2.28.2025

each day women butter milk ginger mirchi salth loss of fat :మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?


 మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?


Butter Milk:వేసవి రాకముందే చాలా చోట్ల ఎండల ప్రభావం మొదలైంది. అందువల్ల, వేసవి కాలంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం మనం సాధారణంగా కొన్ని సహజ పానీయాలు తాగుతుంటాం.

వాటిలో ఒకటి మజ్జిగ. వేసవిలో మజ్జిగ తాగడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. 

కానీ దీనికి కొద్దిగా అల్లం కలిపి తాగడం వల్ల బరువు తగ్గవచ్చని మీకు తెలుసా? అవును అదే నిజం. ఎందుకంటే మజ్జిగ, అల్లంలోని ప్రయోజనకరమైన లక్షణాలు బరువు తగ్గడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. రోజూ అల్లంను మజ్జిగలో కలిపి తాగడం వల్ల బరువు తగ్గడంతోపాటు నడుము చుట్టూ ఉన్న కొవ్వు కూడా తగ్గుతుంది. 

వేసవిలో మజ్జిగ ఒక గొప్ప పానీయం. ఇది లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంది. పాలతో పోలిస్తే మజ్జిగలో కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ, ఇది ప్రోటీన్, కాల్షియం ఎక్కువగా వుంటుంది. అంతే కాకుండా, మజ్జిగలో సోడియం, పొటాషియం, భాస్వరం, విటమిన్లు తక్కువ మొత్తంలో ఉంటాయి. 

కాల్షియం, ప్రోటీన్, విటమిన్ బి12, విటమిన్ డి, మంచి బ్యాక్టీరియా ఉంటాయి. అందువల్ల, బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఎంతగానో మెరుగ్గా పనిచేస్తుంది. మజ్జిగలో ఉండే కాల్షియం ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే, దీనిలోని ప్రోబయోటిక్స్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీనిలో ఉండే ఆమ్లం కడుపును శుభ్రపరుస్తుంది.

మిక్సర్ జార్‌లో కొద్దిగా పెరుగు వేసి, చిన్న అల్లం ముక్కను మెత్తగా కోసి, అవసరమైనంత ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాసులోకి తీసుకుని తాగాలి. అవసరమైతే, జీలకర్ర పొడిని కలుపుకోవచ్చు.

హాస్పిటల్ లో డాక్టర్ నాలుకని ఎందుకు చూస్తారు?

 హాస్పిటల్ లో డాక్టర్ నాలుకని ఎందుకు చూస్తారు?



హాస్పిటల్ లో డాక్టర్ నాలుకని ఎందుకు చూస్తారు:  డాక్టర్లు హాస్పిటల్లో నాలుకను పరీక్షించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇది ఒక ముఖ్యమైన డయాగ్నోస్టిక్ పద్ధతి. నాలుక పరీక్ష ద్వారా డాక్టర్లు ఈ విషయాలను గమనిస్తారు.

సాధారణ ఆరోగ్య స్థితి…. నాలుక రంగు, ఆకారం, మరియు పరిమాణం శరీర ఆరోగ్య స్థితిని సూచిస్తాయి. డీహైడ్రేషన్….. పొడి నాలుక శరీరంలో నీటి కొరత సూచిస్తుంది. అనీమియా…. పాలిపోయిన నాలుక రక్తహీనతను సూచించవచ్చు. ఇన్ఫెక్షన్లు…. నాలుకపై తెల్లని పొరలు లేదా పుండ్లు బాక్టీరియా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లను సూచించవచ్చు.

వైటమిన్ లోపాలు…. B12 వంటి వైటమిన్ల లోపం నాలుక రంగు మరియు ఆకారాన్ని ప్రభావితం చేస్తుంది. ఆహార అలవాట్లు…. నాలుక రంగు మరియు కోతలు ఆహార అలవాట్లను సూచించవచ్చు. ధూమపానం… ధూమపానం చేసేవారి నాలుక రంగు మారవచ్చు. మౌఖిక ఆరోగ్యం…. నాలుక పరిస్థితి దంతాల మరియు మౌఖిక ఆరోగ్యాన్ని సూచిస్తుంది. థైరాయిడ్ సమస్యలు…. పెద్దది అయిన నాలుక థైరాయిడ్ సమస్యలను సూచించవచ్చు.

లివర్ లేదా కిడ్నీ సమస్యలు…. నాలుక రంగు మార్పులు కొన్నిసార్లు లివర్ లేదా కిడ్నీ సమస్యలను సూచిస్తాయి. కాన్సర్…. నాలుకపై అసాధారణ మచ్చలు లేదా గడ్డలు కాన్సర్‌ను సూచించవచ్చు. నాలుక పరీక్ష ఒక త్వరిత, సులభమైన మరియు ఉపయోగకరమైన డయాగ్నోస్టిక్ సాధనం. అయితే, ఖచ్చితమైన నిర్ధారణ కోసం తరచుగా అదనపు పరీక్షలు అవసరమవుతాయి.

Tamil Nadu: తమిళనాడులో అమానుష ఘటన..3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన 16 ఏళ్ల బాలుడు

 Tamil Nadu: తమిళనాడులో అమానుష ఘటన..3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన 16 ఏళ్ల బాలుడు



Tamil Nadu. 3years children 16years boy rapedతమిళనాడు రాష్ట్రంలోని మైలాపూర్ జిల్లా, సిర్కాళి పట్టణంలో జరిగిన దారుణ ఘటనలో 16 ఏళ్ల ఒక బాలుడు, 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి ప్రయత్నించాడు.

ఆ చిన్నారి అతన్ని ఆపడానికి ప్రయత్నించినప్పుడు కోపంతో ఆ చిన్నారిపై విచక్షణారహితంగా దాడి చేశాడు.

ఈ ఘటన అప్పుడే అంగన్‌వాడీ నుండి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో జరిగింది. నిందితుడు ఆమెను చాక్లెట్ ఇచ్చి ఆకర్షించి, ఓ ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. చిన్నారి సహాయం కోసం కేకలు వేయగా, కోపంతో బాలుడు రాయితో ఆమె ముఖాన్ని కొట్టి తీవ్ర గాయాలు కలిగించాడు. ఈ దాడిలో చిన్నారి స్పృహ కోల్పోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.

తల్లిదండ్రులు తన కుమార్తె కనిపించకపోవడంతో వెతికి, అపస్మారకంగా పడిపోయి ఉండటాన్ని గమనించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఐసీయూలో చికిత్స పొందుతోంది. బాధితురాలి కుటుంబ ఫిర్యాదు మేరకు, ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్ పోలీసులు 16 ఏళ్ల బాలుణ్ని అరెస్ట్ చేశారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

మీ జుట్టు పొడవు పెంచుకోవాలనుకుంటున్నారా? తర్వాత ఈ పదార్థాన్ని కొబ్బరి నూనెలో కలపండి!!

 మీ జుట్టు పొడవు పెంచుకోవాలనుకుంటున్నారా? తర్వాత ఈ పదార్థాన్ని కొబ్బరి నూనెలో కలపండి!!



మీ జుట్టు పొడవు పెంచుకోవాలనుకుంటున్నారా :మ హిళలు తమ జుట్టు పొడవును పెంచుకోవాలనుకుంటే, క్రింద ఇవ్వబడిన నూనెను తయారు చేసి వాడండి.

కావలసినవి:-

1) జీలకర్ర - రెండు టీస్పూన్లు

2) మెంతులు - రెండు టేబుల్ స్పూన్లు

3) దాల్చిన చెక్క - రెండు టీస్పూన్లు

4) విటమిన్ E మాత్రలు - రెండు

5) నిమ్మ నూనె - 20 మి.లీ.

6) కొబ్బరి నూనె - 250 మి.లీ.


రెసిపీ వివరణ:-

1:  స్టవ్ మీద ఫ్రైయింగ్ పాన్ పెట్టి, రెండు టేబుల్ స్పూన్ల సోంపు గింజలు వేసి, సువాసన వచ్చేవరకు వేయించి, దీన్ని ఒక ప్లేట్ మీద పోసి పక్కన పెట్టుకోండి.


2:  తరువాత, రెండు టేబుల్ స్పూన్ల మెంతులు వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.


3:  తరువాత, పాన్‌లో రెండు టీస్పూన్ల దాల్చిన చెక్క వేసి, దానిని వేయించి, మూడు పదార్థాలను బాగా చల్లబరచండి.


4:  తరువాత మిక్సర్ జార్ లో వేసి పొడిగా రుబ్బుకోవాలి. తరువాత, పాన్ ని స్టవ్ మీద పెట్టి 250 మి.లీ కొబ్బరి నూనె పోసి వేడి చేయాలి.


5:   తరువాత ఈ నూనెను స్టవ్ మీద నుండి తీసి చల్లారనివ్వండి. కొబ్బరి నూనె చల్లబడిన తర్వాత, రుబ్బిన మెంతి మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలపండి.


6:   ఆ తర్వాత, దానికి రెండు విటమిన్ E మాత్రలు వేసి, బాగా కలిపి, ఒక సీసాలో పోసి నిల్వ చేసుకోండి. ఈ నూనెను తలకు వాడటం వల్ల చిన్న జుట్టు పొడవు పెరుగుతుంది.


మరొక పరిష్కారం:

కావలసినవి:-

1) కొబ్బరి నూనె - 250 మి.లీ.

2) మెంతులు - ఒక టీస్పూన్

3) కలబంద ముక్క - పది

4) నల్ల జీలకర్ర - ఒక టీస్పూన్


రెసిపీ వివరణ:-

1:  స్టవ్ మీద పాన్ పెట్టి, 250 మి.లీ. స్వచ్ఛమైన కొబ్బరి నూనె పోసి వేడి చేయాలి.

2:  తరువాత ఒక టీస్పూన్ మెంతులు, ఒక టీస్పూన్ నల్ల జీలకర్ర వేసి తక్కువ మంట మీద మరిగించాలి.

3.  తరువాత, ఒక చిన్న కలబంద ఆకును తీసుకొని, దానిని చిన్న ముక్కలుగా కోసి, దానిలో వేసి, కాచుకోవాలి.

4:  ఈ నూనెను చల్లబరిచి, వడకట్టి, మీ తలకు రాసుకుంటే, జుట్టు పెరుగుదల పెరుగుతుంది.

Bird Flu Childerns Helth Problem Eat: పసిబిడ్డకు బర్డ్ ఫ్లూ.. జాగ్రత్త, ఎలా సోకిందంటే?

 Bird Flu: పసిబిడ్డకు బర్డ్ ఫ్లూ.. జాగ్రత్త, ఎలా సోకిందంటే?


Bird Flu: ఈ రోజుల్లో భారతదేశం, అమెరికాతో సహా అనేక దేశాలు బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ బారిన పడ్డాయి. బర్డ్ ఫ్లూ సాధారణంగా కోళ్లు, పక్షులలో సంక్రమణను వ్యాపింపజేస్తుందని భావిస్తారు.

ఎలుకలలో కూడా ఈ ఇన్ఫెక్షన్ కనుగొన్నారు. ఇదిలా ఉంటే బర్ట్ ఫ్లూతో కాంబోడియాలో చిన్నారి మృతి చెందిన ఘటన ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంటు వ్యాధుల ముప్పు వేగంగా పెరుగుతోందని స్పష్టమవుతుంది . భారతదేశంలో కూడా ఇటీవల స అనేక వ్యాధులు వేగంగా పెరిగుతున్నాయి. ఏవియన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ అని కూడా పిలువబడే H5N1 వైరస్ అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తోంది. బర్డ్ ఫ్లూ సాధారణంగా కోళ్లు, పక్షులను ప్రభావితం చేసే ఇన్ఫెక్షన్‌. అయితే గత కొన్ని సంవత్సరాలుగా, ఇది ఆవులకు, మనుషులకు కూడా సోకుతుంది.

అమెరికాలో కొత్త రకం బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందడం ప్రారంభించినప్పటి నుండి, ఇన్ఫెక్షన్‌ను నివారించడానికి కోళ్ల ఫామ్‌లలో సుమారు 148 మిలియన్ (14.8 కోట్లకు పైగా) కోళ్లను చంపారు. ఇది గుడ్ల ధరలలో భారీ పెరుగుదలకు దారితీసింది. అటువంటి పరిస్థితిలో, సంక్రమణను నివారించడానికి చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ?

