Showing posts with label news. Show all posts
Showing posts with label news. Show all posts

2.28.2025

Tamil Nadu: తమిళనాడులో అమానుష ఘటన..3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన 16 ఏళ్ల బాలుడు

 Tamil Nadu: తమిళనాడులో అమానుష ఘటన..3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన 16 ఏళ్ల బాలుడు



Tamil Nadu. 3years children 16years boy rapedతమిళనాడు రాష్ట్రంలోని మైలాపూర్ జిల్లా, సిర్కాళి పట్టణంలో జరిగిన దారుణ ఘటనలో 16 ఏళ్ల ఒక బాలుడు, 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి ప్రయత్నించాడు.

ఆ చిన్నారి అతన్ని ఆపడానికి ప్రయత్నించినప్పుడు కోపంతో ఆ చిన్నారిపై విచక్షణారహితంగా దాడి చేశాడు.

ఈ ఘటన అప్పుడే అంగన్‌వాడీ నుండి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో జరిగింది. నిందితుడు ఆమెను చాక్లెట్ ఇచ్చి ఆకర్షించి, ఓ ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. చిన్నారి సహాయం కోసం కేకలు వేయగా, కోపంతో బాలుడు రాయితో ఆమె ముఖాన్ని కొట్టి తీవ్ర గాయాలు కలిగించాడు. ఈ దాడిలో చిన్నారి స్పృహ కోల్పోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.

తల్లిదండ్రులు తన కుమార్తె కనిపించకపోవడంతో వెతికి, అపస్మారకంగా పడిపోయి ఉండటాన్ని గమనించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఐసీయూలో చికిత్స పొందుతోంది. బాధితురాలి కుటుంబ ఫిర్యాదు మేరకు, ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్ పోలీసులు 16 ఏళ్ల బాలుణ్ని అరెస్ట్ చేశారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

2.27.2025

maharastra pune raped woman in bus: Pune Horror: దారుణం, రోడ్డు మీద వెళుతున్న మహిళను బస్సుల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేసిన కామాంధుడు, అరుస్తుందని నోట్లో గుడ్డలు కుక్కి మరీ పైశాచికం

 Pune Horror: దారుణం, రోడ్డు మీద వెళుతున్న మహిళను బస్సుల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేసిన కామాంధుడు, అరుస్తుందని నోట్లో గుడ్డలు కుక్కి మరీ పైశాచికం


మహారాష్ట్రలో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటనలో, పూణేలో 26 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగింది. వార్తా సంస్థ IANS ప్రకారం, స్వర్గేట్ బస్ స్టాండ్ వద్ద ఆపి ఉంచిన బస్సులో మహిళపై అత్యాచారం జరిగింది.

నిందితుడుని దత్తా గడేగా గుర్తించబడ్డాడు, అతను మహిళపై అత్యాచారం చేసిన తర్వాత అక్కడి నుండి పారిపోయాడు. పోలీసులు సిసిటివి ద్వారా అతన్ని గుర్తించి, అతని కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. నిందితుడు అటుగు వెళ్తున్న మహిళను బస్సులోకి లాక్కెళ్లి మరీ అత్యాచారం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె అరవకుండా నోరు కప్పెట్టి దారుణానికి పాల్పడ్డాడు.

2.26.2025

2012వ సంవత్సరం గురించి మీకు గుర్తుందా. అంతకు ముందే ఆ ఏడాదిలో యుగాంతం వస్తుందని భయపెట్టారు. ఎందుకంటే మయన్ల క్యాలెండర్ 2012 వరకే ఉందని, కనుక ప్రపంచం కూడా ఆ ఏడాదిలో అంతం అవుతుందని అంతకు ముందు నుంచే చెబుతూ వచ్చారు.

 2012వ సంవత్సరం గురించి మీకు గుర్తుందా. అంతకు ముందే ఆ ఏడాదిలో యుగాంతం వస్తుందని భయపెట్టారు. ఎందుకంటే మయన్ల క్యాలెండర్ 2012 వరకే ఉందని, కనుక ప్రపంచం కూడా ఆ ఏడాదిలో అంతం అవుతుందని అంతకు ముందు నుంచే చెబుతూ వచ్చారు.

