1000 Health Tips: chemicals used bananas eating stomach liver kidney diabetes brething problems

chemicals used bananas eating stomach liver kidney diabetes brething problems

 రూ. 60కే ఇంటికి క్యాన్సర్‌ని తెచ్చుకోకండి.. మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే..






















అరటి పండులో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని పోషకాల పవర్ హౌస్ అంటారు. ఈ పండులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. కాబట్టి రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత దీనిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీ శరీరానికి అందుతాయి. ఇందులో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. ఇది అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అలాగే అరటిలో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. రోజు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అరటి పండు ఎనర్జీ బూస్టర్‌లా పనిచేస్తుంది. అంతేకాకుండా వ్యాయామాలు, జిమ్ చేసేవారు అరటిపండును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతాయి. అరటిపండు అనేది పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B6, ఫాస్పరస్ వంటి విటమిన్లు, ఖనిజాల గని.

జీర్ణశక్తిని బలోపేతం చేయడం, బరువు తగ్గడం, బరువు పెరగడం, బలమైన ఎముకలు, శక్తి స్థాయిలను పెంచడం, గుండెను ఆరోగ్యంగా ఉంచడం, రక్తంలో చక్కెరను నియంత్రించడం వంటి అనేక ప్రయోజనాలను అరటిపండు అందిస్తుంది. కానీ, ఇవన్నీ పొందాలంటే.. మీరు సహజంగా పండిన అరటిపండును తినాలి.

అయితే మీరు తినే అరటిపండ్లను ప్రమాదకరమైన రసాయనాలతో నిండి ఉన్నాయని మీకు తెలుసా..? మనం కేవలం రూ. 60కే డజన్ అరటి పండ్లు కొని.. మన ఇంటికి క్యాన్సర్ తెచ్చుకుంటున్నాం. పక్వానికి రాక ముందు అరటి పండ్లను తెంపేసి.. కార్బైడ్ రసాయనాన్ని ఉపయోగించి పండిస్తున్నారు. దీంతో.. మీ శరీరంలో విషం కలుస్తుంది. అసలు కార్బైడ్ అంటే ఏంటి..? దీనికి ఎలా చెక్ పెట్టాలో ఇక్కడ తెలుసుకుందాం.

కార్బైడ్ అంటే ఏంటి..?

అరటిపండ్లతో పాటు.. ఇతర పండ్లను పండించడానికి కార్బైడ్, ముఖ్యంగా కాల్షియం కార్బైడ్‌ను వినియోగిస్తున్నారు. ఈ రసాయనం పండ్లలోని తేమను ఎండబెట్టి.. వాటిలో ఇథైల్ అనే వాయువును ఉత్పత్తి చేస్తుంది. ఇథైల్ పండ్ల లోపల వేడిని ఉత్పత్తి చేస్తుంది. దీంతో.. పండ్లు పక్వానికే ముందు పండిపోతున్నాయి. కాల్షియం కార్బైడ్ వాడకాన్ని చాలా ప్రాంతాల్లో నిషేధించారు. కానీ, ఎక్కువ లాభాలు ఆర్జించాలనే ఆశతో కాల్షియం కార్బైడ్‌ని వినియోగిస్తున్నరు. ఈ రసాయనం వాడటం వల్ల పండ్లు నిర్ణీత సమయానికి ముందే పక్వానికి వచ్చి త్వరగా మార్కెట్‌కు చేరుకుంటున్నాయి. ఇది భారతదేశంతో సహా అనేక దేశాలలో నిషేధించబడిన రసాయనం. దీనిని ఆరోగ్యానికి ప్రమాదంగా గుర్తించారు. ఇలా పండిన పండ్లను తినడం వల్ల క్యాన్సర్‌తో సహా అనేక తీవ్రమైన వ్యాధుల ముప్పు పొంచి ఉంది.

ఈ రసాయనాన్ని భారతదేశంలో నిషేధించారు..

