కావలసినవి:
మామిడికాయలు 12, కారం 12 కేజి, మొత్తటి ఉప్పు 1/2 కేజి, నూనె 3/4 కేజీ, నువ్వుపిండి 1/2 కేజి.
తయారుచేయు విధానం:
1. నువ్వు పప్పు తడిపి, గోనెపట్టా మీద వ్రాస్తే, పొట్టు పోయి తెల్లగా వస్తాయి. మూకుడులో కమ్మటి వాసన వచ్చేంతవరకు వేయించి, మెత్తగా పొడుం కొట్టి అరకిలో తీసుకోవాలి.
2. మామిడికాయ చెక్కుతోనే సన్నగా ముక్కలు తరిగి, కారం, నువ్వుపిండి, ఉప్పు, నూనె వేసి కలిపి తడిపొడిగా చేయాలి.
3. ముక్కలు పిండి జాడీలో పెట్టి, పైనకాచి చల్లార్చిన నూనెపోసి, కలియబెట్టి మూత పెట్టాలి.
4. నువ్వుపిండి ఉపయోగించటం వలన ఆవకాయ కమ్మటి వాసనవస్తూ వుంటుంది.