అధిక రక్తపోటు
పరిచయం
అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్) ఈ రోజుల్లో సాధారణంగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్య. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం ప్రపంచంలో సంభవించే '8' మరణాలలో ఒకరు హైపర్ టెన్షన్ తో మరణిస్తున్నారు. ప్రజలకు ప్రాణాంతకమైన వ్యాధులలో ఇది 3వ స్థానంలో ఉంది.
రక్త పోటు అంటే
మానవ శరీరంలో రక్త ప్రసరణ హృదయ సంకోచాల (systolic pressure), వ్యాకోచ (Diostolic pressure) వలన జరుగుతుంది. గుండె ధమనుల నుండి రక్తం శరీర కణజాలాలకు చేరాలంటే పీడనం (pressure) కావాలి. దీనినే రక్తపోటు/ బి.పి (బ్లెడ్ ప్లెజర్) అంటారు. బ్లడ్ ప్రెజర్ ను స్పిగ్నోమానోమీటర్ ద్వారా లెక్కిస్తారు. హృదయ సంకోచం అంటే గుండె కొట్టుకుంటున్నపుడు రక్తనాళాలలో ఉండే పీడనం, హృదయ వ్యాకోచమంటే గుండె విశ్రాంతిలో ఉన్నపుడు (ప్రతిరెండు చపుళ్ళకు మధ్య వ్యవధి) రక్తనాళాలలో ఉండే పీడనం. దీనిని mmhg (పాదరసపు మిల్లిమీటర్) లో కొలిచి, హృదయ సంకోచం / హృదయ వ్యాకోచం గా సూచిస్తారు. పై సంఖ్య ఎక్కువగా, క్రిందిసంఖ్య తక్కువగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న వారిలో రక్తపోటు 120/80 గా ఉంటుంది. కాని కొన్ని కారణాల వల్ల బి.పి ఎక్కువ అవ్వడం కాని తక్కువ అవ్వడం గాని జరుగుతుంది. రెండింటిలో ఏదైనా ఆరోగ్యానికి మంచిది కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన ప్రకారం హృదయ సంకోచం 160 mmhg కంటే అధికంగా ఉండి, హృదయ వ్యాకోచం 95 mmhg కంటే అధికంగా ఉన్నప్పుడు అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్) అంటాము.
అధిక రక్తపోటు గురించి కొన్ని నిజాలు
- అధిక రక్తపోటు వ్యాధి కాదు. మనకు ఇతర ఆరోగ్య సమస్యలు అంటే గుండె సంబంధిత వ్యాధులైన ఊబకాయం, మధుమేహం, మూత్రపిండాల వ్యాధుల లాంటివి తీవ్రమైనపుడు కనిపించే లక్షణం.
- మన దేశంలో 25% పురుషులు, 24% స్త్రీలు ఈ సమస్యతో బాధపడుతున్నారు.
- ఈ సమస్య 20-30 సంవత్సరాల వయస్సు వారిలో 13.6% ఉంది. 80 సంవత్సరాల వయస్సు, అంతకన్నా ఎక్కువ వయస్సు వారిలో 54.4% ఉంది. సాధారణ శరీర పరిమాణాలతో ఉన్న వారిలో ఈ సమస్య వచ్చే అవకాశం 26% ఉండగా, ఊబకాయం ఉన్న వారిలో 48% ఉంది.
- గ్రామాలలో నివసించే వారి కంటే పట్టణాలలో నివసించే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
- రక్తపోటు అధికంగా ఉన్నవారిలో రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బ తింటుంది. అందువల్ల గుండె, మూత్రపిండాలు, మెదడు దెబ్బతింటాయి గుండెపోటు అవకాశాలు ఎక్కువ అవుతాయి.
