాషియం కిడ్నీల పనితీరు చక్కగా ఉండేందుకు ఉపకరిస్తుంది. షుగర్ వ్యాధి ఉన్న వారిలో కిడ్నీల వైఫ్యలం ముప్పు ఉంటుంది. ఇక డయాబెటిస్ లో నరాలు దెబ్బతినడం కూడా జరుగుతుంది. కానీ, పుచ్చకాయలో ఉండే లైకోపీన్ దీన్ని నివారిస్తుంది.

కమలాలు

డయాబెటిస్ ఉన్న వారు విటమిన్ సి తీసుకోవడం ఎంతో అవసరం. కమలా పండు రోజుకు ఒక్కటి తీసుకున్నా ఆ మేరకు లభిస్తుంది. ఈ పండు తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ స్థాయులు పెరిగిపోతాయన్న భయం అక్కర్లేదు. _చక్కెర స్థాయులు తక్కువే.

బొప్పాయి

బొప్పాయిలో విటమిన్, మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి గనుక మధుమేహులకు ఈ పండు మంచి చేస్తుంది.

జామ

మధుమేహాన్ని నియంత్రించే గుణాలు జామలో ఉన్నాయి. సాధారణంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు మలబద్దకం సమస్య వేధిస్తుంది. జామకాయలో ఉండే పీచు కారణంగా విరేచనం సాఫీగా జరుగుతుంది. జామలో విటమిన్ ఏ, సీ అధికంగా ఉంటాయి. జీఐ మోస్తరు స్థాయిలో ఉంటుంది గనుక జామపండును రోజుకు ఒక్కటి తినడం ప్రయోజనదాయకం.

నేరేడుపండ్లు (జామూన్)

ఈ పండ్లు మధుమేహాన్ని మంచిగా కంట్రోల్ చేయగలవని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. నేరేడు పండు తిన్న తర్వాత అందులో ఉండే గింజలను పౌడర్ చేసుకుని తీసుకున్నా మంచి ఫలితం.కనిపిస్తుంది. ఎందుకంటే గింజల్లో గ్లూకోసైడ్ ఉంటుంది గనుక. ఈ గ్లూకోసైడ్ ఆహారంలోని పిండి పదార్థాలు గ్లూకోజ్ గా మారకుండా అడ్డుకుంటుంది.

యాపిల్స్

యాపిల్ లో ఉండే జీఐ వేల్యూ 20. కొన్ని రకాల యాపిల్స్ లో ఇంతకంటే తక్కువే ఉంటుంది. కనుక రోజూ యాపిల్ ను నిక్షేపంగా తీసుకోవచ్చు. బ్లూ బెర్రీస్ లేదా ద్రాక్ష పండ్లతో కలిపి యాపిల్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్ ను తగ్గుతుందని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ పేర్కొంది.

ఉసిరి

ఉసిరిలో పుష్కలంగా విటమిన్ సి, ఫైబర్ వుంటాయి. కనుక మధుమేహం ఉన్న వారు ఉసిరితో చేసిన వంటలు తీసుకోవడం మంచిది.

వీటిని తగ్గించేయడం శ్రేయస్కరం

సాల్ట్ ను విడిగా తీసుకోవద్దు. వంటల్లోనూ చాలా తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. ఎందుకంటే కూరగాయల్లో సహజంగానే ఉప్పు లభిస్తుంది. అది మన శరీరానికి సరిపోతుంది.
ఎక్కువైతే ఇది సైలంట్ కిల్లర్. అలాగే, పంచదారను కూడా దాదాపుగా మానేయడమే ఉత్తమం. ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని చాలా వరకు తగ్గించేయాలి. ఆయిల్ మోతాదు మించకుండా చూసుకోవాలి. మాంసాహారులు దాన్ని విడిచి శాకాహారానికి మళ్లడం మంచిది. హోల్ మిల్క్ (ఎక్కువగా ఫ్యాట్ ఉండేవి) తీసుకోవద్దు. టీ, కాఫీ ఏదైనా రెండు కప్పులు మించకుండా చూసుకోండి. గోధుమలను బాగా శుద్ధి చేయగా చివరికి పిప్పిగా మిగిలే మైదా వినియోగాన్ని మానేయాలి. జీఐ ఎక్కువగా ఉండే పాలిష్డ్ రైస్ ను మానేయాలి. బ్రౌన్ రైస్ మంచిది. ఇది అరగడం కష్టంగా ఉంటే ఒక్కసారి పాలిష్ పట్టిన బియ్యాన్ని వాడుకోవచ్చు. ఆలుగడ్డలు, బ్రెడ్స్, అరటి పండ్లు వీటిలో జీఐ ఎక్కువగా ఉంటుంది. వీటికి దూరంగా ఉండాలి.

