Neck Black Removal. Helth Tips Articelshow
BachPain Treatment Articelshow
Knee పెయిన్.మోకాళ్ల నొప్పులు relief Articleshow
Migrain Head Pain Articleshow
మైగ్రేన్ (పార్శ్వపు తలనొప్పి)
తరచుగా తలనొప్పి వస్తే అశ్రద్ధ చేయకూడదు. తలనొప్పి రావడానికి చాలా కారణాలున్నాయి. రక్తపోటు వల్ల మెదడులో కణతుల వల్ల, రక్తనాళాలలో రక్తప్రసరణలో మార్పుల వల్ల, మానసిక ఒత్తిడి వల్ల, నిద్రలేమి వల్ల వచ్చే అవకాశం ఉంది. మగవారిలో రక్తపోటు, మానసిక ఒత్తిడి, మెదడులోని కణుతుల వల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పి స్త్రీలలో అధికంగా చూస్తుంటాం. ఈ తలనొప్పి చాలావరకు తలకు ఒక పక్క భాగంలో వస్తుంది. వాంతులతో కూడిన తలనొప్పి ఉంటుంది. మైగ్రేన్ రావడానికి తలలోని రక్తనాళాలు ఒత్తిడికి లోనయి వాచడం వల్ల వస్తుంది.
పార్శ్వపు తలనొప్పికి కారణాలు:
పార్శ్వపు తలనొప్పికి ముఖ్యకారణం మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడి. అనవసరపు ఆలోచనలు, జరిగిపోయిన విషయాలను తరచుగా ఆలోచించడం వల్ల వస్తుంది.
డిప్రెషన్, నిద్రలేమి వల్ల వస్తుంది.
కొంతమంది బయటకు వెళ్లినప్పుడు, సూర్యరశ్మి ద్వారా తలనొప్పి వస్తుంది.
అధికంగా ప్రయాణాలు చేయడం వల్ల వస్తుంది.
స్త్రీలలో హార్మోన్ల సమస్యలు ఏర్పడినప్పుడు వసుంది. ఋతుచకం ముందు గాని. తర్వాత గానివచ్చే అవకాశం ఉంటుంది. గర్భధారణ సమయంలో, స్త్రీలలో ఋతుచక్రం ఆగిపోయినపుడు, ఈ సమస్య తీవ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది.
oral contraceptive pills వాడినప్పుడు ఎక్కువగా వస్తుంది.
మైగ్రేన్ దశలు - లక్షణాలు:
చాలా వరకు మైగ్రేన్ దానంతటదే తగ్గిపోతుంది. సాధారణంగా 24 గంటల నుండి 72 గంటలు ఉన్నట్లయితేStatus Migrainosus అంటారు. మైగ్రేన్ నొప్పి 4 దశలలో సాగుతుంది
ప్రాడ్రోమ్ ఫేస్: ఇది నొప్పికి ముందు 2గం||నుండి 2
రోజుల ముందు జరిగే ప్రక్రియ సమూహం. ఈ దశలో చిరాకు, మానసిక ఆందోళన, డిప్రెషన్, ఆలోచనలో మార్పులు రావడం, వాసన, వెలుతురు పడకపోవడం, మెడనొప్పి ఉంటాయి.
ఆరపేస్: ఈ దశ నొప్పి మొదలయ్యే కొద్ది నిమిషాల
ముందు ఉంటుంది. దృష్టిలో చూపు కాస్త మందగించినట్లవడం, చూపులోZigzag lines రావడం, తలలో సూదులతో గుచ్చినట్లవడం, మాటలు తడబడటం, కాళ్లలో నీరసం ఉండటం
నొప్పి దశ: ఈ నొప్పి దశ 2గం.ల నుండి 3 రోజుల
వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఈ దశలో వాంతు లు ఉంటాయి. చాలావరకు ఒకవైపునే ఉంటుంది. కాంతికి, ధ్వనికి వారు సెన్సిటివ్గా ఉంటారు. చాలా
పోస్ట్ డ్రోమ్ ఫేస్: నొప్పి తగ్గిన తర్వాత, కొద్దిరోజుల వరకు తల భారంగా ఉండటం, నీరసంగా ఉండటం, శ్రద్ధలేకుండా ఉండటం జరుగుతుంది.
