కావలసినవి: మామిడికాయలు 12 పెద్దవి. నూనె 3% కేజీ, కారం 12 కేజి. మెత్తని ఉప్పు 1/2 కేజి, ఆవపిండి 2 కేజి మిరపకాయలు 15, శెనగపప్పు 14 కేజి, ఆవాలు 12 కప్పు, మెంతులు 1 స్పూను, కరివేపాకు 2 రెబ్బలు.
తయారుచేయు విధానం:
1. మామిడికాయల చెక్కుతీసి, పప్పులోకి తరిగినట్లు సన్నగా తరుక్కోవాలి.
2. మధ్యాహ్నం ఆవకాయ కలుపుతామనగా, ఉదయమే అరలీటరు నీళ్లు కాగబెట్టి చల్లారిన తరువాత ఆవపిండి కలిపి వూరపెట్టాలి.
3. ఆవకాయ కలిపేటప్పుడు, ఉప్పు, కారం, వూరిన ఆవపిండి మూడూ బాగా కలిపి అందులో ముక్కలు కూడా వేసి గుచ్చెత్తి జాడీలో పోసి పెట్టాలి.
4. రెండురోజులు ఊరిన తరువాత మూడోరోజు, ముక్కలు తీసి ఎండలో ఎండబెట్టాలి.
5. నాలుగోరోజు మూకుడులో నూనెపోసి, మిరపకాయలు, శనగపప్పు, మెంతులు, ఆవాలు వేసి వేగిన తరువాత, కరివేపాకు వేసి, పోపుని జాడీలో ఆవకాయలో పెట్టి మూత పెట్టాలి.
6. కాసేపు తరువాత మూత తీసి ఒకసారి కలియబెట్టాలి.
7. పులిహోర పోపుతో సువాసన వేస్తూ, అవకాయ చాలా రుచిగా వుంటుంది.