ఈ వేళల్లో తప్పనిసరిగా....

ఉదయం 5-7 గంటల్లోపు నిద్ర లేచే వారు తప్పకుండా వేకప్ స్నాక్ తీసుకోవాలి. 7 గంటల తర్వాత నిద్ర లేచే వారు 7-9 మధ్య బ్రేక్ ఫాస్ట్ కు వెళ్లాలి. ఉదయం 7 లోపు లేచిన వారు వేకప్ స్నాక్తీసుకున్నా... వారు కూడా 7-9 మధ్య బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 10-11.30 మధ్య స్నాక్ తీసుకోవాలి. మధ్యాహ్నం 12-2.30 మధ్య లంచ్ కు సమయం నిర్ణయించుకోవాలి. మధ్యాహ్నం 3.30 నుంచి 5.30 మధ్య స్నాక్ తీసుకోవాలి. డిన్నర్ సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య సమయం కేటాయించుకోవాలి. ఆహారం నుంచి ఆహరానికీ మధ్య 3 గంటలకు మించకుండా చూసుకోవాలి. డిన్నర్ తర్వాత గంటన్నర నుంచి రెండు గంటల విరామం ఇచ్చి అప్పుడు నిద్రకు వెళ్లడం మంచిది. ఏ ఆహారం తీసుకున్నా గానీ అది 60:20:20 రేషియోలో ఉండాలి. అంటే కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్స్, ప్రొటీన్లు ఈ నిష్పత్తిలో ఉండేలా చూసుకోవాలి.

వేకప్ స్నాక్

రాత్రి నీళ్లలో నాన బెట్టిన మెంతులను ఉదయం వేకప్ స్నాక్ గా తీసుకోవచ్చు. లేదా యాపిల్ పండు. లేదా రాత్రి నీటిలో నానబెట్టిన ఐదారు బాదం గింజలు. వాటికి తోడు మూడు వాల్ నట్స్. లేదా చెంచాడు అవిసె గింజలను వేయించుకుని తినొచ్చు.ఉడకబెట్టిన గుడ్డు లేదా ఆమ్లెట్. టమాటాను జ్యూస్ లా చేసుకుని అందులో కాస్త మిరియాల పొడి వేసుకుని ఖాళీ కడుపుతో లాగించేయవచ్చు.

బ్రేక్ ఫాస్ట్

ఓట్స్ ను ఉప్మాగా చేసుకుని తీసుకోవచ్చు. ఇడ్లీ, మినప దోశ లేదా పెసర దోశ (ఆయిల్ తక్కువతో), కాయగూరలతో చేసిన సేమ్యా ఉప్మా. లేదంటే నానబెట్టిన పెసలు లేదా శనగలు వంటి వాటితో గుగ్గిళ్ల వంటివి చేసుకుని లేదా విడిగానూ తీసుకోవచ్చు. వీటికి కొన్ని బీట్ రూట్, బాదం, టమాటా వంటివి కలుపుకున్నా సరే. పాలకూరతో కలిపి చేసిన చపాతీ లేదా మెంతులతో కలిపి చేసిన చపాతీ తినొచ్చు.

స్నాక్ (11 గంటల సమయంలో)

యాపిల్ తీసుకోవచ్చు. లేదా పైన చెప్పుకున్న పండ్లలో ఏదేనీ ఒకదాన్ని తీసుకోవచ్చు. ఓ గ్లాసుడు బటర్ మిల్క్ తాగితే అందులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థలోకి చేరి ఆ రోజు జీర్ణక్రియ సవ్యంగా సాగేందుకు తోడ్పడుతుంది. కీరదోస, క్యారట్ ముక్కలు తీసుకోవచ్చు. సమోసా లేదా
పకోడి వంటివి. బటర్ మిల్క్ తీసుకోకపోతే గ్లాసు పాలు.

లంచ్

బ్రౌన్ రైస్ లేదా పరిమితంగా వైట్ రైస్, కాయగూరల మిక్స్ (కీరదోస, క్యారట్లు వంటి ముక్కలు), ఓ చపాతీని, పప్పు తీసుకోవచ్చు. అరటి కూర తీసుకోవచ్చు. ఆలూ పరాటాను కూడా భాగం చేసుకోవచ్చు.