కానీఆ ఏడాది దాటి కూడా చాలా ఏళ్లపోయింది. అయినప్పటికీ ప్రపంచం అంతం కాలేదు. అయితే కరోనా వచ్చినప్పటినుంచి ఇలాంటి పుకార్లు మళ్లీ ఎక్కువైపోయాయి. ప్రపంచం కొద్ది రోజుల్లో అంతం అవుతుందని అడపా దడపా చాలా మంది చెబుతున్నారు. కానీ అవేవీ నిజం కావడం లేదు. ఇక తాజాగా ఓ వ్యక్తి తాను టైమ్ ట్రావెల్ చేశానని, కాలంలో ప్రయాణించి వచ్చానని, 2025లో పలు ప్రకృతి విపత్తులు సంభవించి ప్రపంచం అంతమై పోతుందని చెబుతున్నాడు. ఇంతకీ అతను ఎవరు, ఏం చెబుతున్నాడు.. అంటే..



అమెరికాకు చెందిన ఎల్విస్ థాంప్సన్ అనే వ్యక్తి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అందులో అతను మాట్లాడుతూ.. తాను కాలంలో ప్రయాణం చేసి వచ్చానని అన్నాడు. 2025లో పలు ఉత్పాతాలు ఏర్పడబోతున్నాయని హెచ్చరించాడు. 24 కిలోమీటర్ల వ్యాసం కలిగిన భారీ టోర్నడో ఒకటి గంటకు 1046 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఏప్రిల్ 6వ తేదీన అమెరికాలోని ఓక్లహామాను చుట్టు ముట్టి అందరినీ సర్వనాశనం చేస్తుందని చెప్పడు. అలాగే మే 27వ తేదీన అమెరికా సివిల్ వార్ మొదలవుతుందని, దీంతో ప్రపంచ వ్యాప్తంగా అమెరికాతో సహా అందరూ అణ్వాయుధాలను ఉపయోగిస్తారని, మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని చెప్పాడు.

సెప్టెంబర్ 1వ తేదీన చాంపియన్ అనే పేరున్న ఒక ఏలియన్ వచ్చి 12వేల మంది మనుషులను సురక్షితంగా ఇంకో గ్రహానికి తీసుకెళ్తుందని చెప్పాడు. సెప్టెంబర్ 19వ తేదీన అమెరికా తీర ప్రాంతంలో భారీ తుఫాను వచ్చి అంతా కొట్టుకుపోతుందని, నవంబర్ 3న నీలి తిమింగలం కన్నా 6 రెట్లు పెద్దదిగా ఉండే ఒక జీవి పసిఫిక్ మహా సముద్రం నుంచి పుట్టుకు వస్తుందని, దాని పేరు సెరీన్ క్రౌన్ అని చెప్పాడు. దీంతో భూమి అంతం అవుతుందని అన్నాడు. అయితే ఎల్విస్ చెబుతున్న మాటలను చాలా మంది కొట్టి పారేస్తున్నారు. అతని వీడియోను సేవ్ చేసుకున్నామని, అతను చెప్పినవి జరగకపోతే లీగల్‌గా అతనిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇక కొందరు అతను చెప్పినవన్నీ నిజమే అయి ఉండవచ్చని అంటున్నారు.


 మరి మీరు దీనిపై మీ కామెంట్ ఏంటో తెలియచేయగలరు. 

telangana crime news mother women child killing ఓ తల్లి అమ్మతనానికే అవమానం కలిగించేలా ప్రవర్తించింది. తొమ్మిది నెలలు మోసి కని పెంచుతున్న తల్లే తన బిడ్డల పాలిట మ్యత్యువైంది.

ఓ తల్లి అమ్మతనానికే అవమానం కలిగించేలా ప్రవర్తించింది. తొమ్మిది నెలలు మోసి కని పెంచుతున్న తల్లే తన బిడ్డల పాలిట మ్యత్యువైంది.

helthtipscaress


ప్రియుడి మోజులో పడి ఇటీవలే కట్టుకున్న వాడిన కడతేర్చిన ఆ రాక్షసి.. చివరికి తన సుఖానికి అడ్డొస్తున్నారనే నెపంతో పిల్లలను కూడా అత్యంత దారుణంగా చంపేసింది. పట్టుమని పదేళ్లు కూడా నిండని ఆ పిసిపిల్లలకు విషమిచ్చి హతమార్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఉలిక్కిపడే ఈ ఘటన మహాబూబాబాద్ డోర్నకల్ మండలంలోని జోగ్య తండ గ్రామ పంచాయతీలో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి.

పోలీస్ తో అక్రమ సంబంధం..

