కావలసినవి:
ఉసిరి కాయలు 1 శేరు, ఆవపిండి 1 పాలడబ్బా, కారం 1 పాలడబ్బా, ఉప్పు 1 పాలడబ్బా, చింతపండు 14 కేజి, పసుపు 50 గ్రా, నూనె 1/2 కేజి
తయారుచేయు విధానం:
1. ఉసిరికాయలు డాగులు లేనివి తీసుకొని, బాండీలో 100 గ్రా. నూనె పోసి ఎర్రగా వేయించుకోవాలి.
2. ఆవాలు ఎండబెట్టి, దంచి, జల్లించుకోవాలి.
3. ఉప్పు కూడా ఎండబెట్టి, దంచి జల్లించుకోవాలి.
4. ఆవపిండి, కారం, ఉప్పు, కాయలు వేయించి మెంతులు పొడికొట్టిన పిండి, కలిపి నూనెపోసి వుంచాలి.
5. చింతపండు నానబెట్టి, పులుసుతీసి, మరిగించి, ఉడికిన తరువాత బాగా చల్లార్చి, ఉసిరికాయలలో వేసి కలపాలి.
6. జాడీలో మూతపెడితే 4, 5 నెలల వరకు నిల్వ ఉంటుంది. కాని కొంచెం నల్లబడుతుంది.