సాయంత్రం స్నాక్

టీ లేదా కాఫీ, కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ (డేట్స్, వాల్ నట్స్, అంజీర, జీడిపప్పు తదితర). షుగర్ లేని బిస్కెట్లు రెండు లేదా మూడు. లేదా వేయించిన శనగపప్పు.

డిన్నర్

మల్టీ గ్రెయిన్ ఆటా పిండితో చేసిన రోటీలు, క్యాబేజీ లేదా క్యాలీఫ్లవర్ తో చేసిన కూరను తీసుకోవచ్చు. రాగి పిండితో చేసిన దోశను తీసుకోవచ్చు. డిన్నర్ తర్వాత నిద్రకుముందు ఓ కప్పు వేడి పాలు.



Asthma helth tips article show

ఆస్తమా - ఉబ్బసం ప్రమాదం కాదు

పరిచయము :

దీర్ఘకాలిక శ్వాసకోశ ఇబ్బందినే ఆస్తమా అంటారు. ఆస్తమా వ్యాధిగ్రస్తులలో అలర్జీ రియాక్షన్ ద్వారా ఊపిరితిత్తులలో గాలిమార్గంకు అడ్డంకులు ఏర్పడి శ్వాసపీల్చుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీనివల్ల పిల్లికూతలు, దగ్గు, ఆయాసం, ఛాతీలో నొప్పి తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. శ్వాసకోశమార్గంలో వాపు, శ్వాసకోశ మార్గం కుచించుకపోవడం వల్ల ఆస్తమా ఏర్పడుతుంది.


కారణాలు:

*. చల్లగాలి(చల్లటి వాతావరణం) దుమ్ము, ధూళి

*. పొగ

*.అలర్జీ కారకాలు(గడ్డి చెట్లు, ఫంగస్, కాలుష్యం)

*.రసాయనాలు(ఘాటు వాసనలు)

*.శారీరక శ్రమ

*.వైరల్ ఇన్ఫెక్షన్

*.పెంపుడు జంతువుల విసర్జక పదార్థాలు

*.శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్

నిర్ధారణ:

*. వంశానుగత చరిత్ర, అలర్జీ, ఎగ్జిమాకు సంబంధించిన పరీక్షలు

*. ముక్కు, గొంతు, ఛాతీ పరీక్షలు

*. కఫం పరీక్ష

*. ఎక్స్రే

*. చర్మానికి సంబంధించిన అలర్జీ పరీక్షలు
ఆస్తమాతో జీవించడమెలా?

ఆరోగ్యకరమైన అలవాట్లు, వ్యాయామం, పోషకాహారం తీసుకున్నట్లయితే ఆస్తమా బాధించదు. రాత్రివేళ, ఉదయం సమయాల్లో శ్వాసకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఎక్కువ శారీరక శ్రమలేకుండా చూసుకోవడం అవసరం. దుమ్ము, ధూళి, పొగ, చల్లటి వాతావరణంకు దూరంగా ఉండాలి.

ఇంటి పరిసరాలు, ప్లాస్టిక్బ్యాగ్స్, కార్పెట్స్, బెడీషీట్స్, బ్లాంకెట్స్లలో డస్ట్మెట్స్(చిన్న పరాన్నజీవులు) ఉంటాయి. కాబట్టి పది రోజులకొకసారి ఎండలో వేయడం, శుభ్రంగా ఉతుక్కోవడం చేయాలి. పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి. తేమ ఎక్కువగా ఉంటే డస్ట్మెట్స్ పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ముఖానికి చేతిరుమాలు కట్టుకోవడం చేయాలి.


నివారణ:

బ్రాంకోడైలేటర్స్, కార్టికోస్టిరాయిడ్స్, యాంటీబయోటిక్స్, నాసిల్ స్ప్రే మందులు వాడితే మంచి ఉపశమనం కలుగుతుంది. కానీ వీటివల్ల భవిష్యత్తులో వ్యాధి తీవ్రమయ్యే అవకాశం ఉంది. వీటిని దీర్ఘకాలికంగా వాడటం వల్ల దుష్ప్రభావాలు

*. స్పైరోమెట్రీ(శ్వాసమీటర్ ద్వారా పరీక్ష)
అవకాశం ఉంది. కాబట్టి వీటికి దూరంగా ఉండటమే మంచిది. ఆస్తమాను మెడిటేషన్, యోగా ద్వారా చాలా వరకు నివారించవచ్చు.

పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండటం, స్వచ్ఛమైన గాలి, నీరు ఉన్న ప్రదేశాలలో నివసించడం అలవాటు చేసుకోవాలి. కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉంటే మంచిది.

తీసుకోవలసిన జాగ్రత్తలు :

*. చల్లని గాలి లొ తిరగ కూడదు.

*. వర్షము లొ తడవకూడదు .

*. పడని పదార్దములు తీనకూడదు .

*. మనసుని ప్రశాంతము గా ఉండనివ్వాలి.


ట్రీట్ మెంట్:

1.వెంట్ మాత్రలు రోజుకి 3 చొప్పున్న 5 రొజులు వాడాలి.

2. బెట్నిసాల్ మాత్రలు రోజుకి 3 చొప్పున 5 రోజులు వాడాలి.

3. దగ్గుమందు : బ్రొ జెడెక్ష్ 2 చెంచాలు చొప్పున 3 సార్లు వాడాలి.

4. మంచి డాక్టర్ ని సంప్రదించి. ట్రీట్ మెంట్ తీసుకోవాలి.

5.ఇన్హెలర్స్ వాడడం చాలా మంచిది ఎప్ఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి . సైడు

6. రోటాక్యాప్సు పీల్చడము ఒక మంచి పద్దతి .

Alopecia areata:పేనుకొరుకుడు helthy tips articleshow

పేనుకొరుకుడు వ్యాధిని ఆంగ్లంలో అలోపేసియా అరేటా (Alopecia areata) అంటారు. ఇది ఒక ఆటోఇమ్మ్యూన్ డిసార్డర్. 
అలోపేసియా అరేటా వ్యాధిని నివారించడానికి: 
తల చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.
కఠినమైన రసాయనాలు లేని షాంపూలు, కండిషనర్లను ఉపయోగించాలి.
అధిక వేడి స్టైలింగ్, బిగుతుగా ఉండే హెయిర్ స్టైలింగ్‌ను నివారించాలి.
తల చర్మాన్ని సూర్యరశ్మి నుండి రక్షించుకోవాలి.
అలోపేసియా అరేటా వ్యాధికి చివరికి మందులు లేవు, కానీ జుట్టు తిరిగి పెరగడానికి సహాయపడే కొన్ని చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. 


పేనుకొరుకుడు

పేనుకొరుకుడు అంటే, తలమీద వున్నట్టుండి వెంట్రుకలు కొద్దిపాటి ప్రాంతంలో పూర్తిగా రాలిపోయి చర్మం కనిపిస్తూవుంటుంది. ఇది అలర్జీ కారణంగా జరుగుతుందని వైద్యులు తెలిపారు. అలర్జీ తగ్గగానే వెంట్రుకలు మళ్ళీ వస్తాయి. బట్టతలమాదిరిగా అవుతుందేమోనని అపోహ పడవలసిన అవసరంలేదు. దీనినే పేనుకొరుకుడు అంటారు.

తక్షణ జాగ్రత్తలు తీసుకుంటే పేనుకొరుకుడు నయమౌతుంది!

గుండ్రని నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా పోయి నున్నగా ఉండటాన్ని 'పేనుకొరుకుట' అని పిలుస్తారు. నిజానికి ఇది పేను వచ్చి కొరకడం వలనరాదు. అలా 'నానుడి'గా సాధారణజనానికి అర్ధమయ్యే పరిభాషలో అంటారు. దీన్ని వైద్యశాస్త్రంలో 'అలోపీ షియా ఏరియేటా(Alopecia areata)' అని అంటారు. దీన్ని సుమారు 2000 సంవత్స రాల క్రిందటే గుర్తించారు. చర్మవ్యాధుల ఆసుపత్రులకు హాజరయ్యే రోగులలో ఇది 2శాతం మందికి ఉంటుంది.


కారణం:

ఇది ఒక 'ఆటో ఇమ్యూన్ డిజార్డర్'. అనగా వెంట్రుకలకు వ్యతిరేకంగా తనలోనే ' ఆంటీబాడీలు' తయారై వెంట్రుకలను అలా అక్కడక్కడా లేకుండా చేస్తుంది. మానసిక ఆందోళన, థైరాయిడ్, డయాబెటిస్, బి.పి. మొదలగు సమస్యలున్న వాళ్ళలో అధికంగా కన్పిస్తుంది. ఈ జబ్బు ఉన్న వాళ్ళకు 20శాతం మందికి గోళ్ళ మీద గీతలు, గుంటలు కలిగి వుండటం గమనార్హం.