మంగళ్ తండాకు చెందిన వాంకుడోత్ వెంకటేష్(30), ఉషాలకు ఎనిమిదేళ్ల కిందట పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు నిత్యశ్రీ (05), అబ్బాయి వరుణ్ తేజ (07) ఉన్నారు. అయితే 4 నెలల కిందట వెంకటేష్ అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో అత్తింట్లోనే ఉంటున్న ఉషా.. కొంతకాలంగా ఓ పోలీస్ అధికారితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు అనుమానాలున్నాయి. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 5న ఇంటి వద్ద ఆడుకుంటున్న పిల్లలు ఉన్నట్టుండి సృహతప్పి పడిపోయారు. వాంతులతోపాటు విరోచనాలు కావడంతో వెంకటేష్ తల్లి కంగారుపడిపోయింది. ఏం జరిగిందని ప్రశ్నించగా అమ్మ ఉషా కూల్డ్రింక్ తాగించిందని చెప్పారు. వెంటనే బాబాయ్ రాంబాబు సహాయంతో పిల్లలను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. రోజుల చికిత్స అనంతరం పిల్లల శరీరంలో గడ్డిమందు అవశేషాలు ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.


Sexual assault: ముగ్గురు బాలికలపై 18మంది మైనర్ బాలురు లైంగిక దాడి!


ఎలుకల మందు తాగి...

పిల్లల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. దీంతో ఉషాను బంధువులంతా నిలదీయగా కూల్డ్రింక్లో గడ్డిమందు కలిపి తాగించినట్లు అంగీకరించింది. ఆ భయంతోనే ఉషా కూడా ఎలుకల మందు తాగింది. ఆమెను గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. అయితే రెండు వారాల తర్వాత వరుణ్తేజ్ కోలుకోగా నిత్యశ్రీ చనిపోయింది. నిత్యశ్రీ పోస్టుమార్టం తర్వాత డోర్నకల్ సీఐ బీ రాజేశ్ కుటుంబ సభ్యులకు డెబ్ బాడీనీ అప్పగించే క్రమంలో బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఉషా కావాలంటూ ఆంబులెన్స్ ముందు ధర్నా చేశారు. ఇక వెంకటేష్ తమ్ముడు రాంబాబు వదినపై ఫిర్యాదు చేయడంతో 10న హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఉషా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఉషాకు ఓ పోలీస్ అధికారితో అక్రమ సంబంధం ఉందని, అందుకే ఈ ఘోరానికి పాల్పడిందని బంధువులు ఆరోపించారు. దీంతో దీనిపై కూడా దర్యప్తు చేసి నిందితులను పట్టుకుంటామని సీఐ రాజేశ్ హామీ ఇచ్చారు.

Jharkhand shocker gang rape minor girl 12to16 age 18 members raniya area: Jharkhand shocker: జార్ఖండ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి నుంచి తిరిగి వస్తున్న ఐదుగురు గిరిజన బాలికపై 18 మంది మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

 Jharkhand shocker: జార్ఖండ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి నుంచి తిరిగి వస్తున్న ఐదుగురు గిరిజన బాలికపై 18 మంది మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

helthtipscaress


ఈ ఘటన రానియా ప్రాంతంలో జరిగింది. ఒక వివాహం నుంచి బాలికలు ఇంటికి తిరిగి వస్తుండగా ఈ దారుణం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 18 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 


16 ఏళ్లకు పైబడిన బాలురను పెద్దలుగా పరిగణించి విచారిస్తామని పోలీసులు తెలిపారు. ''18 మందిని అరెస్ట్ చేశాం. అందరూ మైనర్లే. ఈ కేసులో అన్ని బాధిత బాలికలకు ప్రభుత్వం తరుఫున అన్ని సౌకర్యాలు కల్పిస్తాము'' అని జార్ఖండ్ డీజీపీ అనురాగ్ గుప్తా చెప్పారు. మన సమాజంలో అబ్బాయిలు ఇలాంటి నీచమైన పనులు చేయకుండా ఉండేందుకు, 16 ఏళ్లకు పైబడిన వారిని పెద్దలుగా పరిగణిస్తామని చెప్పారు. ఈ కేసులో 12-17 వయసు గల నిందితులను జువైనల్ హోమ్‌కి పంపించారు. 


సోమవారం, సామూహిక అత్యాచారానికి గురైన బాలికలకు వైద్య పరీక్షలు జరిపించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఐదుగురు బాలికలపై బాలురు అత్యాచారం చేశారని, బాలికల్లో ముగ్గురు 12-16 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారని, ఆ అమ్మాయిలు రానియాలోని ఒక వివాహ వేడుకకు హాజరై ఇంటికి తిరిగి వస్తున్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. దీనిపై కుటుంబీకులు రానియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత ఆదివారం వెలుగులోకి వచ్చిందని ఖుంటీ ఎస్పీ అమన్ కుమార్ తెలిపారు. నిందితులపై పోక్సో, అత్యాచార చట్టాల కింద కేసులు నమోదు చేశారు.