అధిక రక్తపోటుకి గల కారణాలు
- గుండె సంబంధిత వ్యాధులు
- మూత్రపిండ వ్యాధులు
- మెదడు, అడ్రినల్ గ్రంథిలో కణతులు ఏర్పడ్డపుడు
- హైపర్ థైరాయిడ్ సమస్యల వలన
- అండాశయ వ్యాధులు, ఊబకాయం ఉన్న వారు
- పిట్యుటరీ గ్రంథి సక్రమంగా పనిచేయనపుడు
- కొంత మందిలో ఇది వారసత్వంగా సక్రమించవచ్చు
- ఒత్తిడికి గురవ్వడం, మద్యంసేవించడం, ధూమపానం చేయడం కూడా కారణాలే
- మధుమేహులలో సగానికి పైన ఈ సమస్యతో బాధపడుతున్నారు.
- హార్మోన్ల అసమతుల్యత
- రక్తంలో ఎర్ర రక్తకణాల అసమతుల్యత కూడా కారణమే.
ఇవే కాకుండా సాల్ట్ సెన్సిటివిటి, ఆహారం సరిగా తీసుకోకపోవడం, వయస్సు పైబడ్డాక జరిగే మార్పులు కూడా కారణాలే. సాల్ట్ (ఉప్పు)సెన్సిటివిటి - ఉప్పు అంటే సోడియం క్లోరైడ్. కొందరి శరీరాలు సోడియం వలన స్పందిస్తాయి, మరికొందరిలో అది ఉండదు. స్పదించేవారిలో అధికరక్తపోటు వచ్చేఅవకాశాలు ఎక్కువ.
అధిక రక్తపోటు రకాలు
లక్షణాలు
మాములుగా కొన్ని సార్లు ఎటువంటి లక్షణాలు కనపడకుండానే రక్తపోటు అధికమైపోతుంది. కాని కొంత మందిలో తలనొప్పి, అలసట, కళ్ళు తిరగడం, చూపు మందగించడం, మతిమరుపు, ఊపిరి తీసుకోవడంలో సమస్యలు, ఛాతిలో నొప్పి, జీర్ణ వ్యవస్థలో సమస్యల లాంటివి కనిపిస్తాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- అధిక రక్తపోటుతో బాధపడేవారు ఆహార నియమాలపై శ్రద్ధ వహిస్తే వ్యాధి వలన కలిగే అనర్థాలను అదుపు చేసుకోవచ్చు.
- ఆహారం ద్వారా శరీరానికి లభించే కెలరీలను తగ్గించుకోవాలి. కెలరీలు, క్రొవ్వులు తక్కువగా, ప్రోటీన్లు సాధారణ మోతాదులో అంటే 60గ్రా. / 1 రోజుకి లభించేలా ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
- సోడియం లభించే పదార్థాలను చాలా వరకు తగ్గించుకోవాలి. ఎందుకంటే సోడియం వల్ల రక్తపోటు ఇంకా అధికం అయ్యే అవకాలున్నాయి. ప్రోటీన్లు లభించే పదార్థాలలో సోడియం అధికంగా ఉంటుంది.అందుకే రక్తపోటు మరీ అధికంగా ఉన్నప్పుడు ప్రోటీన్లు రోజు కు 20 గ్రా. కంటే అధికంగా తీసుకోవడం అంత మంచిది కాదు.(అత్యధికంగా రక్తపోటు ఉన్నప్పుడు మాత్రమే).
- రక్తపోటు అధికంగా ఉన్నవారు బరువు పెరుగుదలను నియంత్రించుకుంటూ ఉండాలి. అందువల్ల క్రొవ్వు పదార్థాలకు అంటే వేపుళ్ళు, కేకులు, జంక్ ఫుడ్స్ కి చాలా వరకు దూరంగా ఉండాలి.