ఎక్కడెక్కడ వస్తుంది :

వెంట్రుకలు మొలచు ఏ భాగంలోనైనా ఇది రావచ్చు. తలలో ఎక్కువగా కన్పిస్తుంది. గడ్డంమీద, మీసాల దగ్గర వస్తుంది. కనుబొమ్మల మీద కూడా రావచ్చు. కాళ్ళు, చేతులు, ఛాతీమీద కూడా వెంట్రుకలు లేని గుండ్రని ప్రదేశాలు కన్పిస్తాయి. కానీ, ముఖ్యంగా తలమీద, గడ్డం, మీసాలు, కనుబొమ్మలు- మీద వస్తే చాలా ఆందోళనకు గురై - వెంటనే డాక్టర్ను సంప్రదిస్తారు. ఇది సౌందర్యలోపానికి చిహ్నం కూడా. ఇది మరే ఇతర ఇబ్బంది కలిగించదు కూడా! కొందరిలో తలమీద ఒకచోట మొదలై - మొత్తం తలంతా కూడా వెంట్రుకలు రాలిపోతాయి. తల గుండు జేయించినట్లు ఉంటుంది. దీన్ని' అలోపీషియా' టోటాలిస్ (Alopecia Totalis)' అని అంటారు. అలాగే, జబ్బు శరీరం అంతా ప్రాకి-
తలమీద, కనుబొమ్మలు, గడ్డం, మీసాలు, చేతులు, కాళ్ళు, ఛాతి మీద- మరెక్కడా వెంట్రుకలు లేకుండా చేస్తుంది. దీన్ని అంటారు. 1 అలోపీషియా (Alopecia Universalis)' ໙໖

ఎవరిలో వస్తుంది :

ఇది ఆడా,మగా తేడా లేకుండా ఎవరిలోనైనా వస్తుంది. పిల్లల్లో కూడా వస్తుంది. కానీ, 20-40 సంవత్సరాల మధ్య వయసు వారిలో ఎక్కువగా కన్పిస్తుంది. కుటుంబ సభ్యులలో ఒకరికి ఉంటే, మరొకరికి వచ్చే అవకాశం ఎక్కువ. కవలల్లో ఒకరికి ఉంటే మరొకరికి వస్తుంది. కానీ, ఇది అంటువ్యాధి కాదు. 60 సం. దాటిన తర్వాత సాధారణంగా రాదు.

చికిత్స:

*. దీనికి రకరకాలైన చికిత్సా విధానాలు కలవు.

*.స్టిరాయిడ్ పూతమందులు.,

*. అక్కడే కొంచెం మంట పుట్టించే పూతమందులు.,

*. ఇమ్యునోమాడ్యులేటర్ పూతమందులు

*.అక్కడే స్టిరాయిడ్ ఇంజక్షన్ ఇచ్చే విధానం.,

*. లేజర్ చికిత్స.
జబ్బు తీవ్రత ఎక్కువగా ఉండి వేరే చోట్లకు ప్రాకుతుంటే స్టిరాయిడ్ మందు బిళ్ళలు లేదా సైక్లోస్పోరిన్ ఇమ్యునోసప్రసివ్ (Immuno మందు బిళ్ళలు వాడుతారు. మొదలగు suppresive)

ఏ చికిత్సా విధానమైనా చాలా ఓర్పుతో దీర్ఘ కాలంగా వాడాలి. చికిత్స పూర్తికాలం డాక్టరు పర్యవేక్షణలో సాగాలి. తన ఇష్టానుసారం మందులువాడటంవల్ల ස) తగ్గకపోగా సైడ్ఫైక్ట్స్్స్కు గురౌతారు. మందులతో పూర్తి ఫలితం పొందకపోతే, కొన్ని కొన్ని చిన్న చిన్న నిర్ణీత ప్రదేశాలలో టాటూయింగ్ పద్ధతి ద్వారా లోపాన్ని కప్పివేయవచ్చు.