వ్యాధి నిర్ధారణ:
రక్త పరీక్షలు - CBP, ESR
రక్తపోటును గమనించడం
EEGపరీక్ష
సి.టి. స్కాన్ (మెదడు)
MRI
మెదడు పరీక్షలు ఉపకరిస్తాయి
మైగ్రేన్ తలనొప్పి రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు...
మానసిక ఆందోళన తగ్గించుకోవాలి.
అతిగా ఆలోచనలు చేయకూడదు. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. దీని కోసం, యోగా, ప్రాణాయామం చేయాలి. ధ్యానం ద్వారా
మానసిక ప్రశాంతత లభిస్తుంది.
తలకు నూనెతో మసాజ్ చేయించుకోవాలి. తలలోని నరాలు రిలాక్స్ అవుతాయి.
తలనొప్పి వచ్చినప్పుడు ప్రశాంత వాతావరణంలో, లైటు తీసేసి నిశ్శబ్దంగా ఉన్నచోట పడుకోబెట్టాలి.
హోమియో వైద్యం:
మైగ్రేన్ తలనొప్పికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. తలనొప్పి... ఘాటైన వాసనలు పీల్చినప్పుడు వస్తే, బెల్లడోనా, లైకోపోడియం, ఇగ్నీషియా ఇవ్వాలి. తరచు తలనొప్పి అధికంగా వస్తే - నేట్రమూర్, సాంగ్యునేరియా, చైనా, సెపియా ఇవ్వాలి. గర్భవతుల్లో తలనొప్పి వస్తే బెల్లడోనా, నక్స్వామికా, సెపియా ఇవ్వాలి. ఎక్కువగా చదవడం వల్ల వస్తే కాల్కేరియా కార్బ్, నేట్రమ్ మూర్, ట్యుబర్కులినమ్ ఇవ్వాలి. ప్రయాణాల వల్ల తలనొప్పి వస్తే - ఇగ్నీషియా, సెపియా, కాక్యులస్, కాలికార్బ్ ఇవ్వాలి. స్కూల్కి వెళ్లే ఆడపిల్లలలో వస్తే కాల్కేరియాఫాస్, నేట్రమ మూర్, పల్సటిల్లా ఇవ్వాలి. పైన తెలిపిన మందులు కేవలం అవగాహనకు మాత్రమే. మందులను నిష్ణాతులైన హోమియో డాక్టర్ని సంప్రదించి తీసుకోవాలి.
Kindy Stones. కిడ్నీలో రాళ్లు - హోమియో చికిత్స
కిడ్నీలో రాళ్లు - హోమియో చికిత్స
మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లకు సరైన చికిత్స అందించకపోతే వాటి పనితీరు మందగించి మూత్రపిండాలవ్యాధికి కారణమవుతాయి. దాంతో ఆరోగ్యం దిగజారుతుంది. సకాలంలో హోమియో చికిత్స అందిస్తేఈ సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు.
కారణాలు: శారీరకశ్రమ తక్కువగా ఉండటం,
తగినన్ని నీళ్లు తాగకపోవడం, కుటుంబచరిత్ర, స్థూలకాయం, మద్యపానం వంటివి ముఖ్యకారణాలు. ఇక దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, పుట్టుకనుంచి ఒకటే కిడ్నీ లేదా చిన్నకిడ్నీలు ఉండటం, పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ లాంటి వ్యాధులతో బాధపడేవారిలోనూ కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
లక్షణాలు: తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి
రావడం, మూత్రం తక్కువపరిమాణంలో రావడం, రక్తస్రావం వల్ల ఎరుపురంగులో మూత్రవిసర్జన కావడం, కడుపునొప్పి, వికారం, ఆకలి తగ్గడం, మలవిసర్జన అవుతున్నట్లుగా ఉండటం, అకస్మాత్తుగా లేదా తరచు వాంతులు, జ్వరం రావడం వంటివి జరుగుతాయి.
నివారణ: రోజూ శారీరక వ్యాయాయం, నడక,
నాలుగు నుంచి ఐదు లీటర్ల మంచినీళ్లు తాగడం, మద్యపానానికి దూరంగా ఉండటం, ఆక్సిలేట్ ఎక్కువగా ఉండే పాలకూర, టొమాటో, సోయాబీన్, చాక్లెట్లను పరిమితంగా తీసుకోవడం ద్వారా స్టోన్స్ సమస్యను నివారించవచ్చు లేదా మరింత పెరగకుండా చేయవచ్చు.