- క్రొవ్వు పదార్థాలు తీసుకున్నప్పటికి మంచి క్రొవ్వులైన HDL లభించే ఆహారపదార్థాలు ఉండేలా చూసుకోవాలి. మాంసాహారం నుండి లభించే క్రొవ్వులను, డాల్డా, వెన్న, హైడ్రోజినేటెడ్ నూనెలను చాలా వరకు తగ్గించుకోవాలి. ఒమెగా-3 క్రొవ్వుల వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
- ఉప్పులో సోడియం అధికంగా ఉంటుంది. ఉప్పు అధికంగా తింటే శరీర ద్రవాల అసమతుల్యత పెరిగి ద్రవాలు అధికమై రక్తపోటుని అధికం చేస్తాయి. *అందువల్ల ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. బీ.పి. ఉన్నవారు రోజుకి 2-3 గ్రా. ఉప్పు కంటే ఎక్కువ తీసుకోకూడదు. బీ.పి. మరీ ఎక్కువగా ఉంటే రోజుకి 1 గ్రా .ఉప్పును మాత్రమే వాడుకోవాలి.
- పొటాషియం స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు శరీరంలో సోడియం ఎక్కువైపోతుంది. శరీర ద్రవాల నుండి నీటిని పీల్చే గుణం సోడియం కి ఉండడం వల్ల మనిషి ఉబ్బిపోతాడు. శరీరంలో ద్రవాలు పేరుకుపోవడం వల్ల రక్తప్రసరణ ఆటంకం కలిగి రక్తపోటు అధికమైపోతుంది. అందువల్ల పొటాషియం సమపాళ్ళలో ఆహారంలో లభించేలా చూసుకోవాలి. తాజా పండ్లు, ఆకుకూరలు ఆహారంలో చేర్చుకోవటం ద్వారా పొటాషియంను పొందవచ్చు.
- కాల్షియం సమృద్ధిగా తీసుకోవడం వల్ల గుండె రక్తనాళాలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. రక్తప్రసరణ వ్యవస్థలో జరిగే ప్రక్రియలు రక్తనాళాలు తట్టుకునే శక్తిని కాల్షియం ఇస్తుంది. అందువల్ల కాల్షియం లభించే ఆహారపదార్థాలైన పండ్లు, క్రొవ్వు తీసేసిన పాలు, చిరుధాన్యాలు, ఆకుకూరలు విరివిగా తీసుకోవాలి.
- గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండడం వల్ల గుండెను రక్షించే పోషకాలైన పీచు, ఖనిజాలు ఉన్న పదార్థాలు తీసుకోవాలి. రోజు చిరుధాన్యాలు, ఆకుకూరలు, కమలా జాతికి చెందిన పండ్లు తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గించుకోవచ్చు.
- రోజూ 20 నిమిషాలు నడవడం, వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు జరుగుతుంది. అందువల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
- మద్యపానం చేసేవారు మానివేయడం శ్రేయస్కరం లేదా 2 పెగ్గుల కంటే అధికంగా తీసుకోరాదు.
అధిక రక్తపోటుతో బాధపడేవారికి పంచ సూత్రాలుడ్లను, ఆకుకూరలను అధికంగా వారానికి ఒకసారైనా చేపలను తినాలి
- క్రొవ్వు తీసేసిన పాలను తీసుకోవాలి.
- వేపుడ్లు, చిప్స్, కేకులు, బిస్కెట్లు, నూడుల్స్, పిజ్జా లాంటి ట్రాన్స్ క్రొవ్వు పదార్థాలను నిషేధించాలి
- సోడియం లభించే పదార్థాలను నియంత్రించుకోవాలి.
సోడియం అధికంగా ఉండే పదార్థాలు
- పచ్చళ్ళు (నిల్వ చేసినవి),
- అజినామోటో అధికంగా వాడే ఫాస్ట్ ఫుడ్స్ అంటే న్యూడుల్స్, ఫ్రైడ్ రైస్ లాంటివి,
- ఎండు చేపలలో ఉప్పు అధికంగా ఉంటుంది,
- ఆలూ చిప్స్,
- బేకరీ పదార్థాలైన బ్రెడ్లు, కేకులు,
- సాఫ్ట్ డ్రింక్ లు,
- మార్కెట్లలో లభిస్తున్న క్యానెడ్ ఫుడ్స్.
ఆధారం: కుమారి ఐ. ప్రసన్న, విద్యార్ధి, ఐ.డి.నెం: హెచ్.హెచ్. 2012/010.