కాల్షియం కార్బైడ్‌లో సాధారణంగా ఆర్సెనిక్, ఫాస్పరస్ ఉంటాయి. ఈ రసాయనాల వాడకం వల్ల ఆరోగ్యానికి పెను ముప్పు కలుగుతుంది. ఈ ప్రమాదాల కారణంగా, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్ 2.3.5 ప్రకారం పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్ వాడకాన్ని నిషేధించారు. పండ్లను పండించడానికి ఇథిలీన్ సురక్షితంగా పరిగణించబడుతుంది. సరిగ్గా ఉపయోగిస్తే ఇథిలీన్ హానికరం కాదు. భారతదేశంలో పండ్లను పండించడానికి ఇథిలీన్ వాయువును ఉపయోగించడంపై FSSAI ఆమోదించింది. ఇథిలీన్ సహజంగా పండ్ల పక్వానికి వచ్చే ప్రక్రియను నియంత్రిస్తుంది . ఈ వాయువును పంట, రకం, పక్వత నుంచి పండ్లలో 100పీపీఎం (100 μl/L) సాంద్రతల బట్టి ఉపయోగించవచ్చు

విష పదార్థాలు..

కాల్షియం కార్బైడ్ ఆర్సెనిక్, ఫాస్పరస్ వంటి ప్రమాదకర రసాయనాలను కలిగి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. తరచుగా దాహం, మైకము, బలహీనత, ఆహారాన్ని మింగడంలో వంటి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతేకాదు కాలేయం, కిడ్నీ వ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా ఉంది. కాల్షియం కార్బైడ్ రసాయనం కాబట్టి.. ఏ రూపంలోనైనా సరే బాడీలో చేరితే డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు.

జీర్ణ సమస్యలు..

కార్బైడ్ వాడకం కడుపు నొప్పి, విరేచనాలు, గుండెల్లో మంట వంటి జీర్ణశయాంతర సమస్యలను కలిగిస్తుంది. ఇది మాత్రమే కాదు, కాల్షియం కార్బైడ్‌కు నాడీ వ్యవస్థపై ఎక్కువ ప్రభావం చూపుతుంది, తలనొప్పి, తల తిరగడం, గందరగోళం వంటి లక్షణాలను కలిగిస్తుంది.

క్యాన్సర్ ప్రమాదం కూడా..

NCBIలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం కాల్షియం కార్బైడ్‌ వల్ల మైకము, తలనొప్పి, మానసిక స్థితి తగ్గడం, తీవ్రమైన సందర్భాల్లో మూర్ఛలు వంటి నరాల సంబంధిత లక్షణాలు ఏర్పడవచ్చు. ఏ రూపంలోనైనా ఎక్కువ మోతాదులో శరీరంలోకి చేరితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.


పోషకాలు పోతాయి..
కృత్రిమంగా పండిన పండ్లలో.. సహజంగా పండిన పండ్ల కంటే తక్కువ పోషక విలువలు ఉంటాయి. ఈ పండ్లు శరీరానికి కావాల్సిన చక్కెరలు, ఇతర ముఖ్యమైన పోషకాలను పూర్తిగా అందించవు. దీంతో.. వీటిని తినడం వల్ల లాభాల కంటే ముప్పే ఎక్కువగా ఉంది.

కాల్షియం కార్బైడ్‌తో పండిన పండ్లను ఎలా గుర్తించాలి..

* కార్బైడ్‌తో పండిన అరటిపండ్లు అసమానంగా పండుతాయి. అరటిపండులోని కొంత భాగం పసుపు రంగులోకి మారుతుంది. మరి కొంత భాగం పచ్చగా ఉండవచ్చు. ఈ తేడాలు గమనించి మీరు అరటి పండ్లను తీసుకోండి.

* కాల్షియం కార్బైడ్‌తో పండిన అరటిపండ్లు సహజంగా పండిన అరటిపండ్ల కంటే వేగంగా పాడైపోతాయి.

* కార్బైడ్ వల్ల అరటిపండ్ల తొక్క పసుపు రంగులో కనిపిస్తుంది. నిగనిగలాడుతుంది. కానీ, లోపలి పండు మాత్రం గట్టిగా ఉంటుంది. పచ్చి పచ్చిగా ఉండే అవకాశం ఉంది.

* సహజంగా పండిన అరటిపండ్లు చాలా మృదువుగా ఉంటుంది. దాని ఆకారంలో ఎటువంటి మార్పు ఉండదు. అరటిపండు పూర్తిగా పసుపు రంగులో ఉన్నప్పటికీ ఇంకా చాలా గట్టిగా ఉంటే, అది రసాయనాలతో పండించారని అర్థం చేసుకోండి.

* సహజంగా పండిన అరటిపండ్లు ఆహ్లాదకరమైన తీపి వాసన కలిగి ఉంటాయి. రసాయనాలతో పండిన అరటిపండ్లలో ఈ సహజ సువాసన ఉండదు.


గమనిక..
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.