H5N1 సంక్రమణను మొదట మార్చి 2024లో పాడి ఆవులలో గుర్తించారు. ఇదిలా ఉంటే మనుషులలో దాదాపు 70 కేసులు నమోదయ్యాయి. వారిలో ఎక్కువ మంది పాడి, కోళ్లను పెంచేవారే. ఇప్పటివరకు ఒక వ్యక్తి కూడా ఈ ఇన్ఫెక్షన్ కారణంగా మరణించగా తాజాగా కాంబోడియాలో ఓ చిన్నారి కూడా మృతి చెందింది. ఈ అంటు వ్యాధి కేసులు పెరుగుతున్న ప్రదేశాలలో, ప్రజలందరూ నివారణ చర్యలను తీవ్రంగా తీసుకోవడం చాలా ముఖ్యం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Liver Health: మీ కాలేయం ఆరోగ్యంగా మారాలంటే నెల రోజుల పాటూ ఈ సూపర్ టిప్స్ పాటించండి

 Liver Health: మీ కాలేయం ఆరోగ్యంగా మారాలంటే నెల రోజుల పాటూ ఈ సూపర్ టిప్స్ పాటించండి


కాలేయం ఆరోగ్యంగా ఉంటే ఒక వ్యక్తి సంతోషంగా జీవించగలడు. గుండె, మెదడు, మూత్రపిండాల మాదిరిగానే కాలేయం కూడా శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం. కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే శరీరంలోని ఇతర అవయవాలు సరిగ్గా పనిచేస్తాయి.

కాలేయం శరీరానికి శక్తి కేంద్రంగా చెప్పవచ్చు. కాలేయం సరిగా పనిచేయకపోతే శరీరం బలహీనపడుతుంది. 

కాలేయం శరీరాన్ని విషపదార్థాల నుండి శుభ్రపరిచే అవయవం. అయితే, తప్పుడు జీవనశైలి, అధిక జంక్ ఫుడ్, మద్యం సేవనం వల్ల కాలేయంలో విషపదార్థాలు చేరి, దాని పనితీరును క్రమంగా తగ్గిస్తాయి. కాబట్టి, సమయానికి కాలేయాన్ని శుభ్రపరచుకోవడం చాలా ముఖ్యం. దీన్నే డీటాక్సిఫికేషన్ అంటారు. కాలేయం డీటాక్స్ చేకోవడానికి ఉపయోగపడే టిప్స్ ఇక్కడ ఉన్నాయి.

అధికంగా నీరు త్రాగండి

కాలేయం డీటాక్స్ చేసుకోవడానికి నీరు ఉత్తమ మార్గం. ఇది కాలేయం డీటాక్స్ చేసుకోవడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి. కాలేయంలోని విషపదార్థాలు బయటకు పోకపోతే అనేక సమస్యలు వస్తాయి. అధికంగా నీరు త్రాగడం వల్ల కాలేయం విషపదార్థాలను సమర్థవంతంగా బయటకు పంపేందుకు సహాయపడుతుంది. ఫిల్టర్ చేసిన నీటినే రోజులో ఎక్కువసార్లు తాగుతూ ఉండండి.

విషపూరిత ఆహారాలకు దూరంగా ఉండండి

ఫాస్ట్ ఫుడ్ చాలా మందికి ఇష్టం. ఈ రకమైన ఆహారం తీసుకోవడం వల్ల మీరు తెలియకుండానే అధిక ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకుంటారు, ఇవి కాలేయ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయి. కాలేయం శుభ్రపరచడానికి ప్రాసెస్ చేసిన ఆహారాలను తినడం మానేయండి. ఆరోగ్యకరమైన ఆహారాన్నే తినడం ముఖ్యం. ఆకుకూరలు, కూరగాయలతో వండిన ఆహారాన్నే తినాలి. 

పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు

మీ ఆహారంలో పొటాషియం సమృద్ధిగా ఉంటే, అది మీ కాలేయం శుభ్రపరచడంలో సహాయపడుతుంది. టమాటో సాస్, బీట్‌రూట్ ఆకులు, పాలకూర, బీన్స్, అరటిపండ్ల వంటి ఆహార పదార్థాలలో పొటాషియం అధికంగా ఉంటుంది. వీటిని తినడం ద్వారా అధిక పొటాషియం పొందవచ్చు. 

ప్రతిరోజూ వ్యాయామం చేయండి:

వ్యాయామం చేసేటప్పుడు మీ శరీరం నుండి వెలువడే చెమట డీటాక్సిఫికేషన్‌కు సహాయపడుతుంది. శరీరం నుండి విషపదార్థాలను బయటకు పంపడానికి ప్రతిరోజూ వ్యాయామం చేయడం ప్రారంభించండి. యోగా, పరుగు, జిమ్ వ్యాయామాలు ప్రభావవంతంగా ఉంటాయి. ప్రతిరోజూ అరగంట నుంచి గంట వరకు వ్యాయామానికి కేటాయించుకోవాల్సిన అవసరం ఉంది. 

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

2.27.2025

ఈ నలుపు ఎందుకు వస్తుందో చాలామందికి తెలీదు. శరీరమంతా ఒకరకంగా ఉండి మెడ మాత్రమే నల్లగా ఉంటే చూడటానికి అస్సలు బాగోదు.

ఈ నలుపు ఎందుకు వస్తుందో చాలామందికి తెలీదు. శరీరమంతా ఒకరకంగా ఉండి మెడ మాత్రమే నల్లగా ఉంటే చూడటానికి అస్సలు బాగోదు.


అయితే కొన్ని ఇంటి చిట్కాలతో మెడపై నలుపును ఈజీగా పోగొట్టవచ్చు. అవెంటో చూసేయండి.

శరీరం మొత్తం ఒకే రంగులో ఉండి మెడ మాత్రం నల్లగా ఉంటే చూడటానికి బాగోదు. ఈ సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. రోజూ స్నానం చేసినా.. రకరకాల సబ్బులు వాడినా ఫలితం ఉండదు. కాలుష్యం, ఆరోగ్య సమస్యలు, జన్యు కారణాలు, చర్మ సమస్యలు మెడ నల్లగా మారడానికి కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల వ్యాధుల వల్ల కూడా ఈ సమస్య వస్తుందట. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటో ఇక్కడ చూద్దాం. 

కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల మెడ చుట్టూ నలుపు వస్తుంది. ముఖ్యంగా ఊబకాయం, మధుమేహం, థైరాయిడ్ ఉన్నవాళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధులు ఉన్నవాళ్లలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల మెడ చర్మం లోపలి కణాల్లో వర్ణద్రవ్యం ఏర్పడుతుంది. దీంతో చర్మం నల్లగా మారుతుంది. దీనికోసం ఎన్ని క్రీములు, సబ్బులు వాడినా ఫలితం ఉండదు. అందుకే మెడ నలుపు ఉన్నవాళ్లు చర్మ వైద్యుడిని కలిసి చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొన్ని సాధారణ కారణాల వల్ల వచ్చే నలుపును కొన్ని ఇంటి చిట్కాలతో పోగొట్టవచ్చు.

మెడపై నలుపును తొలగించడంలో పెరుగు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పెరుగులో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి మెడకు పట్టించి 10-15 నిమిషాల తర్వాత నీటితో కడగాలి. పెరుగు మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. దీన్ని తరచుగా ఉపయోగిస్తే మెడపై నలుపు తగ్గుతుంది. 

ఒక దూదిని ఉపయోగించి నిమ్మరసాన్ని మీ మెడకు రాయండి. 20 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత నీటితో తుడవాలి. నిమ్మరసం చర్మంపై ఉండే మృతకణాలు, నూనె, దుమ్మును తొలగిస్తుంది. దీన్ని తరచుగా ఉపయోగిస్తే మెడపై నలుపు తగ్గుతుంది. ముఖ్యంగా నిమ్మరసం ఉపయోగించిన తర్వాత మీ చర్మానికి సూర్యరశ్మి తగలకుండా చూసుకోవాలి.


- రోజ్ వాటర్, నిమ్మరసం సమానంగా కలిపి రాత్రి పడుకునే ముందు మెడకు రాసి ఉదయం స్నానం చేయాలి.

- బాదం నూనెను కొద్దిగా వేడి చేసి మెడకు రాసి పది నిమిషాలు మసాజ్ చేసి తర్వాత స్నానం చేయాలి.

- కొబ్బరి నూనెను మెడకు రాసి మసాజ్ చేసి వేడి నీటితో స్నానం చేయాలి. కావాలంటే బాదం లేదా ఆలివ్ నూనెను కూడా ఉపయోగించవచ్చు. ఇలా తరచూ చేయడం ద్వారా మంచి ఫలితాలు చూడవచ్చు.

Threading eyebrows. But this shocking news is for you:ఐ బ్రోస్ థ్రెడ్డింగ్ చేయిస్తున్నారా? అయితే ఈ షాకింగ్ న్యూస్ మీ కోసమే!

 ఐ బ్రోస్ థ్రెడ్డింగ్ చేయిస్తున్నారా? అయితే ఈ షాకింగ్ న్యూస్ మీ కోసమే!

చాలామంది మహిళలు ఐబ్రోస్ థ్రెడ్డింగ్ చేయిస్తూ ఉంటారు. అయితే ఐబ్రోస్ థ్రెడ్డింగ్ చేయించి ఒక మంచి షేప్ లో ఉంటే అందంగా ఉంటుందని మహిళలు భావిస్తారు.

అయితే కనుబొమ్మలను థ్రెడ్డింగ్ చేయించడం అనర్ధాలకు దారి తీస్తుందని చెబుతున్నారు. కనుబొమ్మలను థ్రెడ్డింగ్ చేయించడం వల్ల కళ్లపై ఉన్న సున్నితమైన చర్మానికి చిరాకు కలుగుతుందని. కొంతమందిలో కనుబొమ్మల వద్ద ఎర్రగా మారుతుందని, అసౌకర్యం కలుగుతుందని చెబుతున్నారు.

ఐ బ్రోస్ చేయించుకునే ఈ ప్రమాదం

కనుబొమ్మ ప్రాంతం చుట్టూ సున్నితమైన చర్మం ఉండడం వల్ల కనుబొమ్మలను షేప్ చేసేవారు సరిగ్గా చేయకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని, చర్మం రంగు మారే సమస్య కూడా రావచ్చని చెబుతున్నారు. అంతేకాదు అన్నిటికంటే ముఖ్యంగా ఐబ్రోస్ చేయించుకుంటే జ్ఞాపకశక్తి బాగా తగ్గుతుందని, ఎక్కువగా దేనిని గుర్తు పెట్టుకోలేని పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

ప్రతిరోజూ మహిళలు ఇవి తీసుకుంటే మగాళ్లు మీ వెంటపడాల్సిందే..!

కొందరిలో ఐబ్రోస్ చేయించుకున్నాక ఈ సమస్యలు వచ్చే అవకాశం

కొందరిలో ఐబ్రోస్ చేయించుకున్న తర్వాత వాపు వచ్చే సమస్య కూడా ఉందని చెబుతున్నారు. సహజంగా ఐబ్రోస్ చేయడానికి ఉపయోగించేది దారమే కాబట్టి, ఇందులో రసాయనాలు వాడకం ఉండకపోయినప్పటికీ కొంతమందిలో ఇది అలర్జీలను కలిగిస్తుందని చెబుతున్నారు. ఐబ్రోస్ చేస్తున్న సమయంలో సాధారణంగా నొప్పి వస్తుందని చెబుతున్నారు.


ఐ బ్రోస్ తో కొందరికి ఇన్ఫెక్షన్స్:

ఐబ్రోస్ చేయడం వల్ల కనుబొమ్మల చుట్టూ ఉండే స్కిన్ పోర్స్ తెరుచుకుంటాయి.దీనివల్లనే అనేక రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ మొటిమలుగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఇక స్కిన్ పోర్స్ మూసుకోవడానికి ఏదైనా లోషన్ కానీ రోజ్ వాటర్ కానీ అప్లై చేయాలి.

