కావలసినవి:
మామిడికాయలు 25, మెత్తటి ఉప్పు 1 కేజీ, కారం1 కేజి. ఆవపిండి 3/4 కేజీ, బెల్లం 1/2 కేజి. నూనె 1 కేజీ, మెంతులు 1 కప్పు.
తయారుచేయు విధానం:
1. తెల్లబెల్లం శుభ్రం చేసి, సన్నగా తరిగి వుంచుకోవాలి.
2. ఉప్పు, కారం, మెంతులు బాగా కలపాలి.
3. ఈ ఆవకాయకి ముక్కలు కోయకుండా, మామిడి కాయలను పొడుగ్గా నాలుగు ముక్కలు చేసి, గుత్తిలో ఒక వైపు వుంచాలి.
4. మామిడికాయలో జీడి తీసేసి, ఒకవైపు నుండి కారం తీయాలి.
5. ఉప్పు, కారం, మెంతులు, బెల్లంతో నూనె కూడా వేసి బాగా కలిపి, మామిడికాయలో బోలుగా కూరుకోవాలి.
6. జాడీలో అడుగున నూనెపోసి, పైన కాయలుపెట్టి, కొంచెం నూనెపోసి మూత పెట్టాలి.
7. మూడు రోజుల తరువాత, ఊరిన మామిడికాయలు, విడిగా పళ్ళెంలో పెట్టి, ఊట చేరే జాడీలోకి ఓడాలి.
8. కాయలను మంచి ఎండలో వరుగుల్లా 7 రోజులు ఎండబెట్టాలి.
9. 8వ రోజున ఒక్కొక్క కాయ ఊటలో ముంచి అన్ని కాయలు జాడీలో పెట్టాలి.
10. ఆవపిండి కలపగా మిగిలిన నూనె కాచి, బాగా చల్లార్చి ముక్కలపై పోసి వుంచాలి.