చికిత్స ఫలితాలు :

ప్రతి డాక్టరు రోగికి పూర్తి న్యాయం చేయాలనే సంకల్పంతోనే మంచి ట్రీట్మెంట్ రోగిని అనుసరించి ప్రారంభిస్తారు. అయినప్పటికి అందరి రోగులకు ఫలితాలు ఒకేరకంగా ఉండవు. కొందరికేమో అతి కొద్దికాలంలోనే అనూహ్య మార్పు వచ్చి ఆనందాన్నిస్తుంది. మరికొందరికి దీర్ఘకాలం తర్వాత మార్పు వస్తుంది. మరికొద్దిశాతం మందిలో ఎన్నిరోజులు వాడినా ఫలితం కన్పించదు. వంశపారంపర్యంగా ఉన్నా....కనుబొమ్మలు,
కనురెప్పలు, తల, గడ్డం, మీసాలు అన్నిచోట్ల వెంట్రుకలు రాలిపోవడం, చిన్నరోగం మాదిరిగానే మొదలై ప్రాకుతుంటే -మొదలగు సందర్భాలలో ఆశించినంత ఫలితాలు అందవు. కానీ, ఏది ఏమైనా 'పాజిటివ్ మైండ్'తో ఉండి ఫలితాలు సాధించుకునేందుకు ప్రయత్నం చేయాలి!!

ఆయుర్వేద చికిత్స :

బెట్నిసాల్ వంటి స్టిరాయిడ్స్తో తయారయిన చుక్కల మందుని పేనుకొరుకుడు పైన రాయమని వైద్యులు సూచిస్తుంటారు. ఒక్కొక్కసారి వీటికి ఫలితం రాకపోతే గురివింద గింజని బాగా అరగదీసి గంధం తీసి పేనుకొరికిన చోట రాయండి. ఇలా నాలుగైదురోజులు రాస్తే వెంట్రుకలు మళ్ళీ తిరిగి వస్తాయి. మందారంపూలనుకూడా దీనినివారణకు మందుగా వాడుతారు, కాని గురివిందతోనే చాలా త్వరగా నయమౌతుందని వైద్యులు తెలిపారు.

ఎర్ర మందారం పూలను రెండు గ్లాసుల నీళ్ళలో వేసి ఉడికించి ఒక గ్లాసు నీరు వచ్చేవరకు మరిగించి, వడకట్టి, కషాయం తీసి సీసాలోకి తీసుకుని, రోజూ తలకి పెట్టుకొని రెండు గంటల తర్వాత తల స్నానం చేస్తే పేనుకొరుకుడు తగ్గుతుంది.

Weight loss Tips Helth Tips Article show

బరువు తగ్గడానికి, మీరు తక్కువ కేలరీలు తినడం, మరింత చురుకుగా ఉండటం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంపికలు చేసుకోవడం ప్రయత్నించవచ్చు .   
తినడం   
ఎక్కువ పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలు తినండి.
బ్రౌన్ రైస్, బార్లీ, మరియు హోల్-వీట్ బ్రెడ్ మరియు పాస్తా వంటి తృణధాన్యాలను ఎంచుకోండి.
తెల్ల బియ్యం మరియు తెల్ల రొట్టె వంటి శుద్ధి చేసిన ధాన్యాలను తక్కువగా తినండి.
డెజర్ట్‌లు, జెల్లీలు మరియు సోడాలు వంటి చక్కెర కలిపిన ఆహారాలు మరియు పానీయాలను పరిమితం చేయండి.
ఆలివ్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్స్, అవకాడోస్, నట్స్, నట్ బటర్స్, మరియు నట్ ఆయిల్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను వాడండి.
తక్కువ కొవ్వు లేదా కొవ్వు రహిత పాల ఉత్పత్తులను ఎంచుకోండి.
ఆహార లేబుళ్ళను చదవండి.
చురుకుగా ఉండటం   
వారానికి 150 నిమిషాల శారీరక శ్రమ చేయండి.
మీరు ఆనందించే కార్యకలాపాలను కనుగొని వాటిని రోజంతా విస్తరించండి.
విసుగు చెందకుండా ఉండటానికి మీ కార్యాచరణను మార్చుకోండి.
నడవడానికి సౌకర్యవంతమైన బూట్లు ధరించండి.
జీవనశైలి తగినంత నిద్ర పొందండి, ఒత్తిడిని నిర్వహించండి, మీ బరువు తగ్గించే ప్రణాళికను మీరు విశ్వసించే వారితో పంచుకోండి మరియు వారానికి 1 నుండి 2 పౌండ్ల బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకోండి.   
ఇతర చిట్కాలు
మీ భోజనాన్ని అధిక ఫైబర్ స్టార్చ్ కార్బోహైడ్రేట్లపై ఆధారపడి ఉంచండి.   
రుచిని త్యాగం చేయకుండా భోజనంలోని క్యాలరీలను తగ్గించుకోవడానికి రుచికరమైన పదార్థాలను ఎంచుకోండి.   
చక్కెర శీతల పానీయాలు, పండ్ల రసాలు, ఎనర్జీ డ్రింక్స్ మరియు ఫ్లేవర్డ్ మిల్క్ వంటి పానీయాల నుండి ద్రవ కేలరీలను పరిమితం చేయండి.