ఐ బ్రోస్ చేయించుకోవటంపై భిన్నాభిప్రాయాలు

మరికొందరు మాత్రం ఐబ్రోస్ చేయించుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని, ఈ ప్రక్రియ కనుబొమ్మలకు నిర్దిష్టమైన ఆకారాన్ని ఇస్తుందని, ముఖం యొక్క అందాన్ని మరింత పెంచుతుందని ఇది పూర్తిగా సహజమైనదని చెబుతున్నారు.ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా చేసే ఈ ప్రక్రియలో ఎటువంటి ప్రమాదం ఉండదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఐ బ్రోస్ చేయించుకునే విషయంలో జాగ్రత్త

ఐబ్రోస్ చేయడానికి ఉపయోగించే దారం మురికిగా ఉన్న దారాన్ని ఉపయోగించకూడదని, చేసే వ్యక్తి శుభ్రంగా చేతులు కడుక్కొని దానిని ఉపయోగించాలని అలా చేస్తే ఎటువంటి అలర్జీలు రావని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కనుబొమ్మలను షేప్ చేయడం సాధారణంగా శిక్షణ పొందిన ప్రొఫెషనల్ నిర్వహిస్తే సురక్షితంగా ఉంటారని దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని కూడా చెబుతున్నారు.

గమనిక : ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. 

మధుమేహాన్ని నివారించే అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంది. ఇందులో విటమిన్ C కూడా పుష్కలంగా ఉంటుంది.

 మధుమేహాన్ని నివారించే అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంది. ఇందులో విటమిన్ C కూడా పుష్కలంగా ఉంటుంది.


ఈ చిన్న పండు కేవలం మతపరమైన దృక్కోణం నుండి మాత్రమే ముఖ్యమైనది కాదు, దీనికి అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. పురాణాల ప్రకారం, ఒకప్పుడు ఒక పేద స్త్రీ శివుని అభిషేకానికి ఎటువంటి పండ్లు దొరకలేదు.

ఆయన శివలింగానికి రేగు పండ్లు సమర్పించాడు. అతని భక్తికి పరమేశ్వరుడు సంతోషించాడు. అప్పటి నుండి శివుని పూజలో ప్లం చేర్చడం ప్రారంభమైంది. ఆయుర్వేదంలో ప్లం పండు చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడటమే కాకుండా అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. నారింజ పండ్ల కంటే రేగు పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. రేగు పండ్లు తినడం వల్ల కడుపు మరియు గుండె జబ్బులు నయమవుతాయి. ఇవి డయాబెటిస్‌ను కూడా నియంత్రిస్తాయి.



maharastra pune raped woman in bus: Pune Horror: దారుణం, రోడ్డు మీద వెళుతున్న మహిళను బస్సుల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేసిన కామాంధుడు, అరుస్తుందని నోట్లో గుడ్డలు కుక్కి మరీ పైశాచికం

 Pune Horror: దారుణం, రోడ్డు మీద వెళుతున్న మహిళను బస్సుల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేసిన కామాంధుడు, అరుస్తుందని నోట్లో గుడ్డలు కుక్కి మరీ పైశాచికం


మహారాష్ట్రలో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటనలో, పూణేలో 26 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగింది. వార్తా సంస్థ IANS ప్రకారం, స్వర్గేట్ బస్ స్టాండ్ వద్ద ఆపి ఉంచిన బస్సులో మహిళపై అత్యాచారం జరిగింది.

నిందితుడుని దత్తా గడేగా గుర్తించబడ్డాడు, అతను మహిళపై అత్యాచారం చేసిన తర్వాత అక్కడి నుండి పారిపోయాడు. పోలీసులు సిసిటివి ద్వారా అతన్ని గుర్తించి, అతని కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. నిందితుడు అటుగు వెళ్తున్న మహిళను బస్సులోకి లాక్కెళ్లి మరీ అత్యాచారం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె అరవకుండా నోరు కప్పెట్టి దారుణానికి పాల్పడ్డాడు.

Chia Seeds:helthy drink benfits చియా సీడ్స్ తింటే.. ఆశ్చర్యకర లాభాలు !

                                           Chia Seeds: చియా సీడ్స్ సాల్వియా హిస్పానికా మొక్క నుండి తీసుకుంటారు. 'చియా' అంటే మాయన్ భాషలో 'శక్తి' అని అర్థం. చియా గింజలు ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3 , అనేక ముఖ్యమైన ఖనిజాలతో సమృద్ధిగా ఉండటం వల్ల సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతిరోజూ 2 టీస్పూన్ల చియా సీడ్స్ తినడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ విత్తనాలు నీటిని పీల్చుకుని జెల్ లాంటి ఆకృతిని ఏర్పరుస్తాయి. కాబట్టి వీటిని ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. కాబట్టి సరైన మోతాదులో తినడం మంచిది.


బ్రేక్ ఫాస్ట్:

చియా సీడ్స్ ఓట్ మీల్, స్మూతీస్, పెరుగు లేదా గంజిలో కలిపి బ్రేక్ ఫాస్ట్ లాగా తయారు చేసుకుని తినవచ్చు. ఇది మీ ఆహారం యొక్క పోషక విలువను పెంచడమే కాకుండా మిమ్మల్ని ఎక్కువ సమయం శక్తివంతంగా ఉంచుతుంది.


ఆరోగ్యకరమైన డ్రింక్స్ :

కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు, గ్రీన్ టీలలో నానబెట్టిన చియా విత్తనాలను వేసి తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. అంతే కాకుండా ఇది శరీరానికి తగిన పోషణను అందిస్తుంది.

మీకు ఆరోగ్యకరమైన, రుచికరమైన స్నాక్ కావాలంటే మీరు చియా విత్తనాలను పాలు లేదా బాదం పాలలో నానబెట్టి, తేనె, పండ్లతో కలిపి స్నాక్ తయారు చేసుకోవచ్చు. ఇది రుచికరంగానూ, పోషకాలు అధికంగానూ ఉంటుంది.


చియా సీడ్స్ ప్రయోజనాలు :

చియా సీడ్స్ ప్రోటీన్ యొక్క అద్భుతమైన మూలం. ఇవి శరీర శక్తి, రోగనిరోధక వ్యవస్థకు అవసరమైన తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఒక టీ స్పూన్ 5 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది గొప్ప ప్రోటీన్ ఎంపిక.


అధిక ఫైబర్ కంటెంట్:

వీటిలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. అంతే కాకుండా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.


యాంటీఆక్సిడెంట్లు:

చియా విత్తనాలలో కెఫిక్ ఆమ్లం, మైరిసెటిన్, క్వెర్సెటిన్, రోస్మరినిక్ ఆమ్లం వంటి యాంటీఆక్సిడెంట్లు కనిపిస్తాయి. ఇవి శరీరాన్ని హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. అంతే కాకుండా గుండె జబ్బులు , క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలకు మంచి మూలం:

ఇందులో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. అంతే కాకుండా మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.


ఆరోగ్యకరమైన కొవ్వులు:

చియా సీడ్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. వీటిలో 8 గ్రాములు గుండెకు ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇవి కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి.


ముఖ్యమైన ఖనిజాల నిధి:

చియా సీడ్స్ లో కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, జింక్ కనిపిస్తాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, కణాల పెరుగుదలకు సహాయపడతాయి.

Also Read: బరువు తగ్గాలంటే.. బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తినండి !

తక్కువ కేలరీలు, ఎక్కువ ప్రయోజనాలు:

కేవలం 2 టేబుల్ స్పూన్ల చియా విత్తనాలలో 138 కేలరీలు ఉంటాయి. ఇది తక్కువ కేలరీలతో ఎక్కువ పోషణను అందిస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.

చియా విత్తనాలను మీ ఆహారంలో చేర్చుకోవడం సులభం. ఇవి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఈ చిన్న విత్తనాలలో ప్రోటీన్, ఫైబర్, ఒమేగా-3, యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వాటిని సరైన పరిమాణంలో, సరైన రీతిలో తీసుకోవడం ద్వారా మీరు మెరుగైన జీర్ణక్రియ, శక్తి, ఆరోగ్యాన్ని పొందవచ్చు.


The post Chia Seeds: చియా సీడ్స్ తింటే.. ఆశ్చర్యకర లాభాలు.

తమలపాకులు మన జీర్ణక్రియను మెరుగపరుస్తాయి. రెగ్యులర్ గా తినడం వల్ల నోటి దుర్వాసన రాదు. అంతేకాదు.. చర్మం అందంగా కనపడటానికి కూడా సహాయపడుతుంది.

 తమలపాకులు మన జీర్ణక్రియను మెరుగపరుస్తాయి. రెగ్యులర్ గా తినడం వల్ల నోటి దుర్వాసన రాదు. అంతేకాదు.. చర్మం అందంగా కనపడటానికి కూడా సహాయపడుతుంది.


హిందూ సంప్రదాయంలో తమలపాకులకు ప్రత్యేక స్థానం ఉంది. ఏ శుభకార్యానికీ అయినా పండగ, పూజ ఏదైనా సరే... కచ్చితంగా తమలపాకులు ఉండాల్సిందే. అయితే.. కేవలం పూజకు మాత్రమే కాదు...మన ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ తమలపాకులు కీలకంగా పని చేస్తాయి. ప్రతిరోజూ రెండు తమలపాకులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం. 

తమలపాకులు మన జీర్ణక్రియను మెరుగపరుస్తాయి. రెగ్యులర్ గా తినడం వల్ల నోటి దుర్వాసన రాదు. అంతేకాదు.. చర్మం అందంగా కనపడటానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు.. గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. 

జీర్ణక్రియకు సహాయపడతాయి

తమలపాకులు మీ జీర్ణవ్యవస్థకు చాలా బాగా సహాయపడతాయి. వాటిని నమలడం వల్ల లాలాజల ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడుతుంది, ఇది ఆహారాన్ని విచ్ఛిన్నం చేసే ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది. కడుపు ఉబ్బరం, అజీర్ణాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. 

నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

నోటి ఆరోగ్యం విషయానికి వస్తే, తమలపాకులు యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ ఏజెంట్‌గా పని చేస్తాయి. హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడటం, మీ శ్వాసను తాజాగా ఉంచడం ద్వారా అవి నోటి పరిశుభ్రతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఇది సహజమైన మౌత్ ఫ్రెషనర్ లా పని చేస్తుంది.


మీ ఆహారంలో తమలపాకులను ఎలా జోడించాలి

తలపాకు , కొబ్బరి..

ఆరోగ్యకరమైన, జీర్ణక్రియను పెంచే చిరుతిండి కోసం తురిమిన కొబ్బరి, బెల్లం, ఏలకులతో తాజా తమలపాకులను చుట్టి పాన్ లా తినొచ్చు.

తలపాకు టీ

తలపాకులతో తయారు చేసిన వెచ్చని, టీ జీర్ణక్రియకు సహాయపడుతుంది. నోటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది, మధుమేహాన్ని నిర్వహించడంలో సహాయపడుతుంది. భోజనం తర్వాత తాగితే కడుపు మంచి అనుభూతిని కలిగిస్తుంది.

the uterus: గర్భాశయం అనే అవయవం ఉంటేనే మహిళలు తల్లులు కాగలరు. ఈ గర్భాశయం ఆరోగ్యం చాలా ముఖ్యమైన విషయం. గర్భాశయంలో ఏదైనా సమస్య ఉంటే, అది ఋతు చక్రంపై ప్రభావం చూపుతుంది.

 గర్భాశయం అనే అవయవం ఉంటేనే మహిళలు తల్లులు కాగలరు. ఈ గర్భాశయం ఆరోగ్యం చాలా ముఖ్యమైన విషయం. గర్భాశయంలో ఏదైనా సమస్య ఉంటే, అది ఋతు చక్రంపై ప్రభావం చూపుతుంది.




అదేవిధంగా, మీరు గర్భధారణలో ఆలస్యం లేదా గర్భం దాల్చలేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు.