చికిత్స: హోమియో వైద్యం ద్వారా వీటిని శాశ్వతంగా నయం చేయవచ్చు.
ఒక పథకం ప్రకారం మూవీ రివ్యూ అండ్ రేటింగ్:Oka Pathakam Prakaaram Review-articleshow
పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిద్దార్థ్ నీలకంఠ (సాయిరాం శంకర్) డ్రగ్స్ బానిస అవుతాడు. తనకు సన్నిహితురాలైన దివ్య (భానుశ్రీ) హత్య కేసులో నిందితుడిగా ఇరుక్కుపోతాడు. దాంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ హోదా నుంచి కోర్టు తొలగిస్తుంది. తాను నిరపరాధిని అని కోర్టులో డిఫెన్స్ లాయర్ చినబాబు (కళాభవన్ మణి)తో పోటీ పడలేకపోతాడు. ఈ పరిస్థితుల్లో డిఫెన్స్ లాయర్ భార్య శ్వేత హత్యకు గురి అవుతుంది. ఆ నేరం కూడా సిద్దార్థ్పైనే పడుతుంది. ఇలా సీరియల్ మర్డర్స్తో సిద్దార్థ్ లైఫ్ అగమ్యగోచరంగా మారిపోతుంది.
సిద్దార్థ్ డ్రగ్స్కు ఎందుకు బానిస అయ్యాడు? తన భార్య సీత (ఆషిమా నర్వాల్)కు ఏమైంది? అదృశ్యమైన సీత కోసం సిద్దార్థ్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? దివ్యను ఎవరు హత్య చేశారు? మర్డర్ కేసులను ఏసీపీ కవిత (శృతి సోది), రఘురామ్ (సముద్రఖని) ఎలా దర్యాప్తు చేశారు. హత్య కేసుల్లో సిద్దార్థ్ను పక్కా పథకం ప్రకారం ఇరుకించే ప్రయత్నం చేశారు? చివరకు హంతకుడిని సిద్దార్థ్ పట్టుకొన్నాడా? తాను నిర్దోషినని సిద్దార్థ్ ఎలా నిరూపించుకొన్నాడు? హత్యలకు పాల్పడుతున్న హంతకుడి ఆట ఎలా కట్టించాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఒక పథకం ప్రకారం సినిమా కథ.
దర్శకుడు వినోద్ కుమార్ విజయన్ విషయానికి వస్తే.. మర్డర్ మిస్టరీ పాయింట్ రాసుకొన్న విధానం.. దానిని ఆడియెన్స్లో క్యూరియాసిటీ పెంచేలా సన్నివేశాలను డిజైన్ చేసుకొన్న విధానంతో సక్సెస్ సాధించాడు. ఫస్టాఫ్లో ఆయన టేకింగ్ విషయంలో కొంత తడబాటు కనిపించినా..సెకండాఫ్లో ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లేతో స్టోరిని గ్రిప్పింగ్గా నేరేట్ చేయడమే కాకుండా సన్నివేశాలను పరుగులు పెట్టించాడు. సాయిరాం శంకర్ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్కు తగినట్టుగా సిద్దార్థ్ పాత్రను డిజైన్ చేసి ఆయన నుంచి మెచ్యురిటీతో కూడిన పెర్ఫార్మెన్స్ను రాబట్టుకొన్నాడు. కేవలం మర్డర్, సస్పెన్స్ థ్రిల్లర్గానే కాకుండా మంచి లవ్ స్టోరీతో, సిద్ శ్రీరామ్తో ఫీల్ గుడ్ పాటలతో ఆడియెన్స్ మంచి అనుభూతిని పంచారు.
ఇక నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. సాయిరాం శంకర్ యాక్టింగ్ బాగుంది. లాయర్గా, భార్యను మిస్ అయి డ్రగ్స్ బానిసైన భర్తగా, మర్డర్ మిస్టరీని ఛేదించే ఇన్వెస్టిగేటర్గా పెర్ఫార్మెన్స్కు స్కోప్ ఉన్న పాత్రలో మెప్పించారు. సినిమా భారాన్నంత తన భుజాల మీద వేసుకొని పూర్తిగా తన పాత్రకు న్యాయం చేశాడు. ఇక సముద్రఖని ఓ పెక్యులర్ డైలాగ్ డెలివరీతో కామెడీ పండిస్తే.. శృతి సోది, కళాభవన్ మణి, ఆషిమా నర్వాల్ అందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
అలాగే సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫి, స్క్రీన్ ప్లే ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. సిద్ శ్రీరామ్ పాడిన రెండు పాటలు కూడా మంచి ఫీల్తో తెర మీద కనిపించాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన గోపి సుందర్ సెకండాఫ్లో చాలా సీన్లను భారీగా ఎలివేట్ చేశారు. దర్శకుడు అనుసరించిన స్క్రీన్ ప్లేకు తగినట్టుగా సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ విభాగాలు చక్కటి సహకారం అందించారు. నిర్మాతలు వినోద్ కుమార్ విజయన్, గార్లపాటి రమేష్, సహనిర్మాతలు జీను మల్లి, స్వాతి కల్యాణి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ సినిమాకు చాలా మంది నేషనల్ అవార్డు విన్నర్స్ పనిచేయడం విశేషంగా చెప్పుకోవాలి.
ఒక పథకం ప్రకారం సినిమా గ్రిప్పింగ్గా, ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లేతో సాగే లవ్, ఎమోషనల్ డ్రామా. మర్డర్ మిస్టరీగా రూపొందిన ఈ సినిమాలో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్టాఫ్లో కొంత నిదానంగా నడిచినప్పటికీ.. సెకండాఫ్ రేసీగా సాగి మంచి అనుభూతిని పంచుతుంది. స్క్రీన్ ప్లేలో ఉండే దమ్ముతోనే కథలో విలన్ గుర్తించడానికి పట్టుకొంటే పదివేలు అనే పోటీని పెట్టడం వారికి సినిమాపై ఉన్న నమ్మకానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఒక పథకం ప్రకారం తప్పకుండా నచ్చుతుంది. మాస్ ఆడియెన్స్ పక్కాగా ఆకట్టుకొనే అంశాలు ఉన్నాయి. ఈ వారం కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చూడాలనుకొనే వారు ఈ సినిమాను థియేటర్లో తప్పకుండా చూడాల్సిన థ్రిల్లర్ మూవీ.
పట్టుదల' మూవీ రివ్యూ - Pattudala Review
కథ
అర్జున్ (అజిత్), కయాల్ (త్రిష) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. పన్నెండేళ్ల తరువాత వైవాహిక బంధానికి కయాల్ స్వస్తి పలకాలని అనుకుంటుంది. కయాల్కు వివాహేతర సంబంధం ఉంటుంది. ఇక ఈ విషయం తెలిసినా కూడా తాను ఎంతో ప్రేమించిన కయాల్కు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు అర్జున్. కానీ కయాల్ మాత్రం విడాకులు కోరుకుంటుంది. ఈ క్రమంలో కయాల్ తన పుట్టింటికి వెళ్దామని నిశ్చయించుకుంటుంది. కయాల్ను తన పుట్టింట్లో దిగబెట్టేందుకు అర్జున్ వస్తానని అంటాడు. అదే తమ చివరి ప్రయాణం అవుతుంది కదా.. తానే దగ్గరుండి దిగబెట్టి వస్తానని అర్జున్ అంటాడు. ఈ ప్రయాణంలో అర్జున్, కయాల్కు ఎదురైన సమస్యలు ఏంటి? కయాల్ను ఎవరు కిడ్నాప్ చేస్తారు? అసలు కయాల్, అర్జున్లకు ఎదురైన సమస్యలు ఏంటి? ఈ ప్రయాణంలో దీపిక (రెజీనా), రక్షిత్ (అర్జున్ సర్జా)ల పాత్ర ఏంటి? చివరకు తన భార్యను కాపాడుకునేందుకు పట్టుదలతో అర్జున్ చేసిన పోరాటాలు, ప్రయత్నాలు ఏంటి? అన్నది థియేటర్లో చూడాల్సిందే.