బరువు తగ్గటానికి సూచనలు

పక్క వీధిలోని పాలబూత్కి వెళ్లాలంటే బండి స్టార్ట్ చేయాల్సిందే... కిలోమీటర్ దూరం వెళ్లి కూరగాయలు కొనుక్కు రావాలంటే బండి కావాల్సిందే... బట్టలుతకడానికి వాషింగ్ మెషీన్... అంట్లు కడగడానికి ఓ పనిమనిషి... పచ్చళ్లు దంచిపెట్టడానికి మిక్సీ.... ఇదీ మారిన మన లైఫ్స్టైల్. చివరకు మనకు మిగిలిందేమిటి.... వెయిట్ లాస్ ట్రీట్మెంట్లకై వెదుకులాట.

పది కిలోమీటర్లు నడిచివెళ్లి చిన్న చిన్న వస్తువులు కొనితెచ్చుకోవడం.., చదువుకోవడానికి నాలుగైదు కిలోమీటర్లు సైకిల్పై వెళ్లడం.... చేతులరిగిపోయేలా తిరగలి తిప్పడం..... ఇలాంటి కష్టాలన్నీ పోయాయి. చేతిలో డబ్బుంటే చాలు... అన్నీ మన ముందుకే వస్తాయి. అయితే ఆధునిక సౌకర్యాలతో పాటు ఎక్కడబడితే అక్కడ బరువుతగ్గించే సెంటర్లు కూడా పెరిగిపోయాయి. 5... ఊబకాయులు పెరిగిపోతుండటమే. దీనికి ఆడామగా, చిన్నా పెద్దా తేడా లేదు. బరువు పెరగడానికి వయసుతో పనిలేదు.


వెయిట్ తగ్గించే అద్భుతాలు స్లిమ్మింగ్ క్యాప్సుల్స్, ఆయిల్స్, క్రీములు, పౌడర్లు, టీలు (డాక్టర్ టీ), డైట్ సప్లిమెంట్లు... ఇలా చెప్పుకొంటూ పోతే బరువు తగ్గించేవని చెప్పేవి మార్కెట్లో సవాలక్ష ఉన్నాయి. కొన్ని ఫిట్నెస్ సెంటర్లయితే వెయిట్ లాస్ ట్రీట్మెంట్ల పేరుతో మనీ బ్యాక్ పాలసీ లాంటి రకరకాల ఆఫర్లతో ఆకర్షిస్తున్నాయి. అల్ట్రాసౌండ్ చికిత్సలు, మసాజ్లు, రేడియేషన్ల వంటి వాటితో కొవ్వు కరిగిస్తామంటున్నాయి. కొన్ని జేబుకు చిల్లు పడటమే తప్ప వీటివల్ల ఎటువంటి ఉపయోగం లేదంటున్నారు బాధితులు.'స్లిమ్మింగ్ మెషీన్ సహాయంతో మీ శరీరంలో ఎక్కడ కొవ్వు పేరుకుపోయినా తగ్గించేస్తామన్న మాటలు నమ్మి లక్షన్నర రూపాయలు చెల్లించాను.

స్లిమ్మింగ్ పరికరం ఉత్పత్తి చేసే వేడి కొవ్వును కరిగిస్తుందని నమ్మబలికారు. కానీ ఒక ఇంచు కూడా బరువు తగ్గలేదని వాపోయారు హైదరాబాద్కు చెందిన ఓ యాంకర్. మొత్తం బాడీ మసాజ్ చేయడం వల్ల కొవ్వు కరిగిపోతుందని వెళ్లిన కాల్సెంటర్ ఉద్యోగిని అయిన ప్రమీల వాళ్లు చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయింది. రోజూ అరగంట సేపు వాకింగ్, తరువాత మరో అరగంట ఎక్సర్సైజ్ చేయడం వారానికి మూడుసార్లు తమ సెంటర్లో ఓ గంటసేపు మసాజ్...
నెలరోజుల్లో అయిదు కిలోల బరువు తగ్గుతారని చెప్పడంతో ఇక తను తీసుకునే ఆహారం, వ్యాయామంపై దృష్టి పెట్టింది ప్రమీల. ఇలాంటి అనుభవాలు ఎన్ని ఎదురైనా అలా బయటకు వెళితే చాలు.. ఏ బేకరీకో, ఫాస్ట్ఫుడ్ సెంటర్క వెళ్లడం రుచిగా ఉన్నదల్లా లాగించెయ్యడం... తరువాత బరువు పెరిగిపోతున్నామని బాధపడటం... ఇటీవలి కాలంలో ఈ తరహా ధోరణి ఎక్కువయింది. ఎక్కువ కష్టపడకుండా వెంటనే బరువు తగ్గిపోవాలన్న కోరికతో స్లిమ్బల్టులు, స్లిమ్ మెషీన్లు కొని తెచ్చిపెట్టుకోవడం, స్లిమ్ క్యాప్సుల్స్, యాంటి ఒబేసిటీ మందుల్లాంటివి వాడటం వల్ల అనుకున్న ఫలితం పొందడం మాట అటుంచి ఇతరత్రా సైడ్ ఎఫెక్టులు కలిగే అవకాశం ఉంది.