నేటి కాలంలో మహిళలు గర్భాశయానికి సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. గర్భాశయ ప్రోలాప్స్ అనేది సిస్ట్‌లు, గర్భాశయ క్యాన్సర్, అండాశయ వైఫల్యం మరియు అండాశయ వైఫల్యం వంటి అత్యంత సాధారణ గర్భాశయ సమస్యలలో ఒకటి.

గర్భాశయ ప్రోలాప్స్ అంటే స్త్రీ గర్భాశయం ఆమె యోని వైపు దిగే ప్రక్రియ. స్త్రీ గర్భాశయం అన్ని దిశలలో సంకోచించే మరియు విస్తరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ గర్భాశయం దాని అసలు స్థానం నుండి దిగే ప్రక్రియను గర్భాశయ ప్రోలాప్స్ అంటారు.


గర్భాశయ అటోనీ అనే ఈ సమస్యను అందరు మహిళలు ఎదుర్కోరు. ఇది రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలలో మరియు 50 ఏళ్లు పైబడిన స్త్రీలలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.


గర్భాశయ ప్రోలాప్స్ ప్రమాదం ఎవరికి ఉంది?

1) 50 ఏళ్లు పైబడిన మహిళలు

2) ఊబకాయం ఉన్న స్త్రీలు

3) బలహీనమైన గర్భాశయం ఉన్న స్త్రీలు

ఈ గర్భాశయ ప్రోలాప్స్ కారణంగా, మహిళలు గర్భాశయ శస్త్రచికిత్స చేయించుకోవలసి వస్తుంది.

గర్భాశయ చీలిక యొక్క లక్షణాలు:

1) గర్భాశయం చుట్టూ ఉన్న కండరాలు బలహీనపడటం

2) కిడ్నీ సమస్య

3) తరచుగా మూత్రవిసర్జన

4) దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మూత్రం కారడం

5) తుంటి నొప్పి

6) అన్ని వేళలా తెల్లగా ఉండటం

7) బలమైన వాసనతో తెల్లటి ఉత్సర్గ

8) స్త్రీ జననేంద్రియాలు పొడిబారడం

9) జననేంద్రియ దురద మరియు పుండ్లు

కొంతమందికి గర్భాశయ ప్రోలాప్స్ కారణంగా సంభోగం సమయంలో అధిక రక్తస్రావం మరియు నొప్పి రావచ్చు. తరువాత, వారు మూత్ర విసర్జన మరియు మల విసర్జన చేయడంలో ఇబ్బందిని అనుభవించవచ్చు. పైన పేర్కొన్న లక్షణాలు ఉంటే, భయపడవద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన పరిష్కారం పొందండి. అదేవిధంగా, నలభై ఏళ్లు పైబడిన వారు గర్భాశయ పరీక్ష చేయించుకోవడం మంచిది.

విటమిన్-డి.. దీనిని సూర్యరశ్మి విటమిన్ అని కూడా పిలుస్తారు.. విటమిన్-డి మన శరీరానికి మాత్రమే కాదు, రోగనిరోధక శక్తికి కూడా ముఖ్యమైనది. విటమిన్ డి సహాయంతో ఎముక వ్యాధులను నివారించవచ్చు.

 విటమిన్-డి.. దీనిని సూర్యరశ్మి విటమిన్ అని కూడా పిలుస్తారు.. విటమిన్-డి మన శరీరానికి మాత్రమే కాదు, రోగనిరోధక శక్తికి కూడా ముఖ్యమైనది. విటమిన్ డి సహాయంతో ఎముక వ్యాధులను నివారించవచ్చు.

VITAMIN-D
విటమిన్ డి కండరాలకు కూడా అవసరం. శరీరంలో శక్తి వనరులను పెంచడంలో కూడా ముఖ్యమైనది. ఈ విటమిన్ అత్యంత అవసరమైన విటమిన్లలో ఒకటి. ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక వ్యాధులను నివారించడంలో కూడా సహాయపడుతుంది. ఈ విటమిన్ వృద్ధులలో పడిపోవడం, పగుళ్లను తగ్గించడంలో, కండరాల పనితీరును నిర్వహించడంలో కూడా సహాయపడుతుంది. ఈ పోషకం అలసటను తొలగించి మీకు తగినంత శక్తిని అందిస్తుంది.

విటమిన్-డి లోపం శరీరంపై అత్యధిక ప్రభావాన్ని చూపుతుందని వైద్యులు అంటున్నారు. దీని లోపం వల్ల మీరు ఎల్లప్పుడూ అలసిపోయినట్లు, బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే, కొంత సమయం ఎండలో ఉండటం, సూర్యరశ్మి తీసుకోవడం ద్వారా విటమిన్ డీ లోపాన్ని భర్తీ చేయవచ్చు. కానీ, కొన్నిసార్లు కొంతమందికి ఈ విటమిన్ లోపం వల్ల వారు సప్లిమెంట్లను ఆశ్రయించాల్సి వస్తుంది. శరీరంలో శక్తి వనరులను పెంచడానికి, మీరు సప్లిమెంట్లకు బదులుగా కొన్నింటిని తినడం ప్రారంభించాలి. 40 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారిలో దీని లోపం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి, వారు సప్లిమెంట్లు తీసుకోవచ్చు.


ఈ ఆహారాలు అద్భుతాలు చేస్తాయి:

1. పాల ఆహారాలు- వీలైనంత ఎక్కువగా పాలు, మొక్కల ఆధారిత పాలను తీసుకోండి. పెరుగు, జున్ను, మజ్జిగ తాగడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. మొక్కల ఆధారిత పాలలో, మీరు బాదం, కొబ్బరి, ఓట్స్ పాలు తాగవచ్చు.

2. కొవ్వు చేపలు – సార్డినెస్, సాల్మన్, మాకేరెల్, అల్బాకోర్ చేపలలో తగినంత మొత్తంలో ఒమేగా-3 ఉంటుంది. ఇది విటమిన్ డి సహజ వనరు.

3. నారింజ రసం – విటమిన్ డి కోసం, మీరు రోజూ నారింజ జ్యూస్ కూడా తాగాలి. అలాగే, మీరు క్యారెట్ జ్యూస్ తాగవచ్చు.

4. గుల్లలు- సముద్ర ఆహారం విటమిన్ డి కి మంచి మూలం. మీరు నాన్-వెజ్ తింటే, మీరు గుల్లలు కూడా తినవచ్చు.

5. గుడ్డు- ప్రోటీన్‌తో పాటు, గుడ్లలో విటమిన్ డి కూడా మంచి మొత్తంలో ఉంటుంది. దాని పసుపు భాగాన్ని తినడం వల్ల శరీరంలో విటమిన్ డి లోపాన్ని తగ్గించుకోవచ్చు. కొన్ని రకాల పుట్టగొడుగులు సహజంగా విటమిన్ డి కలిగి ఉంటాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)


tulasi tree holy blesi:ఇక్కడ చాలా పవిత్రమైన తులసి మొక్కను పెంచని వారు ఎవరూ ఉండరు. కొంతమంది వాటిని దుకాణాల నుండి కొనడం ద్వారా లేదా ఇతరుల ఇళ్ల నుండి కొనడం ద్వారా తమ ఇళ్లలో పెంచుకుంటారు.

 ఇక్కడ చాలా పవిత్రమైన తులసి మొక్కను పెంచని వారు ఎవరూ ఉండరు. కొంతమంది వాటిని దుకాణాల నుండి కొనడం ద్వారా లేదా ఇతరుల ఇళ్ల నుండి కొనడం ద్వారా తమ ఇళ్లలో పెంచుకుంటారు.

tulasi

మన ఇళ్లలో తులసి మొక్కను పెంచడం వల్ల దైవిక తేజస్సు మరియు మనశ్శాంతి లభిస్తుంది. ఇది కుటుంబానికి సానుకూల శక్తిని కూడా వ్యాపింపజేస్తుంది. మన ఇళ్లలో తులసి మఠాన్ని సరైన దిశలో ఉంచి పూజించడం ద్వారా, వ్యాధి లేని జీవితం, వృత్తిపరమైన పురోగతి, ఆర్థిక ప్రవాహం మరియు మనశ్శాంతి వంటి అన్ని ప్రయోజనాలను పొందవచ్చు.


వాస్తు సమస్యల కారణంగా మా ఇళ్లలో కొన్నింటిని కూల్చివేసి, కొత్త ఇళ్లను నిర్మించాల్సి ఉంది. చాలా మంది ఇలా చేయాలి, ఇలా చేయాలి అని అంటారు. కానీ తులసి మొక్కను సరైన దిశలో ఉంచి దీపం వెలిగించి పూజించడం వల్ల అన్ని రకాల వాస్తు దోషాలు తొలగిపోతాయి. తూర్పు మరియు ఈశాన్య దిశలలో తులసి మొక్కను పెంచడం సరైన దిశ.


తులసి లేకుండా ఏ దేవత పూజ కూడా పూర్తి కాదు. అటువంటి ప్రత్యేకమైన తులసి మొక్కను మన ఇంట్లో పెంచుకుని, మంగళ, శుక్రవారాల్లో దీపాలు వెలిగించి పూజించడం ద్వారా మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. తులసి మొక్కలు కొన్ని ఇళ్లలో, మనం స్వయంగా కొన్నా లేదా విత్తనాల నుండి పెంచినా, అవి స్వయంగా మొలకెత్తుతూ పెరుగుతాయి. చాలా మొక్కలు పెరుగుతూనే ఉంటాయి కాబట్టి, మీరు వాటిని పెరికివేసి పారవేసినా, తులసి మొక్కలు మళ్లీ మళ్లీ మొలకెత్తుతూనే ఉంటాయి.


తులసి మొక్కలు ఈ విధంగా మొలకెత్తుతాయి మరియు సహజంగా పెరుగుతాయి అంటే ఆ కుటుంబం లక్ష్మీ దేవి ఆశీస్సులతో నిండి ఉందని అర్థం. ఇది ప్రతికూల శక్తులు, ప్రతికూల శక్తులు, కుటుంబంలో శాంతి లేకపోవడం, పేదరికం అన్నీ తొలగిపోతాయనడానికి సంకేతం. ఆర్థికంగా మరియు ఆర్థికంగా మంచి పురోగతి సాధించే అవకాశం ఉంటుంది.


అంటే ఆ కుటుంబంలో ఆనందం మరియు శాంతి స్థిరంగా ఉంటాయని, శుభ సంఘటనలు జరిగే అవకాశాలు వస్తున్నాయని అర్థం. కాబట్టి, మీ ఇంట్లో తులసి మొక్క ఆకస్మికంగా పెరుగుతుంటే, దాని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. మనం ప్రతిరోజూ చేయలేకపోయినా, మంగళ, శుక్రవారాల్లో తులసి మొక్క ముందు ఒక చిన్న కోలం వేసి దీపం వెలిగించండి. జరిగే అద్భుతాన్ని మీరే చూస్తారు.


లక్ష్మీదేవి తులసి ద్వారా మన ఇళ్లకు స్వయంచాలకంగా వచ్చింది కాబట్టి, మనం తులసి మొక్కను పవిత్రత మరియు భక్తితో పూజించాలి. మంగళ, శుక్రవారాల్లో ఈ తులసి మొక్కపై దీపం వెలిగించి మన ప్రార్థనలు హృదయపూర్వకంగా చేస్తే, మన కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ మనం కొన్న తులసి మొక్క లేదా దానంతట అదే మొలకెత్తిన తులసి మొక్క అకస్మాత్తుగా పెరగడం ఆగిపోతే లేదా వాడిపోతే, మన ఇంటికి ఏదో ఒక రకమైన దురదృష్టం రాబోతోందని అర్థం.


మొక్క వాడిపోవడం ప్రారంభిస్తే, చింతించకండి, మీరు సోమవారం లేదా శుక్రవారం దానిని తీసివేసి కొత్తది కొనవచ్చు. తులసి మొక్కను ఉంచే ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలి. మొక్క దగ్గర చీపుర్లు, చెప్పులు మొదలైనవి ఉంచవద్దు.

Copper Cleaning: రాగి, ఇత్తడి పాత్రలను వీటితో క్లీన్ చేస్తే.. క్షణాల్లోనే మెరిసిపోతాయ్

 

HelthTips

Copper Cleaning: రాగి, ఇత్తడి వస్తువులు చాలా మంది ఇళ్లలో వాడుతుంటారు. కాలక్రమేణా వాటి వినియోగం చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే రాగి, ఇత్తడి పాత్రలు తొందరగా రంగు మారుతుంటాయి.

అంతే కాకుండా వీటి మెరుపు కూడా కోల్పోతాయి.


రాగి, ఇత్తడితో తయారు చేయబడిన పాత్రలు, అలంకరణ వస్తువులు , పరికరాలకు సంరక్షణ అవసరం. రాగి , ఇత్తడి పాత్రలను మెరిపించడానికి తప్పకుండా కొన్ని రకాల హోం రెమెడీస్ ఉపయోగించడం ద్వారా వాటి సహజ మెరుపును తిరిగి పెంచవచ్చు.


మీరు కూడా మీ రాగి , ఇత్తడి వస్తువులపై ఉన్న మెరుపును కొనసాగించాలనుకుంటే కొన్ని సులభమైన, ప్రభావవంతమైన పద్ధతులను అనుసరించాలి. మీరు ఎటువంటి రసాయనాలను ఉపయోగించకుండానే వీటితో మీ పాత్రలను మెరిసేలా చేయవచ్చు.


నిమ్మకాయ, ఉప్పు:

నిమ్మకాయ , ఉప్పు మిశ్రమం రాగి, ఇత్తడి వస్తువులను తెల్లగా మారుస్తాయి. ఎంత నల్ల రంగులోకి మారిన వస్తువులైనా వీటిని వాడటం వల్ల మెరిసిపోతాయి. నిమ్మరసంతో ఉప్పు కలిపి, ఒక క్లాత్ తో పాత్రలపై రుద్దండి. ఈ మిశ్రమం పాత్రలపై ఉన్న తుప్పు, ధూళిని శుభ్రం చేయడానికి , వాటిని మెరిసేలా చేయడానికి సహాయపడుతుంది. దీని తరువాత పొడి క్లాత్ ఉపయోగించి పాలిష్ చేయండి.


వెనిగర్, బేకింగ్ సోడా:

ఇందుకోసం ఒక చిన్న గిన్నెలో కాస్త వెనిగర్ , తగినంత బేకింగ్ సోడా కలిపి పేస్ట్ లా చేయండి. దీన్ని రాగి లేదా ఇత్తడి వస్తువులపై పూసి 10-15 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత తడిగా ఉన్న క్లాత్ తో బాగా తుడిచి ఆరబెట్టండి. ఈ పద్ధతి లోహం యొక్క మెరుపును తిరిగి తెస్తుంది.


టమాటో పేస్ట్‌ వాడండి:

టమాటో రసం రాగి , ఇత్తడి వస్తువులను మెరిపించడానికి ఒక గొప్ప సహజ నివారణ. టమోటా రసాన్ని బ్రష్ సహాయంతో తీసుకుని రాగి, ఇత్తడి పాత్రలపై రుద్దండి. టమాటో రసం లోహం నుండి తుప్పు , ధూళిని తొలగించి దానిని మెరిసేలా చేస్తుంది. అంతే కాకుండా కొత్త వాటిలా కూడా మెరిసేలా చేస్తుంది.


ముల్తానీ మిట్టితో శుభ్రపరచడం:

ముల్తానీ మిట్టిని పేస్ట్ చేసి రాగి లేదా ఇత్తడి వస్తువులపై అప్లై చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇది కూడా ప్రభావవంతమైన పద్ధతి. ముల్తానీ మిట్టిలో కొంచెం నీరు కలిపి పేస్ట్ లా చేసి రంగు మారిన వస్తువులపై మీద అప్లై చేయండి. 15-20 నిమిషాల తర్వాత దానిని బ్రష్ సహాయంతో తేలికగా రుద్దడం ద్వారా శుభ్రం చేయండి. ఇది పాత్రల యొక్క మెరుపును తిరిగి తీసుకు రావడంలో సహాయపడుతుంది . అంతే కాకుండా ఉపరితలాన్ని గీతలు పడకుండా కాపాడుతుంది.


వెనిగర్, పిండి మిశ్రమం:

వెనిగర్, ఏదైనా పిండి మిశ్రమం వాడి రాగి-ఇత్తడి వస్తువులను మెరిసేలా చేయవచ్చు. ఎదైనా పిండిని వెనిగర్ తో కలిపి పేస్ట్ లా చేసి, దానిని రాగి పాత్రలపై అప్లై చేసి 10 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత తడి క్లాత్ తో శుభ్రం చేయండి. ఈ మిశ్రమం లోహంపై పేరుకుపోయిన మురికిని తొలగించి మెరుపును అందిస్తుంది.


Also Read: వీళ్లు ఖర్జూరం అస్సలు తినకూడదు.. తెలుసా ?


చక్కటి పాలిషింగ్ పౌడర్ వాడకం:

రాగి , ఇత్తడి వస్తువులను త్వరగ , సులభంగా మెరిసేలా చేసే పాలిషింగ్ పౌడర్లు మార్కెట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ పొడులను లోహపు ఉపరితలంపై తేలికగా రుద్ది పాలిష్ చేయండి. ఇది వస్తువులను మెరిసే మెరుపును ఇస్తుంది . అంతే కాకుండా దానిపై ఏర్పడిన తుప్పును కూడా తొలగిస్తుంది.


The post Copper Cleaning: రాగి, ఇత్తడి పాత్రలను వీటితో క్లీన్ చేస్తే.. క్షణాల్లోనే మెరిసిపోతాయ్ appeared first on .

Beauty Tips with Raw milk: ఇంట్లోనే పచ్చి పాలను ముఖానికి అప్లై చేయడం వల్ల ఈ అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి

 పచ్చి పాలు ప్రతి ఇంట్లో కచ్చితంగా ఉండాల్సిందే. ఆ పాలను మరగబెట్టి టీ లేదా కాఫీ చేసుకున్నకే ఎవరైనా తమ రోజును ప్రారంభిస్తారు. కేవలం తాగడానికి మాత్రమే కాదు అందాన్ని పెంచుకోవడానికి కూడా పాలను ఉపయోగించవచ్చు.

MILK

కాచి చల్లార్చిన పాలకంటే పచ్చిపాలు చర్మంపై అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తాయి. పచ్చి పాలను ప్రతిరోజు ముఖానికి అప్లై చేయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకోండి.


పచ్చిపాలు అంటే ఏమిటి?

పచ్చిపాలు అంటే గేదె లేదా ఆవు నుంచి తీసిన పాలు. ఆ పాలను నేరుగా ముఖానికి రాయడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. బయట దొరికే పాల ప్యాకెట్లలో ఉండే పాలు... పచ్చిపాలు అనుకుంటారు ఎంతోమంది. కానీ అవి పాశ్చరైజేషన్ ప్రక్రియకు గురైన తర్వాతే ఆ ప్యాకెట్లలో ప్యాక్ చేస్తారు. కాబట్టి అవి పచ్చి పాల జాబితాలోకి రావు. పచ్చిపాలు ముఖానికి రాయడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.

నేరుగా గేదె లేదా ఆవు నుంచి తీసిన పాలను తీసుకొని ముఖానికి అప్లై చేయడం వల్ల మీరు కోల్పోయిన మెరుపు తిరిగి చర్మానికి వస్తుంది. దీనిలో లాక్టిక్ ఆమ్లం, ఇనుము, మరెన్నో ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎక్స్పోలియేటింగ్ ఏజెంట్ లాగా పని చేస్తాయి. చర్మంపై ఉన్న మృత కణాలను తొలగిస్తాయి. కాంతివంతమైన ప్రకాశవంతమైన చర్మ రంగును ఇస్తాయి.


జిడ్డు చర్మంకలవారికి

జిడ్డు చర్మంతో బాధపడుతున్న వారికి పచ్చిపాలు మంచి ఎంపిక అని చెప్పాలి. జిడ్డు చర్మం గలవారి చర్మ రంధ్రాలలో అధిక నూనె దాగి ఉంటుంది. ఈ నూనెను తొలగించి చర్మానికి మెరుపుని ఇచ్చేందుకు పచ్చిపాలు ఉపయోగపడతాయి. ఈ పాలల్లో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి చర్మం కూడా త్వరగా తేమవంతంగా మారుతుంది. జిడ్డు తొలగిపోతుంది.

కొందరి ముఖంపై నల్లటి మచ్చలు ఇబ్బందికరంగా మారుతాయి. అలాంటివారు పాలను చర్మంపై అప్లై చేయడం ద్వారా ఆ మచ్చలను పోగొట్టుకోవచ్చు. కొందరికి మొటిమలు వచ్చి తగ్గాక నల్లటి మచ్చలు ఏర్పడతాయి. వాటిని కూడా పచ్చిపాలు తొలగిస్తాయి. పచ్చి పాలలో కొవ్వులు, నీరు, విటమిన్ ఏ, కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ కూడా మృత కణాలను తొలగిస్తాయి. మీ ముఖాన్ని మృదువుగా, తేమవంతంగా చేస్తాయి. సహజమైన మెరుపును చర్మానికి ఇస్తాయి.


మొటిమలు సమస్యకు

ఎవరికైతే మొటిమలు అధికంగా వస్తున్నాయో వారు ఈ పచ్చి పాలను ముఖానికి అప్లై చేయడం అలవాటుగా మార్చుకోండి. విటమిన్ ఏ తో నిండిన ఈ పాలు చర్మ రోగనిరోధక ప్రతిస్పందనను పెంచుతాయి. దీనివల్ల మొటిమలు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. ఈ పాలు చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తాయి. కాబట్టి మొటిమలు తక్కువగా వస్తాయి.

పచ్చిపాలలో ఇనుము అధికంగా ఉంటుంది. కాబట్టి చర్మం యవ్వనంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. దీనిలో ఉండే ముఖ్యమైన ప్రోటీన్లు చర్మాన్ని అందంగా కనిపించేలా చేస్తాయి. వాటికి పోషణను అందిస్తాయి. ఈ పాలలో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి చర్మం కూడా ప్రకాశవంతంగా మారుతుంది. సహజమైన మెరుపును పొందుతుంది.

పచ్చిపాలు పాశ్చరైజేషన్ ప్రక్రియకు గురికావు. కాబట్టి కొంతమందిలో చర్మ ఇన్ఫెక్షన్లు, చికాకు కలగవచ్చు. అంటే సున్నితమైన చర్మం కలవారికి పచ్చిపాలు పడకపోవచ్చు. కాబట్టి ముందుగా టెస్ట్ చేసుకోండి. మీకు పచ్చిపాలను రాసిన తర్వాత మంటగా, దురదగా అనిపిస్తే మీకు ఆ పాలు పడడం లేదని అర్థం. కాబట్టి అలాంటివారు పచ్చిపాలను వినియోగించవద్దు.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)


Haritha Chappa

Those who eat these foods in their 20s will have signs of old age in their 60s.. Be careful!!:ఈ ఫుడ్స్ తిన్నారో 20లో వాళ్లకి 60 ఏళ్ల వృద్ధాప్య లక్షణాలు.. జాగ్రత్త మరి!

Those who eat these foods in their 20s will have signs of old age in their 60s.. Be careful!!:ఈ ఫుడ్స్ తిన్నారో 20లో వాళ్లకి 60 ఏళ్ల వృద్ధాప్య లక్షణాలు.. జాగ్రత్త మరి!

helth tips


కొంతమందికి చిన్న వయస్సు లో  ఉన్నా చూడడానికి చాల పెద్దవారు ల కనిపిస్తారు. ఈ వృద్ధాప్యనికి  లక్షణాలకు అనేక కారణాలు ఉన్నాయి. అయితే వాటిల్లో మనం తీసుకునే ఆహారాలు కూడా ఉన్నాయి.

ఇ  ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల వృద్ధాప్య ప్రక్రియ వేగవంతం అవుతుంది . యవ్వనంగా కనిపించకుండా చేస్తాయి. ఈ ఆహారాలు శరీరంలో మంటను పెంచడం, కణాలను దెబ్బతీయడం , వృద్ధాప్య సంబంధిత వ్యాధులకు దారితీయడం వంటి అనేక విధాలుగా పనిచేస్తాయి. వృద్ధాప్య లక్షణాలను పెంచే కొన్ని ముఖ్యమైన ఆహారాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..


చక్కెర అధికంగా ఉండే ఆహారాలు,పానీయాలు:

చక్కెరలు ఎక్కువగా ఉండే ఆహారాలు, ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు , పానీయాలు వృద్ధాప్యానికి ప్రధాన కారణం. చక్కెరలు శరీరంలో గ్లైకేషన్ అనే ప్రక్రియను ప్రేరేపిస్తాయి. ఈ ప్రక్రియలో చక్కెరలు ప్రోటీన్లతో కలిసిపోయి ఏజీఈలు (అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్) ఏర్పడటానికి కారణమవుతాయి. ఈ ఏజీఈలు చర్మం యొక్క స్థితిస్థాపకతను తగ్గించి, ముడతలు, చర్మం వదులుగా మారడానికి దారితీస్తాయి. అంతేకాకుండా, చక్కెరలు అధికంగా ఉండే ఆహారాలు శరీరంలో మంటను పెంచుతాయి, ఇది వృద్ధాప్య సంకేతాలను మరింత తీవ్రతరం చేస్తుంది. ఉదాహరణకు, సోడాలు, జ్యూస్‌లు, స్వీట్లు, కేకులు, కుకీలు , ప్రాసెస్ చేసిన స్నాక్స్ వంటివి వృద్ధాప్య లక్షణాలను పెంచుతాయి.

పాలల్లో ఇవి నానబెట్టి తీసుకుంటే ఊహించని శక్తి.. అసలు సంగతి తెలిస్తే!

ప్రాసెస్ చేసిన ఆహారాలు:

ప్రాసెస్ చేసిన ఆహారాలలో సాధారణంగా అధిక మొత్తంలో ఉప్పు, చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు , రసాయన సంకలనాలు ఉంటాయి. ఈ ఆహారాలు శరీరంలో మంటను పెంచుతాయి. కణాల నష్టానికి కారణమవుతాయి. ఇవి చర్మం యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి, ముడతలు , ఇతర వృద్ధాప్య సంకేతాలను పెంచుతాయి. ప్రాసెస్ చేసిన మాంసాలు, రెడీ-టు-ఈట్ మీల్స్, చిప్స్, ఫాస్ట్ ఫుడ్ వంటివి వృద్ధాప్య లక్షణాలను వేగవంతం చేసే ఆహారాలలో ముఖ్యమైనవి.

వేయించిన ఆహారాలు:

వేయించిన ఆహారాలలో ట్రాన్స్ ఫ్యాట్స్, అధిక మొత్తంలో సంతృప్త కొవ్వులు ఉంటాయి. ఈ కొవ్వులు శరీరంలో మంటను పెంచుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి కారణమవుతాయి. వేయించిన ఆహారాలు ఫ్రీ రాడికల్స్‌ను కూడా ఉత్పత్తి చేస్తాయి, ఇవి కణాలను దెబ్బతీసి వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తాయి. ఫ్రైడ్ చికెన్, ఫ్రెంచ్ ఫ్రైస్, డోనట్స్, ఇతర డీప్ ఫ్రైడ్ స్నాక్స్ వంటివి వృద్ధాప్య లక్షణాలను పెంచే ఆహారాలకు ఉదాహరణలు.

ఎక్కువగా  ఆల్కహాల్ తీసుకోవడం :

అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది, ఇది చర్మాన్ని పొడిగా , ముడతలుగా చేస్తుంది. ఆల్కహాల్ కాలేయానికి కూడా హానికరం, ఇది శరీరంలోని విష పదార్థాలను తొలగించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఇది చర్మం , శరీర ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.


శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు:

తెల్ల బియ్యం, మైదా పిండితో చేసిన ఆహారాలు , తెల్ల బ్రెడ్ వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. ఇది గ్లైకేషన్ ప్రక్రియను ప్రేరేపిస్తుంది, వృద్ధాప్య లక్షణాలను పెంచుతుంది. వీటి బదులుగా, తృణధాన్యాలు , సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు.

ట్రాన్స్ ఫ్యాట్స్:

ట్రాన్స్ ఫ్యాట్స్ ప్రాసెస్ చేసిన ఆహారాలు, వేయించిన ఆహారాలు, కొన్ని రకాల మార్గారిన్‌లలో కనిపిస్తాయి. ఇవి శరీరంలో మంటను పెంచుతాయి , గుండె జబ్బులు , ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఇవి చర్మం యొక్క స్థితిస్థాపకతను కూడా తగ్గిస్తాయి, ముడతలు, వృద్ధాప్య సంకేతాలను పెంచుతాయి.

వృద్ధాప్య సంకేతాలను తగ్గించడానికి, ఆరోగ్యకరమైన యవ్వన రూపాన్ని పొందడానికి, ఈ ఆహారాలను వీలైనంత వరకు తగ్గించడం లేదా పూర్తిగా నివారించడం చాలా ముఖ్యం. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు వంటి పోషకమైన ఆహారాలను తీసుకోవడం వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదించడంలో సహాయపడుతుంది.

Lemons: నిమ్మకాయలు నిత్యం తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త ?

 Lemons: నిమ్మకాయలు నిత్యం తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త ?

HelthTips
Lemon
Lemons: తేనెలో నిమ్మరసం కలిపి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. పులిహోరలో వాడినట్లయితే రుచి చాలా బాగుంటుంది. నిమ్మ పచ్చళ్ళు, వంటకాలు, జ్యూస్ లు ఏది చేసినా చాలా బాగుంటాయి.

ఇందులో విటమిన్ సి, ఆంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగపడేది. విటమిన్ సి అందించిన వాటిలో నిమ్మ పండు వరసలో ఉంటుంది. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Health Benefits of Lemon

అంతే కాకుండా ఇందులో విటమిన్లు అధికంగా ఉంటాయి. నిమ్మకాయలో రాగి, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, జింక్, ఖనిజాలు అధికంగా ఉంటాయి. దీనిని ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ప్రతిరోజు ఆహారంలో ఒక నిమ్మకాయను చేర్చినట్లయితే శరీరానికి కావాల్సిన అన్ని విటమిన్లు అందుతాయి.

ప్రతిరోజు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం ఆరోగ్యానికి చాలా మేలును చేస్తుంది. భోజనం తిన్న వెంటనే నిమ్మకాయ తింటే జీర్ణ క్రియ వేగంగా మెరుగుపడుతుంది. ఇది చర్మానికి కూడా ఎంతో మేలును కలిగిస్తుంది. నిమ్మకాయలో పెక్టిక్ ఉంటుంది. నిమ్మరసం గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే బరువు సులభంగా తగ్గుతారు. ఇందులో సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు పంపేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

2.26.2025

2012వ సంవత్సరం గురించి మీకు గుర్తుందా. అంతకు ముందే ఆ ఏడాదిలో యుగాంతం వస్తుందని భయపెట్టారు. ఎందుకంటే మయన్ల క్యాలెండర్ 2012 వరకే ఉందని, కనుక ప్రపంచం కూడా ఆ ఏడాదిలో అంతం అవుతుందని అంతకు ముందు నుంచే చెబుతూ వచ్చారు.

 2012వ సంవత్సరం గురించి మీకు గుర్తుందా. అంతకు ముందే ఆ ఏడాదిలో యుగాంతం వస్తుందని భయపెట్టారు. ఎందుకంటే మయన్ల క్యాలెండర్ 2012 వరకే ఉందని, కనుక ప్రపంచం కూడా ఆ ఏడాదిలో అంతం అవుతుందని అంతకు ముందు నుంచే చెబుతూ వచ్చారు.

కానీఆ ఏడాది దాటి కూడా చాలా ఏళ్లపోయింది. అయినప్పటికీ ప్రపంచం అంతం కాలేదు. అయితే కరోనా వచ్చినప్పటినుంచి ఇలాంటి పుకార్లు మళ్లీ ఎక్కువైపోయాయి. ప్రపంచం కొద్ది రోజుల్లో అంతం అవుతుందని అడపా దడపా చాలా మంది చెబుతున్నారు. కానీ అవేవీ నిజం కావడం లేదు. ఇక తాజాగా ఓ వ్యక్తి తాను టైమ్ ట్రావెల్ చేశానని, కాలంలో ప్రయాణించి వచ్చానని, 2025లో పలు ప్రకృతి విపత్తులు సంభవించి ప్రపంచం అంతమై పోతుందని చెబుతున్నాడు. ఇంతకీ అతను ఎవరు, ఏం చెబుతున్నాడు.. అంటే..



అమెరికాకు చెందిన ఎల్విస్ థాంప్సన్ అనే వ్యక్తి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అందులో అతను మాట్లాడుతూ.. తాను కాలంలో ప్రయాణం చేసి వచ్చానని అన్నాడు. 2025లో పలు ఉత్పాతాలు ఏర్పడబోతున్నాయని హెచ్చరించాడు. 24 కిలోమీటర్ల వ్యాసం కలిగిన భారీ టోర్నడో ఒకటి గంటకు 1046 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఏప్రిల్ 6వ తేదీన అమెరికాలోని ఓక్లహామాను చుట్టు ముట్టి అందరినీ సర్వనాశనం చేస్తుందని చెప్పడు. అలాగే మే 27వ తేదీన అమెరికా సివిల్ వార్ మొదలవుతుందని, దీంతో ప్రపంచ వ్యాప్తంగా అమెరికాతో సహా అందరూ అణ్వాయుధాలను ఉపయోగిస్తారని, మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని చెప్పాడు.

సెప్టెంబర్ 1వ తేదీన చాంపియన్ అనే పేరున్న ఒక ఏలియన్ వచ్చి 12వేల మంది మనుషులను సురక్షితంగా ఇంకో గ్రహానికి తీసుకెళ్తుందని చెప్పాడు. సెప్టెంబర్ 19వ తేదీన అమెరికా తీర ప్రాంతంలో భారీ తుఫాను వచ్చి అంతా కొట్టుకుపోతుందని, నవంబర్ 3న నీలి తిమింగలం కన్నా 6 రెట్లు పెద్దదిగా ఉండే ఒక జీవి పసిఫిక్ మహా సముద్రం నుంచి పుట్టుకు వస్తుందని, దాని పేరు సెరీన్ క్రౌన్ అని చెప్పాడు. దీంతో భూమి అంతం అవుతుందని అన్నాడు. అయితే ఎల్విస్ చెబుతున్న మాటలను చాలా మంది కొట్టి పారేస్తున్నారు. అతని వీడియోను సేవ్ చేసుకున్నామని, అతను చెప్పినవి జరగకపోతే లీగల్‌గా అతనిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇక కొందరు అతను చెప్పినవన్నీ నిజమే అయి ఉండవచ్చని అంటున్నారు.


 మరి మీరు దీనిపై మీ కామెంట్ ఏంటో తెలియచేయగలరు. 

ఆరోగ్య సమస్యలున్నవారు బీట్‌రూట్ తినకూడదు. తింటే ఏమవుతుంది. దీని వల్ల వచ్చే సమస్యలు ఏంటి పూర్తి వివరాలు తెలుసుకోండి.

అసలు ఏ ఆరోగ్య సమస్యలున్నవారు బీట్‌రూట్ తినకూడదు. తింటే ఏమవుతుంది. దీని వల్ల వచ్చే సమస్యలు ఏంటి పూర్తి వివరాలు తెలుసుకోండి.

ప్రెగ్నెంట్స్

pregnancy

​ప్రెగ్నెన్సీ టైమ్‌లో బీట్‌రూట్ తినడం మంచిది. అయితే, ఎక్కువ మాత్రం తినకూడదు. తక్కువ పరిమాణంలోనే తీసుకోవాలని గుర్తుంచుకోవాలి. డాక్టర్ సలహాతో ఎంత మోతాదులో తినొచ్చో తెలుసుకుని అంతే పరిమాణంలో తీసుకోవాలి. ముఖ్యంగా దీనిని తీసుకోవడం వల్ల గర్భిణీలలో నీరసం, తలనొప్పి, కళ్ళు తిరగడం వంటి సమస్యలొస్తాయి.

పిల్లలకి

child

మంచి కూరగాయలు అని చాలా మంది పిల్లలకి తినిపిస్తుంటారు. అయితే, నెలల వయసున్న పిల్లలకి బీట్‌రూట్ పెట్టడం అసలు మంచిది కాదు. ఇందులో హై నైట్రేట్ ఉంటుంది. ఇది నైట్రేట్ పాయిజనింగ్‌లా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా 3 నెలల పిల్లల అంతేకంటే తక్కువ వయసు ఉన్నవారికి బీట్‌రూట్ అసలే ఇవ్వకూడదని గుర్తుంచుకోండి.

అలర్జీ

infection

ప్రతి ఒక్కరికీ అన్నీ కూరగాయలు పడవు. కొంతమందికి అలర్జీ వంటి సమస్యలు వస్తాయి. బీట్‌రూట్‌ తింటే కొంతమందికి అలర్జీ ఉంటుంది. కొంతమంది ఈ బీట్‌రూట్ ఉడికించేటప్పుడు ఆ వాసనని పీల్చడం వల్ల ఉబ్బసం వంటి సమస్యలొచ్చినట్లుగా కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, ఇది అందరికీ కాదు. కొంతమందికి ఈ సమస్య ఉండొచ్చు. అదే విధంగా, బీట్‌రూట్ తీసుకోవడం వల్ల బ్లోటింగ్, గ్యాస్ వంటి సమస్యలొస్తాయి. కాబట్టి, అజీర్ణ సమస్యలున్నవారు ఈ వెజిటేబుల్‌ని అసలే తీసుకోవద్దు. ముఖ్యంగా ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు.

క్యాన్సర్ ఉన్నవారికి

cancer

బీట్‌రూట్ క్యాన్సర్స్‌కి ముఖ్యంగా, బ్రెస్ట్, లంగ్, కొలన్ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా నిరోధక సామర్థ్యాలను ప్రదర్శిస్తుంది. అయితే, ఇది డాక్టర్ సలహాతోనే తీసుకోవాలి. అలా కాకుండా ఇష్టంగా తీసుకోకూడదు. దీని వల్ల క్యాన్సర్ వంటి సమస్యలు పెరగవు. అదే విధంగా, షుగర్ ఉన్నవారు కూడా బీట్‌రూట్‌ని ఎక్కువగా తీసుకోవద్దని చెబుతున్నారు. వీటి వల్ల షుగర్ లెవల్స్‌పై ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు.

లివర్ ప్రాబ్లమ్స్

liver problem

అదే విధంగా, బీట్‌రూట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్ దెబ్బతింటుందని చెబుతున్నారు. దీనికి కారణం, బీట్‌రూట్‌లో లోహ అయాన్‌లు పేరుకుపోతాయి. అదే విధంగా, కాల్షియం తక్కువగా ఉన్నవారు కూడా బీట్‌రూట్ ఎక్కువగా తీసుకోవద్దని చెబుతున్నారు. లోబీపి సమస్యతో బాధపడేవారు, ఆ సమస్యకి ట్యాబ్లెట్స్ వాడేవారు బీట్‌రూట్ తీసుకోకపోవడమే మంచిది.

కిడ్నీలో రాళ్లు

kidney stone

బీట్‌రూట్‌లో ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడేలా చేస్తుంది. మూత్ర ఆక్సలేట్ విసర్జనని పెంచుతుంది. కాల్షియం ఆక్సలేట్ రాళ్ల పెరిగేలా చేస్తుంది. కాబట్టి, బీట్‌రూట్‌ని తక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు ఉంటే బీట్‌రూట్ జ్యూస్‌ని అసలు తీసుకోకపోవడమే మంచిది.

గమనిక:ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

మన చేతుల్తో చాల పనులు చేస్తూ ఉంటాం. కానీ చేతుల పై క్రిములు మరియు బాక్టీరియా చేరుతుంటాయి. చేతులో కొన్ని సున్నితమైన భాగాల్ని తాకినప్పుడు వాటికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.

మన చేతుల్తో చాల పనులు చేస్తూ ఉంటాం. కానీ చేతుల పై క్రిములు మరియు బాక్టీరియా చేరుతుంటాయి. చేతులో కొన్ని సున్నితమైన భాగాల్ని తాకినప్పుడు వాటికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. 

helth tips caress

మానవ శరీరం ఎంతో ప్రత్యేకమైంది. శరీరంలో ప్రతి భాగం తన పనిని నిర్వరిస్తుంది. అయితే, శరీరంలోని చాలా భాగాల్ని మనం చేతులతో తాకుతుంటాం. అది ఏ భాగమైనా సరే మనకు తెలియకుండానే చేతులతో టచ్ చేస్తుంటాం. అది అలవాటు లేదా పొరపాటు వల్ల కావచ్చు. అయితే, శరీరంలో కొన్ని భాగాలను చేతులతో పదే పదే తాకకూడదు. నిజానికి మన చేతులతో చాలా పనులు చేస్తుంటాం. తెలిసో లేదా తెలియక చాలా వస్తువుల్ని పట్టుకుంటాం. దీంతో చేతులపై క్రిములు, బ్యాక్టీరియా చేరుతుంటాయి. ఈ చేతులతో కొన్ని సున్నితమైన భాగాల్ని తాకినప్పుడు వాటికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చేతులతో శరీరంలోని ఏ భాగాల్ని తాకకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

ముఖం:

శరీరంలో ముఖం చాలా సున్నితంగా ఉంటుంది. మొటిమలు, పిగ్మెంటేషన్, దురద లేదా దదర్లు సమస్యలు రావడానికి కారణం పదే పదే మీరు చేతులతో ముఖంపై తాకుతున్నారని అర్తం. ఇది ఒక కారణం కావచ్చు. నిజానికి చేతులపై చాలా క్రిములు, ధూళి, బ్యాక్టీరియా ఉంటాయి. వీటి కారణంగా ముఖంపై అనేక రకాల చర్మ సమస్యలు వస్తాయి. చేతుల్లో ఉండే సహజ నూనె ముఖం యొక్క రంధ్రాల్ని మూసివేసే ప్రమాదం ఉంది. అందుకే చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుకోవాలనుకుంటే చేతులతో పదే పదే తాకడం మానుకోండి.

చెవులు:

చాలా మంది చెవుల్లో వేళ్లు పెట్టుకోవడం, చేతులతో చెవుల్ని టచ్ చేయడం చేస్తూ ఉంటారు. అయితే, ఈ చిన్న అలవాటు చాలా హానికరం. చెవుల లోపలి భాగాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఇలా చేతుల వేళ్లు పెట్టడం వల్ల ఏదైనా హాని జరిగే ప్రమాదం ఉంది. చేతులపై బ్యాక్టీరియా, దుమ్ము, ధూళి ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ ఇన్ఫెక్షన్ కొన్ని సార్లు గొంతు వరకు వ్యాపించి మరింత ప్రమాదాన్ని కలిగించవచ్చు. అందుకే చేతులతో పదే పదే చెవుల్ని టచ్ చేయకండి.

పెదవులు, నోటి లోపల భాగం

చాలా మందికి తెలియకుండానే చేతులు పెదవులు, నోటి లోపల భాగాలకు వెళుతుంటాయి. తినేటప్పుడు సాధారణంగా మనం చేతుల్ని శుభ్రపర్చుకుంటాం. కానీ, మిగతా సమయాల్లో అంతగా క్లీన్ చేసుకోం. కానీ, నోటిలోకి వేళ్లు పెట్టుకుంటారు. చాలా మంది తిన్న తర్వాత నోటిలో ఇరుక్కున్న ఆహారాన్ని తొలగించడానికి చేతి వేళ్లను ఉపయోగిస్తారు. అయితే, ఈ అలవాటు ఎంత మాత్రం మంచిది కాదు. ఇలా నోటిలో వేళ్లు పెట్టుకోవడం వల్ల బ్యాక్టీరియా, క్రిములు కడుపులోకి చేరే ప్రమాదం పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. ఫుడ్ పాయిజన్, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

కళ్లు:

కళ్ళు మన శరీరంలో చాలా సున్నితమైన భాగం. అందుకే వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది వ్యక్తులు తమ చేతులతో పదే పదే కళ్ళను తాకుతుంటారు. అంతేకాకుండా దురద వల్ల కళ్లను రుద్దుతుంటారు. ఇది మంచి పద్ధతి కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల కళ్లలోకి ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదం పెరుగుతుంది. నిజానికి చాలా కంటి ఇన్ఫెక్షన్లు ఇలా పదే పదే చేతులతో తాకడం వల్ల వస్తాయి.

ముక్కు:

ముక్కులో వేలు పెట్టడం చెడుగా కనిపించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా హానికరం. ముక్కును పదే పదే టచ్ చేసే వ్యక్తులు ఎక్కువగా అనారోగ్యంతో ఉంటారని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. చేతి వేళ్లతో ముక్కును శుభ్రపర్చుకోవడం మానుకోండి. ముక్కును శుభ్రం చేసుకోవలసి వస్తే శుభ్రమైన గుడ్డ లేదా రుమాలు సాయం తీసుకోండి. ఇలా ముక్కులో వేళ్లు పెట్టుకోవడం వల్ల స్టెఫిలోకాకస్ అరియస్ అనే బ్యాక్టీరియా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

మలద్వారం:

చేతులతో మలద్వారాన్ని కూడా టచ్ చేయకూడదంటున్నారు నిపుణులు. దురద పుట్టడం వల్ల లేదా చెమట పట్టడం వల్ల చాలా మంది మలద్వారాన్ని టచ్ చేస్తుంటారు. ఇది చాలా సున్నితమైన ప్రాంతం. చేతులతో మలద్వారాన్ని టచ్ చేయడం ద్వారా చేతులపై బ్యాక్టీరియా వ్యాపించే ప్రమాదం ఉంది. ఆ తర్వాత అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే మలద్వారాన్ని చేతులతో తాకడం మానుకోండి.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.



telangana crime news mother women child killing ఓ తల్లి అమ్మతనానికే అవమానం కలిగించేలా ప్రవర్తించింది. తొమ్మిది నెలలు మోసి కని పెంచుతున్న తల్లే తన బిడ్డల పాలిట మ్యత్యువైంది.

ఓ తల్లి అమ్మతనానికే అవమానం కలిగించేలా ప్రవర్తించింది. తొమ్మిది నెలలు మోసి కని పెంచుతున్న తల్లే తన బిడ్డల పాలిట మ్యత్యువైంది.

helthtipscaress


ప్రియుడి మోజులో పడి ఇటీవలే కట్టుకున్న వాడిన కడతేర్చిన ఆ రాక్షసి.. చివరికి తన సుఖానికి అడ్డొస్తున్నారనే నెపంతో పిల్లలను కూడా అత్యంత దారుణంగా చంపేసింది. పట్టుమని పదేళ్లు కూడా నిండని ఆ పిసిపిల్లలకు విషమిచ్చి హతమార్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఉలిక్కిపడే ఈ ఘటన మహాబూబాబాద్ డోర్నకల్ మండలంలోని జోగ్య తండ గ్రామ పంచాయతీలో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి.

పోలీస్ తో అక్రమ సంబంధం..

మంగళ్ తండాకు చెందిన వాంకుడోత్ వెంకటేష్(30), ఉషాలకు ఎనిమిదేళ్ల కిందట పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు నిత్యశ్రీ (05), అబ్బాయి వరుణ్ తేజ (07) ఉన్నారు. అయితే 4 నెలల కిందట వెంకటేష్ అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో అత్తింట్లోనే ఉంటున్న ఉషా.. కొంతకాలంగా ఓ పోలీస్ అధికారితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు అనుమానాలున్నాయి. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 5న ఇంటి వద్ద ఆడుకుంటున్న పిల్లలు ఉన్నట్టుండి సృహతప్పి పడిపోయారు. వాంతులతోపాటు విరోచనాలు కావడంతో వెంకటేష్ తల్లి కంగారుపడిపోయింది. ఏం జరిగిందని ప్రశ్నించగా అమ్మ ఉషా కూల్డ్రింక్ తాగించిందని చెప్పారు. వెంటనే బాబాయ్ రాంబాబు సహాయంతో పిల్లలను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. రోజుల చికిత్స అనంతరం పిల్లల శరీరంలో గడ్డిమందు అవశేషాలు ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.


