కావలసినవి:
దోసకాయలు 1 కేజి, మిరపకాయలు 125 గ్రా. ఆవాలు 125 . 3 125
తయారుచేయు విధానం:
1. మిరపకాయలు, ఆవాలు రెండూ విడిగా ఎండపెట్టి, మెత్తగా పొడుం కొట్టి జల్లించుకోవాలి.
2. రెండు కలపగా వచ్చినంత ఉప్పును ఎండబెట్టి, దంచి మెత్తగా జల్లించి వుంచుకోవాలి.
3. కారం, ఆవపిండి, ఉప్పు టీ స్పూను పసుపు కలిపి వుంచుకోవాలి.
4. దోసకాయలు శుభ్రంగా నీటిలో కడిగి, తుడిచి, చేదులేకుండా చూసి సన్నగా ముక్కలు తరగాలి.
5. కారం, ఆవపిండి, ఉప్పు, పసుపు, కలిపి నూనెపోసి, అందులో దోసబద్దలు వేసి బాగా కలిపి జాడీలో పెట్టాలి.
6. దోసావకాయ ఘాటుగా వుండి, చాలా రుచిగా వుంటుంది.