అసలైన మంత్రం

అందుకే బరువు తగ్గడానికి రాచబాట లాంటి వ్యాయామాన్ని వదిలేసి యంత్రాలపై ఆధారపడటం సరికాదు. వ్యాయామం చేసేందుకు సమయం సరిపోవట్లేదంటారు చాలామంది. కానీ ఆరోగ్యాన్ని మించిన ముఖ్యమైన పని మరొకటి లేదు. ఎంత అర్జెంట్ పనులున్నా వ్యాయామం కోసం కనీసం ఓ అరగంట సమయాన్ని కేటాయించాలి. మన రోజువారీ పనుల్లో కూడా కాస్త బద్దకాన్ని వదిలితేబరువు తగ్గించుకోవడం మన చేతుల్లో పనే. ఫస్టాఫ్లోర్కి వెళ్లడానిక్కూడా లిఫ్ట్ వాడేబదులు నాలుగు అంతస్థులున్నా మెట్లు ఎక్కండి. పక్కనున్న షాప్కి నడిచే వెళ్లండి. మీ బాబును స్కూల్లో దింపడానికి బండి తీయకండి.

సాధ్యమైనంతవరకూ కాళ్లకు పనిచెప్పండి.'హాస్పిటల్లో ఏ ఫ్లోర్కి, ఎన్నిసార్లు వెళ్లాల్సి వచ్చినా లిఫ్ట్ అసలే వాడను. బరువు పెరగకుండా, ఆరోగ్యంగా ఉండటంలో నా రహస్యం అదే'అంటారు హైదరాబాద్ లోని ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ సోమరాజు. అండుకే మీరూ బద్దకాన్ని వదిలి కొవ్వును కరిగించే వ్యాయామంపై దృష్టిపెట్టమంటున్నారు ఫిట్నెస్ నిపుణులు. ఎన్ని వెయిట్ లాస్ ట్రీట్మెంట్లు తీసుకున్నా ఆహారంలో జాగ్రత్తలు, వ్యాయామం లేకపోతే మాత్రం ఎక్కడి కొవ్వు అక్కడే ఉంటుంది. అందుకే ఒకరిని చూసి ఒకరు వెయిట్ లాస్ సెంటర్ల వైపు పరుగులెత్తకుండా మంచి తిండి తినండి, బాడీకి పని పెట్టండి, ఆరోగ్యంగా ఉండండని సూచిస్తున్నారు.

sweat heavy: helthy tips. Articleshow

చెమట అధికంగా వస్తుందంటే..

ఎండకాలం అనగానే చెమట సమస్య ఏర్పడుతుంది. కొంతమంది ఈ సమస్య నుండి బయట పడాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరికీ చెమటతో పాటు శరీరం మొత్తం దుర్వాసన కూడా వస్తుంటుంది. మరి ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి ? కొన్ని చిట్కాలు..


ద్రాక్ష పండ్లు తినాలి. నిత్యం తగినంత మోతాదులో కొన్ని ద్రాక్ష పండ్లను తిన్నా అధిక చెమట సమస్య తగ్గిపోతుంది.

రెండు టీ స్పూన్ల వెనిగర్, ఒక టీ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ లను బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు మూడు సార్లు భోజనానికి ఒక గంట ముందు తాగాలి.

టీ ట్రీ ఆయిల్ ను కొద్దిగా తీసుకుని చెమట వచ్చే ప్రదేశాల్లో రాయాలి.


ఒక టేబుల్ స్పూన్ ఉప్పు.. నిమ్మ రసాలను బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీర భాగాలపై రాసుకుంటే చెమట సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది.