స్రవంతి చొక్కరపు బయోగ్రఫీ
స్రవంతి ఆంధ్రప్రదేశ్లోని కదిరి.. అనంతపురంలో పుట్టి పెరిగింది. 2009లో చదువు పూర్తి అయిన తర్వాత మోడలింగ్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత యాంకర్గా మారి పలు టీవీ ఛానల్ లో పనిచేసింది. ప్రస్తుతం బెస్ట్ ఆఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్లో యాంకర్ గా చేస్తోంది. ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షోతో పాటు జబర్దస్త్లోని కొన్ని ఎపిసోడ్లలో మెరిసింది. కాగా స్రవంతి... ప్రశాంత్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ పవన్ కళ్యాణ్ కి వీరాభిమానులు కావడంతో వీరి కుమారుడికి అఖిరా నందన్ అని పేరు పెట్టారు.