Sexual assault: ముగ్గురు బాలికలపై 18మంది మైనర్ బాలురు లైంగిక దాడి!


ఎలుకల మందు తాగి...

పిల్లల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. దీంతో ఉషాను బంధువులంతా నిలదీయగా కూల్డ్రింక్లో గడ్డిమందు కలిపి తాగించినట్లు అంగీకరించింది. ఆ భయంతోనే ఉషా కూడా ఎలుకల మందు తాగింది. ఆమెను గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. అయితే రెండు వారాల తర్వాత వరుణ్తేజ్ కోలుకోగా నిత్యశ్రీ చనిపోయింది. నిత్యశ్రీ పోస్టుమార్టం తర్వాత డోర్నకల్ సీఐ బీ రాజేశ్ కుటుంబ సభ్యులకు డెబ్ బాడీనీ అప్పగించే క్రమంలో బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఉషా కావాలంటూ ఆంబులెన్స్ ముందు ధర్నా చేశారు. ఇక వెంకటేష్ తమ్ముడు రాంబాబు వదినపై ఫిర్యాదు చేయడంతో 10న హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఉషా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఉషాకు ఓ పోలీస్ అధికారితో అక్రమ సంబంధం ఉందని, అందుకే ఈ ఘోరానికి పాల్పడిందని బంధువులు ఆరోపించారు. దీంతో దీనిపై కూడా దర్యప్తు చేసి నిందితులను పట్టుకుంటామని సీఐ రాజేశ్ హామీ ఇచ్చారు.

Jharkhand shocker gang rape minor girl 12to16 age 18 members raniya area: Jharkhand shocker: జార్ఖండ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి నుంచి తిరిగి వస్తున్న ఐదుగురు గిరిజన బాలికపై 18 మంది మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

 Jharkhand shocker: జార్ఖండ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి నుంచి తిరిగి వస్తున్న ఐదుగురు గిరిజన బాలికపై 18 మంది మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

helthtipscaress


ఈ ఘటన రానియా ప్రాంతంలో జరిగింది. ఒక వివాహం నుంచి బాలికలు ఇంటికి తిరిగి వస్తుండగా ఈ దారుణం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 18 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 


16 ఏళ్లకు పైబడిన బాలురను పెద్దలుగా పరిగణించి విచారిస్తామని పోలీసులు తెలిపారు. ''18 మందిని అరెస్ట్ చేశాం. అందరూ మైనర్లే. ఈ కేసులో అన్ని బాధిత బాలికలకు ప్రభుత్వం తరుఫున అన్ని సౌకర్యాలు కల్పిస్తాము'' అని జార్ఖండ్ డీజీపీ అనురాగ్ గుప్తా చెప్పారు. మన సమాజంలో అబ్బాయిలు ఇలాంటి నీచమైన పనులు చేయకుండా ఉండేందుకు, 16 ఏళ్లకు పైబడిన వారిని పెద్దలుగా పరిగణిస్తామని చెప్పారు. ఈ కేసులో 12-17 వయసు గల నిందితులను జువైనల్ హోమ్‌కి పంపించారు. 


సోమవారం, సామూహిక అత్యాచారానికి గురైన బాలికలకు వైద్య పరీక్షలు జరిపించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఐదుగురు బాలికలపై బాలురు అత్యాచారం చేశారని, బాలికల్లో ముగ్గురు 12-16 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారని, ఆ అమ్మాయిలు రానియాలోని ఒక వివాహ వేడుకకు హాజరై ఇంటికి తిరిగి వస్తున్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. దీనిపై కుటుంబీకులు రానియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత ఆదివారం వెలుగులోకి వచ్చిందని ఖుంటీ ఎస్పీ అమన్ కుమార్ తెలిపారు. నిందితులపై పోక్సో, అత్యాచార చట్టాల కింద కేసులు నమోదు చేశారు.

Pumpkin Seeds benefits of eating pumpkin seeds include boosting bone health, sexual gumadi kaaya ginjalu

 Pumpkin Seeds : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా సరైన టైమ్ కి ఆహారమైన నిద్ర అయినా ఉండడం లేదు. దీనికి గల కారణం వారి బిజీ లైఫ్ లో వచ్చే జీవనశైలిలో మార్పులు.

gumadi kaaya
helthtipscaress


మరి మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి. ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి.. వీటన్నిటికీ సమాధానం… గుమ్మడికాయ గింజలు. అవును… గింజలను తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నాణ్యత మైన నిద్రను కూడా పొందవచ్చు. ఈరోజుల్లో నాణ్యతమైన నిద్ర ఎవరికి కూడా లేదు. కంటి నిండా నిద్ర ఉంటేనే ఆరోగ్యం కూడా బాగుంటుంది. అటువంటి సుఖమైన నిద్రనివ్వగలిగే శక్తి. ఈ గుమ్మడి గింజలకు ఉంది. ఆరోగ్యకరమైన ఆహారాలలో గుమ్మడి గింజలు కూడా మొదటి స్థానం దక్కింది. కా బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ గుమ్మడి గింజలు సహాయపడతాయి. శరీరాన్ని నిర్విషికరణ చేయటానికి కూడా ప్రత్యేకంగా సహాయపడుతుంది. గింజలలో ఎన్నో పోషకాలు కూడా దాగి ఉన్నాయి. తీసుకుంటే ఒక నిద్ర కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం…


Pumpkin Seeds : మంచి నిద్ర కావాలా… అయితే నిద్రకు ముందు ఒక్క స్పూన్ ఈ గింజలు తిన్నారంటే… హాయిగా నిద్రిస్తారు…?

ఇప్పుడు చాలామంది కూడా ఒబేసిటీ తో బాధపడుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి ఈ గుమ్మడి గింజలు ఒక అద్భుతమైన ఔషధం. వీటిల్లో చియా గింజలు, అవిసె గింజలు, జనపనార గింజలు, నువ్వులు, పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడికాయ గింజలు అన్నీ కూడా ముఖ్యమైనవి. ముఖ్యంగా శరీరాన్ని బరువు తగ్గించుకొనుటకు, ఇంకా శరీరాన్ని నిర్వీకరణ చేయటానికి ఎంతో దోహదపడుతుంది. వీటన్నిటిలో కూడా గుమ్మడి గింజలు చాలా పోషకాలను కలిగి ఉన్నాయి. తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ విత్తనాలను రోజుకు ఒక్క టేబుల్ స్పూన్ తింటే చాలు మీ శరీరానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఈ గింజలు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాదు మెదడు పనితీరును కూడా ప్రభావితం చేస్తాయి. గుమ్మడికాయ గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఈ గింజల వల్ల రక్తపోటు కూడా నియంత్రించబడుతుంది. ఉండే సక్రమంగా పనిచేయగలదు.


ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా కలిగి ఉంటాయి. (LDL) వంటి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ (HDL)ను పెంచుతుంది. గుమ్మడి గింజల్లో ట్రిప్ట్ ఆఫ్ ఆన్ అనే ఏమైనా ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇది సెరటోనిన్, మెలతోనిన్ అనే శరీరం సహజనిద్ర హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. రోజు కూడా పడుకునే ముందు ఒక టేబుల్ స్పూన్ తింటే మంచి నాణ్యత మైన నిద్ర మీ సొంతం అవుతుంది. ఇందులో మెగ్నీషియం కండరాలు, నరాలను మరింత సడలింప చేస్తుంది. ఈ విత్తనాలలో జింక్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. జ్ఞాపకశక్తి కూడా పెంచబడుతుంది. ముఖ్యంగా జింకు నరాల సిగ్నలింగ్, మెదడు అభివృద్ధిలో కూడా ముఖ్యపాత్రను పోషించగలదు. గుమ్మడికాయ గింజల్లో జింక్, విటమిన్ ఇ ఎక్కువగా ఉంటాయి. జింకు గాయాలను నయం చేయగలదు. ఇంకా జలుబుతో పోరాడడానికి ఎంతో సహాయపడుతుంది. ఇంకా విటమిన్ E ఏంటి ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. వాపులను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

vitaminD hair fall sun set sweat pain శరీరంలో విటమిన్ డి లోపాన్ని అనేక లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. దీన్ని సకాలంలో అర్థం చేసుకోవడం మరియు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. లేకపోతే ఈ లోపం పెద్ద సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. మీ శరీరంలో తగినంత విటమిన్ డి ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలో చూద్దాం.

 శరీరంలోని అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయడానికి రోజుకు 20-40 ఎంజీ/ఎంఎల్ విటమిన్ డి అవసరం. ఈ స్థాయి తక్కువగా ఉంటే, అది శరీరంలోని వివిధ అవయవాల పనితీరుకు అంతరాయం కలిగించవచ్చు.

శరీరంలో విటమిన్ డి లోపాన్ని అనేక లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. దీన్ని సకాలంలో అర్థం చేసుకోవడం మరియు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. లేకపోతే ఈ లోపం పెద్ద సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. మీ శరీరంలో తగినంత విటమిన్ డి ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలో చూద్దాం.

helthtipscaress


భరించలేని కండరాల నొప్పి.

విటమిన్ డి లోపం వల్ల కండరాల నొప్పి వస్తుంది. చాలా మంది దీనిని అలసిపోతున్నట్టుగా భావిస్తారు. ఇది సహజమే అనుకుని నిర్లక్ష్యం చేస్తుంటారు. కొన్నిసార్లు అది మీరనుకునేంత తేలికైనది కాకపోవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా ఈ సమస్య తగ్గకపోతే, మీరు వెంటనే అప్రమత్తం కావాలి.


ఆందోళన, ఒత్తిడి కలుగుతుందా..

వేసవిలో చెమటలు పట్టడం సహజమే, కానీ మామూలు సమయాల్లో మీ నుదిటిపై అనుకోకుండా చెమట కనిపించడం గమనించినట్లయితే మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈ విటమిన్ సెరోటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి మరియు మెదడు సరైన పనితీరుకు చాలా అవసరం. ఈ హార్మోన్ మానసిక స్థితిని నియంత్రించడంలో సహాయపడుతుంది. తగినంత విటమిన్ డి తీసుకోకపోవడం వల్ల మానసిక స్థితిలో మార్పులు, ఆందోళన మరియు నిరాశ కలుగుతాయి.


జుట్టు రాలడం:

విటమిన్ డి లోపం వల్ల కూడా జుట్టు రాలుతుంది. చాలామంది దీనిని జన్యుపరమైన సమస్యగా భావిస్తారు. అయితే, ఇది విటమిన్ డి లోపం వల్ల కూడా సంభవించవచ్చు. ఈ విటమిన్ లోపం తలపై ఫోలికల్స్ ఏర్పడటానికి దారితీస్తుంది. ఫలితంగా, జుట్టు సమస్యలు మొదలవుతాయి. విటమిన్ డి లోపం యొక్క లక్షణాలలో కీళ్ల నొప్పులు కూడా ఒకటి. ఈ విటమిన్ లోపం వల్ల ఉబ్బరం, విరేచనాలు మరియు మలబద్ధకం వంటి సమస్యలు కూడా వస్తాయి.


విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి..

విటమిన్ డి సూర్యకాంతి నుండి లభిస్తుందని దాదాపు అందరికీ తెలుసు. రోజుకు 15-30 నిమిషాలు ఎండలో గడపడానికి ప్రయత్నించండి. ఉదయం 7-10 గంటల మధ్య వచ్చే సూర్యకాంతి మరింత మెరుగ్గా ఉంటుంది. అలాగే, మీరు మీ ఆహారంలో తగినంత మొత్తంలో విటమిన్ డి ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అంటే చేపలు, పుట్టగొడుగులు, పాల ఉత్పత్తులు, గుడ్డు సొనలు మరియు తృణధాన్యాల ఆహారాలు. సమస్య సహజంగా పరిష్కారం కాకపోతే, మీరు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.