ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపున కొబ్బరి నీళ్లు త్రాగితే ఏం జరుగుతుందో తెలుసా.?
కొబ్బరి నీళ్లను త్రాగటం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి అందరికి తెలిసిందే. దాంట్లో మన శరీరానికి కావలిసిన ఎన్నో రకాల పోషక పదార్దాలు సమృద్ధిగా ఉన్నాయి.
పొటాషియం సోడియం, డైటరీ ఫైబర్, విటమిన్ -సి మెగ్నీషయం,కాల్షియమ్,సెలీనియం. వంటి ఎన్నో విటమిన్లు మినరల్స్ కొబ్బరి నీటిలో ఉంటాయి. వీటి వలన మనకు సంపూర్ణ పోషకాహారం అందడమే కాదు పలు అనారోగ్యాలు కూడా దూరమవుతాయి.
ప్రతి రోజు ఉదయాన్నే పగడుపున కొబ్బరి నీళ్లు తీసుకోవటం వలన ఏమేమి జరుగుతుందో మీకు తెలుసా. ముఖ్యమైన తాజా వార్తలు, ఉత్తమ కధనాలు.
నిత్యం ప్రతి రోజు ఉదయానే పరగడుపున 50 నుండి 70 ML మేతదులో కొబ్బరి నీళ్లు త్రాగితే దానితో మనకు ఏంటో ప్రయోజనము కలుగు తుందంట. ఆ ప్రయోజనాలుఎమిటొ ఇప్పుడు తెలుసుకుందాం.
- కొబ్బరి నీళ్లను ఉదయానే పరగడుపున తాగటం వలన శరీరములో డిహైడ్రైషన్ కు గురి కాకుండా ఉంటుంది. దింతో శరీరములో ఉన్న ద్రవాలు సమతుల్యములో ఉంటాయి. శరీరానికి కావలిసినవ్ముఖ్యమైన మినరల్స్ ఎలెక్ట్రోలైట్స్ ఉదయాన్నే అందుతాయి. కాబ్బటిఇ రోజంతా ఉత్సహముగా ఉండవచ్చు.
- మెదడు పనితీరు మెరుగు పడుతుంది. నరాల సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. కండరాలకు పుష్టి కలుగుతుంది.
- గుండె సంబంధిత సమస్యలు దూరమవుతున్నాయి. రక్త ప్రసరణ మెరుగు పడుతుంది.
- కొబ్బరి నీళ్లలో సైటొకినిన్స్ అనబడే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి వృధాప్యపు ఛాయలు దూరముగా చేస్తాయి. చర్మము కాంతివంతముగా మారేలా చేస్తాయి.
- జీర్ణ సంబంధిత సమస్యలు తొలగి పోయాయి. ప్రధానముగా ఆ జీర్ణం గ్యాస్ అసిడిటీ మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారికి ఉపశమనం కలుగుతుంది.
- శరీర రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. దింతో వివిధ రకాల ఇన్ఫెక్షన్ కు వ్యతిరేకముగా పోరాడే శక్తీ మనకు లభిస్తుంది.
- రక్తములో ఉండే చెడు కొలస్ట్రాల్ తగ్గుతుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి మేలు చేస్తుంది.
- బీపీ అదుపులోకి వస్తుంది. చర్మ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.