ఓ డాక్టర్ పవిత్రమైన వృత్తిలో ఉన్న అన్న విషయం మరిచి పోయి అత్యంత దారుణంగా299 మంది రోగులపై అత్యాచారానికి పాల్పడ్డాడో నికృష్టుడు. doctor on duty crime gang raped peshents

వైద్యో నారాయణో హరి అన్నారు. కనిపించే దేవుడు వైద్యుడు అన్నారు. కానీ ఇక్కడ మాత్రం ఓ డాక్టర్ పవిత్రమైన వృత్తిలో ఉన్న అన్న విషయం మరిచి పోయి అత్యంత దారుణంగా రోగుల పై ఆకృత్యాలకు ఒడిగట్టాడు. 

crime news 


అలా మూడు దశాబ్దాల పాటు తన సర్వీసులో ఏకంగా 299 మంది రోగులపై అత్యాచారానికి పాల్పడ్డాడో నికృష్టుడు.

వీరిలో ఎక్కువ మంది చిన్నారులే కావడం మరింత విచారకరం. ఈ దారుణ విషయం ఫ్రాన్స్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ కేసులో నిందితుడైన 74 సంవత్సరాల జోయెల్ లి స్కౌర్నెక్ పై ప్రస్తుతం విచారణ జరుగుతుంది.

ఫ్రాన్స్ లోని బ్రిటానీ అనే ప్రాంతంలో నిందితుడు జోయెల్ ఓ ఆసుపత్రిలో సర్జన్ గా పని చేసేవాడు. 30 సంవత్సరాల తన వద్దకు వచ్చే రోగుల పై అతడు ఈ దారుణాలకు పాల్పడినట్లు తెలుస్తుంది. వారు మత్తులో ఉండగా లైంగిక దాడి చేసేవాడు. అయితే అతడి ఆకృత్యాలు బయపడింది మాత్రం 2017 లో తన పొరుగింట్లో ఉన్న ఓ ఆరేళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించడంతో జోయెల్ పై కేసు నమోదైంది.


650 లకు పైగా..

ఈ కేసు దర్యాప్తు నిమిత్తం పోలీసులు అతడి ఇంట్లో సోదాలు చేపట్టగా ఏకంగా 3 లక్షలకు పైగా ఆశ్లీల ఫొటోలు బయటపడ్డాయి. 650 లకు పైగా అశ్లీల వీడియోలను గుర్తించారు. నిందితుడి మానసిక ప్రవర్తన చూసి పోలీసులు నిర్ఘాంతపోయారు.

చిన్నారులు,జంతువులకు ఎక్కువగా ఆకర్షితుడై శంగార కార్యకలాపాలు నెరుపుతున్నట్లు అతడి డైరీల్లో చూసి అధికారులు షాకయ్యారు.ఎవరెవరి పై లైంగిక దాడి జరిపిన విషయాలను ఎప్పటికప్పుడు నోట్ చేసుకున్నట్లు గుర్తించారు.ఈఘటన తరువాత మరో నలుగురు చిన్నారులు కూడా అతడి బాధితులని తేలడంతో 2020 లో కోర్టు జోయెల్ ను దోషిగా తేల్చి 15 ఏళ్ల జైలు శిక్ష ను ఖరారు చేసింది..


ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయగా..అతడిపాపాల చిట్టా బయటపడింది.అయితే బాధితుల్లో చాలా మందికి తాము అత్యాచారానికి గురైన విషయం కూడా తెలియకపోవడం గమనార్హం.జోయెల్ డైరీలో తమ పేర్లను చూసే తాము ఈ విషయం తెలుసుకున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నాలుగు నెలలుగా ఈ కేసులో విచారణను ముమ్మురం చేయగా...తాజాగాఅతడు కోర్టులో నేరాన్ని అంగీకరించాడు. 1989 నుంచి2014 మధ్య 158 మంది అబ్బాయిలు, 141 మంది అమ్మాయిల పై అతడు అత్యాచారానికి పాల్పడినట్లు న్యాయస్థానంలో తెలిపాడు.

వీరిలో అత్యధికులు చిన్నారులేనని పేర్కొన్నాడు.నేను చాలా క్రూరమైన పనులు చేశా. ఆ పిల్లల మనసుకు అయిన ఈ దారుణ గాయం ఎన్నటికీ మానదని తెలిసినా అలానే ప్రవర్తించాను. నా చర్యలకు పూర్తి బాధ్యత వహిస్తున్నా అని జోయెల్ తెలిపాడు.ప్రస్తుతం దీని పై విచారణ కొనసాగుతోంది. ఒకవేళ అతడిని దోషిగా తేలిస్తే మరో 20ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.